పార్టీ మారిన ఎమ్మెల్యేకు కీలక పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్

Update: 2020-02-08 12:09 GMT
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కేబినెట్ హోదా కలిగిన పదవిని ఇచ్చారు సీఎం కేసీఆర్. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు.

క్యాబినెట్‌ హోదా కలిగిన ఈ పదవిలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చైర్మన్‌గా మూడేళ్లపాటు కొనసాగనున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన సుధీర్‌ రెడ్డి.. అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి హామీ ఇవ్వడంతో పార్టీలో చేరుతున్నట్లు అప్పట్లో ప్రకటించారు.

Tags:    

Similar News