పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. నవయుగ సంస్థ పిటిషన్ మేరకు పోలవరం పనులపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. కొత్త కాంట్రాక్టర్తో ఒప్పందానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్ పిటిషన్కు విలువ ఉండదన్న ఏజీ సదుద్దేశంతో నవయుగ పిటిషన్ దాఖలు చేయలేదని వాదించారు. అడ్వకేట్ జనరల్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు పోలవరం పనులపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది.