వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతికి కీలక పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్గా నందమూరి లక్ష్మీ పార్వతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా పార్టీకి సేవలందిస్తూ వచ్చినందున లక్ష్మీపార్వతికి ఈ పదవి దక్కింది.