ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు ఆస్తుల వివరాలు బయటపడుతున్నాయి. మార్కెట్ విలువ ప్రకారం మారుతీరావుకు ఆస్తులు సుమారు 200 కోట్లు ఉన్నట్లు పోలీసులు చార్జ్షీట్లో పేర్కొన్నారు. మొదట కిరోసిన్ డీలర్ వ్యాపారం చేసిన మారుతిరావు అనంతరం రైస్ మిల్లు వ్యాపారంలోకి మారారని 15 ఏళ్ల క్రితం రైస్ మిళ్లులను అమ్ముకుని రియల్ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టినట్లు చార్జ్షీట్లో తెలిపారు.
మిర్యాలగూడలో అమృత ఆస్పత్రి పేరుతో 100 పడకల ఆస్పత్రి, భార్య గిరిజ పేరుతో 10 ఎకరాల భూమి, హైదరాబాద్ కొత్తపేట్లో 400 గజాల ప్లాట్, హైదరాబాద్లోని పలు ఏరియాల్లో 5 అపార్ట్మెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడలో షాపింగ్మాల్, శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో 100 విల్లాలను మారుతీరావు అమ్మినట్లు సమాచారం. ఈదులగూడెం క్రాస్ రోడ్డులో షాపింగ్మాల్, మారుతిరావు తల్లిపేరుపై రెండంతస్తుల భవనం, మిర్యాలగూడ బైపాస్లో 22 గుంటల భూమిని ఛార్జిషీట్లో ఇంట్లో దొరికిన ఆస్తుల వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.