హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలో మొసళ్ల కలకలం
Hyderabad: ఉప్పర్పల్లి సమీపంలో మూసీనదిలో మొసళ్లు
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలో మొసళ్ల కలకలం
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలో మొసళ్ల కలకలం రేపుతున్నాయి. ఉప్పర్పల్లి సమీపంలో మూసీ నదిలోని బండ రాళ్లపై దర్జాగా సేద తీరుతున్నాయి. మొసళ్లను చూసి భయబ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులతో కలిసి మూసిలో ఆపరేషన్ క్రొకోడైల్ను చేపట్టారు. మూసిలోకి దిగొద్దని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మున్సిపల్ సిబ్బంది సైతం అలెర్ట్ అయ్యి మూసి నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు.