హాజీపూర్ వరుస హత్యల కేసులో సంచలన తీర్పు
హాజీపూర్ వరుస హత్యల కేసులో ఫోక్సో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది.
హాజీపూర్ వరుస హత్యల కేసులో ఫోక్సో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఫోక్సో స్పెషల్ కోర్టు ఉరి శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కూడా నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని వాదనలు వినిపించింది.
ఈ నేపథ్యంలో ఫోక్సో స్పెషల్ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉఠ్కంఠ నెలకొంది. ఇటీవలే సమత హత్య కేసులో నిందితులైన ముగ్గురికి ఉరిశిక్ష పడటంతో.. ఈ హాజీపూర్ వరుస హత్యల కేసులో ఎలాంటి తీర్పు వెలువడనుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమత కేసులో లాగానే ఈ కేసులో కూడా శిక్ష వెలువడ నుందా..? లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సాక్ష్యలు పరిశీలించిన తరువాత కోర్ట్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి కి ఉరి శిక్ష విధించింది.