Hyderabad: విషాదం.. ఉమెన్స్ హాస్టల్లో ఎంబీఏ విద్యార్థిని సూసైడ్
Hyderabad: యువతి మృతిపై ఫిర్యాదు చేసిన పేరెంట్స్
Hyderabad: హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. యువతి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పేరెంట్స్ ఛైతన్యపురి పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామన్నారు పోలీసులు.