చంద్రబోస్‌కి ఛాలెంజ్ విసిరినా రామజోగయ్య శాస్త్రి

చంద్రబోస్‌కి ఛాలెంజ్ విసిరినా రామజోగయ్య శాస్త్రి
x
Ramajogayya sastry, chandrabose (File Photo)
Highlights

తెలంగాణా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి మంచి స్పందన వస్తుంది.

తెలంగాణా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి మంచి స్పందన వస్తుంది. సినీ నటుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరు ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. అంతేకాకుండా మరో ముగ్గురిని మొక్కలు నాటల్సిందిగా కోరుతున్నారు. తాజాగా సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తన ఇంటిముందు మొక్కలు నాటి తన తోటి గేయ రచయిత చంద్రబోస్, హీరో రాజ్ తరుణ్, దర్శకుడు తమన్ కి ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. " నాకు మొక్కలన్నా, చెట్లన్నా చాలా ఇష్టం.. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం అభినందనీయం అని అన్నారు. ఇలా ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటి పర్యావరణానికి కృషి చేయాలనీ అన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటల్సిందిగా సినీ కవి చంద్రబోస్, సంగీత దర్శకులు థమన్, సినీ హీరో రాజ్ తరుణ్‌ను కోరుతున్నాను అని రామజోగయ్య శాస్త్రి అన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి సినీ రచయితగా కొనసాగుతున్నారు రామజోగయ్య శాస్త్రి... యువసేన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు సినీ సంగీత దర్శకులందరి దగ్గరి పనిచేసి ఎన్నో పాటలు రాశారు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు వచ్చిన ఖలేజా సినిమాలోని సదా శివ సన్యాసి పాట మంచి పేరును తీసుకువచ్చింది. తాజాగా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలలో మంచి పాటలు రాసి ఆకట్టుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories