ట్రూ లీడర్‌.. సీఎం కేసీఆర్‌కు సోనూ సూద్‌ సెల్యూట్‌

Update: 2020-03-30 10:49 GMT

పొరుగు రాష్ట్రాలకు చెందిన కూలీలు 3.35 లక్షల మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారని నిన్న మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కుకుపోయిన పొరుగు రాష్ట్రాల కూలీలు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూస్తామని తెలిపారు. తెలంగాణలో పని చేస్తున్న పొరుగు రాష్ట్రాల కూలీలందరికీ బియ్యం, పిండి పంపిణీతో పాటు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున నగదు కూడా అందజేస్తామని కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందిస్తూ, కేసీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. 'ట్రూ లీడర్.. శాల్యూట్' అంటూ సోనూ సూద్ ఓ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ తో పాటు మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ ప్రకటన చేసిన వీడియోను జతపరిచాడు.




Tags:    

Similar News