Tollywood Actor Father Died Due To Coronavirus : యువ హీరో తండ్రి కరోనాతో మృతి

Update: 2020-07-09 04:08 GMT

tollywood actor sree father died due to Coronavirus : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి పైన తన ప్రభావం చూపిస్తోంది. టాలీవుడ్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా బారినపడిన నిర్మాత పోకూరి రామారావు ఇటీవల కరోనాతో మృతి చెందగా తాజాగా, టాలీవుడ్ నటుడు, 'ఈ రోజుల్లో' ఫేం హీరో శ్రీ తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. గత 20 రోజులుగా విజయవాడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు.

కాగా ప్రముఖ డైరెక్టర్‌ మారుతి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ రోజుల్లో సినిమాతో శ్రీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడు లవ్‌ సైకిల్, 'పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్' తదితర‌ సినిమాల్లో నటించాడు. మరోవైపు సినీ పరిశ్రమలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు టీవీ నటులు కూడా కరోనా బారిన పడ్డారు. టీవీ నటులు రవికృష్ణ, రాజశేఖర్, సాక్షి శివ, రవికృష్ణ, సీరియల్‌ నటి నవ్య స్వామికి కరోనా సోకిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News