ముగిసిన బీఏసీ సమావేశం.. 7 రోజులు మాత్రమే కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
బీఏసీ సమావేశం ముగిసింది. 9 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని విపక్షం పట్టు పట్టింది. ఈ క్రమంలో సుమారు అరగంటకు పైగా జరిగిన బీఏసీ సమావేశంలో ఓ నిర్ణయానికొచ్చారు.
మొత్తం ఏడు పని దినాలు సభ నిర్వహించాలని బీఏసీ సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. శని, ఆది రెండ్రోజులూ అసెంబ్లీకి సెలవు. కాగా ఈ సమావేశం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు బుగ్గన, కన్నబాబు, అనిల్ కుమార్, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, శాసనసభ ఉపప్రతిపక్షనేత అచ్చంనాయుడు హాజరయ్యారు.