వైసీపీదీ రక్షాస పాలనంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గంట పాటు ఆయన మౌన దీక్ష నిర్వహించారు. ఉద్దండరాయిని పాలెంలో రాజధానికి శంకుస్ధాపన చేసిన ప్రాంతంలో నిర్వహించిన ఈ దీక్షలో రాజధాని రైతులతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
రాజధాని కోసం రైతులు త్యాగాలు చేశారని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం నిధులిచ్చిందని చెప్పారు. జీఎన్ రావు కమిటీ నివేదిక రాకముందే జగన్ ప్రకటన చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కన్నా ఆరోపించారు. రాజధానిపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాలకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుకు తేడా ఏమి లేదన్నారు. ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా నిర్ణయాలు తీసుకుంటోందని కన్నా విమర్శించారు.