కరోనా వైరస్ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. తాజాగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)లో పని చేసే ఓ సీనియర్ సైంటిస్ట్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో మొత్తం ఐసీఎంఆర్ బిల్డింగ్ ను శానిటైజ్ చేశారని సమాచారం. ముంబై నుంచి రెండు రోజుల క్రితం ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు నిర్వహించిన పరీక్షలో.. కోవిడ్19 పాజిటివ్ తేలినట్లు సమాచారం. ఆయన ఎవరెవర్ని కాంటాక్ట్ అయ్యారన్న దానిపై కూడా ట్రేసింగ్ జరుగుతున్నట్లు ఐసీఎంఆర్ అధికారులు వెల్లడించారు.