Coronavirus: తెలంగాణాలో మరో మూడు పాజిటివ్ కేసులు
తెలంగాణలో 36కి చేరుకుంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో 36కి చేరుకుంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. కొద్ది సేపట్లో ప్రగతి భవన్ లో మధ్యాహ్నం ఈ సమావేశం నిర్వహించనున్నారు. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోన పాజిటివ్ గా ఈరోజు తేలింది.
అందులో ఒకరు జర్మనీ నుంచి వచ్చిన చందానగర్ ప్రాంతానికి చెందిన వారు. ఇంకొకరు కోకాపేటకు చెందిన లండన్ నుంచి వ్యక్తి, మరొకరు సౌదీ నుంచి వచ్చిన బేగంపేటకు చెందిన మహిళగా చెబుతున్నారు. ఈ కొద్దిరోజుల క్రితమే రాష్ట్రానికి వచ్చారు. వీరంతా ప్రస్తుతం ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.