దిశ ఘటన మరవక ముందే ప్రకాశం జిల్లాలో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన మరో మానవ మృగం ఘటన వెలుగులోకి వచ్చింది. త్రిపురాంకం మండలం రాజుపాలెంలో బాధితురాలి తల్లిదండ్రులు ఇటుకల పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారు లారీలో ఇటుకలు దిగుమతి చేసేందుకు గిద్దలూరు వెళ్లారు. అదే సమయంలో గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి బాలిక పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కరుణాకర్ రెడ్డిని చితకబాది పోలీసులకు అప్పగించారు.