Mancherial: ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం.. ఆపరేషన్ ఆలస్యం కావడంతో నవజాత శిశువు మృతి
Mancherial: మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృతి చెందింది.
Mancherial: మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృతి చెందింది. కాగజ్నగర్కు చెందిన పద్మను డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గర్భిణిని డెలవరీ కోసం ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లిన వైద్యులు 2గంటల అయిన రాకపోవడంతో.... కుటుంబ సభ్యులు ఆస్పత్రికి సిబ్బందిని ప్రశ్నించారు. పాపకి హార్ట్ బీట్ కోట్టుకోవడం లేదని.. పాప చనిపోయిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ముందు బాధితులు నిరసన తెలిపారు.