నకిలీ నోట్ల కేసులో వైసీపీ మహిళా నేత, బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ అరెస్ట్..
Rasaputra Rajini: నకిలీ నోట్ల ముఠాలో రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజని అరెస్ట్ అయ్యారు.
Rasaputra Rajini: నకిలీ నోట్ల ముఠాలో రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజని అరెస్ట్ అయ్యారు. ఈనెల 23న బెంగళూరులోని సుబ్రమణ్యపుర ఠాణా పీఎస్ పరిధిలో రజనిని అదుపులోకి తీసుకున్నారు. రజని నుంచి 40 లక్షల విలువచేసే 500 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రజని.. మోసాలకు పాల్పడి ఐపీ పెట్టారని టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్కుమార్ రెడ్డి ఆరోపించారు. రజనీకి బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇప్పించిన ఎమ్మెల్యే రాచమల్లుకు కూడా ఈ స్కామ్లో భాగముందని ఆరోపించారు.