ఏపీలో 25 జిల్లాలు.. ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు !

Update: 2019-12-21 07:42 GMT

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. పదేళ్లలో ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాసరావు సహా పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గగొన్నారు. ఈ సందర్బంగా.. కేక్‌ కట్ చేసి, సీఎం వైఎస్ జగన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.

Tags:    

Similar News