Suryapet: సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత.. అనర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారంటూ ధర్నా
Suryapet: బాధితులపై కారంపొడితో దాడిచేసిన బీఆర్ఎస్ నేతలు
Suryapet: సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత.. అనర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారంటూ ధర్నా
Suryapet: సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రావిపహాడ్, అప్పన్నగూడెంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. డబుల్బెడ్ రూం ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అనర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారంటూ ధర్నాకు దిగారు. అయితే. బాధితులపై కారంపొడితో దాడిచేశారు బీఆర్ఎస్ నేతలు. అంతటితో ఆగకుండా బాధితులకు మద్దతుగా నిలిచిన సీపీఎం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టినట్టు ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు. ఘటనాస్థలానికి చేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.