అల్లుడిని కత్తితో పొడిచి చంపిన అత్త

Update: 2020-10-29 07:52 GMT

అల్లుడిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అనితా తన కుమార్తె వందనను నవీన్ కిచ్చి ఆరు నెలల క్రితం వివాహం చేసింది. ఐతే పెళ్లైన నెలకే వందన ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో నవీన్ పై మీర్ పేట్ పీఎస్ లో అనిత కేసు పెట్టింది. భార్య ఆత్మహత్య కేసులో న‌వీన్‌ జైలుకు వెళ్లాడు. ఇటీవ‌లే న‌వీన్ జైలు నుంచి విడుద‌ల అయ్యాడు. విష‌యం తెలుసుకున్న అత్త అనిత‌ తన ఇంటికి వచ్చి అల్లుడిపై క‌త్తితో దాడి చేసి చంపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనలు అన్నింటికి వివాహేతర సంబంధాలే కారణంగా తెలుస్తోంది.

Tags:    

Similar News