Hyderabad: తరచూ రోడ్డు ప్రమాదాలు.. హయత్నగర్లో స్థానికుల ఆందోళన
Hyderabad: హయత్నగర్లోని నేషనల్ హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని..
Hyderabad: తరచూ రోడ్డు ప్రమాదాలు.. హయత్నగర్లో స్థానికుల ఆందోళన
Hyderabad: హయత్నగర్లోని నేషనల్ హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్- విజయవాడ హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతున్నారు. ఆందోళనలో స్థానిక కార్పొరేటర్లతో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులు అక్కడి నుంచి పంపించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.