ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి పలువురికి గాయాలు..

Update: 2019-11-08 15:29 GMT
Accident

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద కంటైనర్ రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలపైకి దూసుకువెళ్ళడంతో పన్నెండు మంది చనిపోగా మరోకొందరికి గాయాలయ్యాయి.ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కంటైనర్ కింద ఆటో, ఓమ్నీ వ్యాన్, బైక్ చిక్కుకున్నాయి. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కంటైనర్ బెంగళూరు నుంచి చిత్తూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు. 

Tags:    

Similar News