Narayanpet: హోలీ పండుగ వేళ.. నీళ్ల ట్యాంకు కూలి చిన్నారి మృతి
Narayanpet: మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు
Narayanpet: హోలీ పండుగ వేళ నారాయణపేట జిల్లా కేంద్రంలో విషాదం జరిగింది. గోపాల్ పేట వీధిలో ఉన్న ఓ మంచినీటి ట్యాంకు కూలీ చిన్నారి లక్ష్మి ప్రణతి మృతి చెందింది. ఘటనలో మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన చిన్నారులను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.