Green India challenge:ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన బ్రహ్మానందం!

Green India challenge: టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ మరొకరిని మొక్కలను నాటాలని ఛాలెంజ్ ఇవ్వడం ట్రెండీగా మారింది.

Update: 2020-06-27 09:15 GMT

Green india challenge:టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ మరొకరిని మొక్కలను నాటాలని ఛాలెంజ్ ఇవ్వడం ట్రెండీగా మారింది..ఇప్పటికే మంత్రి కేటీఆర్‌, కవిత, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, గోపీచంద్‌, ప్రభాస్‌, యాంకర్‌ సుమ, అనసూయ, రష్మి లాంటి వాళ్ళు ఎందరో సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటి మిగతా వారిని మొక్కలు నాటాలని కోరారు..

తాజాగా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా యాంకర్‌ ఉదయభాను విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం స్వీకరించారు..అనంతరం ఆయన ఆయన మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటి ఉదయభానుకు కృతజ్ఞతలు తెలిపారు.దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి..

తాను ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించిన బ్రహ్మానందం కి ధన్యవాదాలు తెలిపారు ఉదయభాను.. సృష్టిని కాపాడేందుకు ఒక్క చెట్టు మాత్రమే ఒంటికాలిపై తపస్సు చేస్తున్నదని ఆమె అన్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, అందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు.

ఇక బ్రహ్మానందం విషయానికి వస్తే సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ స్టార్ కమెడియన్ గా ఎదిగారు.. ఆయన సినిమాల్లో ఉంటే సినిమా హిట్ అనే నమ్మకం దర్శకనిర్మాతలకు ఉండేది.. ప్రస్తుతం ఆయన వయసు రీత్యా ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు.. ఆయన చివరగా త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో అనే చిత్రంలో ఓ సాంగ్ లో గెస్ట్ రోల్ లో కనిపించారు..


Tags:    

Similar News