కొత్త సంవత్సరంలో హన్సిక లక్ష్యం ఇదేనట

అల్లు అర్జున్ నటించిన సినిమా 'దేశ ముదురు' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన అందంతో యువతను ఉర్రూతలూగించిన భామ హన్సిక మొత్వాని. ఒకప్పుడు తెలుగులో బాగానే సినిమాలు చేసినప్పటికీ అనుకున్నంత పేరు రావటం రాకపోవడంతో తమిళ్ లోకి షిఫ్ట్ అయిపోయింది.

Update: 2019-01-04 09:36 GMT
Hansika Motwani

అల్లు అర్జున్ నటించిన సినిమా 'దేశ ముదురు' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన అందంతో యువతను ఉర్రూతలూగించిన భామ హన్సిక మొత్వాని. ఒకప్పుడు తెలుగులో బాగానే సినిమాలు చేసినప్పటికీ అనుకున్నంత పేరు రావటం రాకపోవడంతో తమిళ్ లోకి షిఫ్ట్ అయిపోయింది.

కోలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోలతో నటిస్తూ స్టార్డంను ఎంజాయ్ చేస్తోంది హన్సిక. తన ఫ్యాన్ ఫాలోయింగ్ లాగానే తన మనసు కూడా చాలా పెద్దది అంటూ నిరూపిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ. ఈమె ముంబైకు చెందిన 34 మంది పిల్లలను ఆదుకుంది. ఆ అనాధ పిల్లలకు అన్నీ తానై వారిని చూసుకుంటోంది. వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించడం నుండి మంచి చదువు చెప్పించడం వరకు ప్రతి విషయం దగ్గరుండి చూసుకుంటోంది హన్సిక. అయితే ఈ ఏడాది ఆ 34 మంది పిల్లల్లో ఒకరు పదో తరగతి పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరం వేడుకల్లో తన పిల్లలలో ఒకళ్ళు పదో తరగతి పరీక్ష రాయబోతున్నారని, ఆ పిల్లాడు స్టేట్ టాప్ వచ్చేలా శిక్షణ ఇప్పించాలని దానికి తన వంతు కృషి చేస్తానని చెబుతున్న హన్సిక అతనిని టాప్ స్టూడెంట్ గా నిలవడం ఈ సంవత్సరం తాను పెట్టుకున్న ముఖ్య లక్ష్యం అని చెబుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే హన్సిక 'మహా' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తాలూకు ప్రతి పోస్టర్ సంచలనాత్మకంగా మారుతూ ఏదో ఒక కాంట్రవర్సీ కి దారి తీస్తూ వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలయ్యాక మరెన్ని కాంట్రవర్సీలకు తెర తీస్తుందో వేచి చూడాలి.

Similar News