Vikarabad Accident: వికారాబాద్‌ ఘటన.. మృతులకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌

Vikarabad Accident: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2022-11-03 08:45 GMT

Vikarabad Accident: వికారాబాద్‌ ఘటన.. మృతులకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌

Vikarabad Accident: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధారూర్ మండలం కేరెల్లి గ్రామ పంచాయతి పరిధిలోని బాచారం మలుపు వద్ద ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆటోలో 11 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ‎ఆదుకోవాలని వికారాబాద్ చౌరస్తాలో బంధువులు, గ్రామస్తులు రాస్తారోకో చేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాగా వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను వికారాబాద్ ఎస్‌పీ కోటిరెడ్డి పరామర్శించారు. ప్రమాద వివరాలను ఎస్‌పీ అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News