హైదరాబాద్లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో పేషెంట్ శరీరంలో బుల్లెట్ కలకలం రేపింది. ఫలక్నుమాకు చెందిన ఆస్మా బేగం శరీరంలో వైద్యులు బుల్లెట్ను గుర్తించారు. ఈ నెల 21న ఆపరేషన్ చేసి పొట్టలో ఉన్న బుల్లెట్ను తీసివేశారు. అయితే ఆ బుల్లెట్ గురించిన ఎలాంటి వివరాలు ఆస్మాబేగం చెప్పలేదు. బుల్లెట్ గురించి వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.