Live Updates: ఈరోజు (14 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-14 01:15 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 14 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి ఉ.08-20 వరకు తదుపరి త్రయోదశి | పుబ్బ నక్షత్రం రా.06-56 వరకు తదుపరి ఉత్తర | వర్జ్యం: రా.01-43 నుంచి 03-13 వరకు | అమృత ఘడియలు మ.12-49 నుంచి 01-18 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-17 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-30 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-14 09:25 GMT

విజయనగరం జిల్లా...

-వేపాడ మండలం కొంపల్లి వద్ద నాటుసారా తయారీకి సిద్దంగా ఉంచిన 200 లీటర్ల బెల్లం ఊటను

-నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి ఎస్ ఈ బి పోలీసులు.

2020-10-14 09:22 GMT

అమరావతి..

-ఇప్పటికే శ్రీకాకుళం లో పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న ప్రభుత్వం

-సెప్టెంబర్ నెల వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ అమలు కోసం 6.05 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు జారీ చేసిన సర్కార్

-వ్యవసాయ మీటర్ల ఏర్పాటుకు నిధులు వినియోగించనున్న ఏ‌పి‌ఈపిడిసిఎల్

2020-10-14 09:18 GMT

ప్రకాశం జిల్లా..

-ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కామెంట్స్...

-ఏపీలో దేశంలోనే తొలిసారిగా పోలీస్ యాప్ ద్వారా పోలీస్ స్టేషన్కు రాకుండానే ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించాం...

-ఈ యాప్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునే అవకాశం సామాన్యులు కూడా కలిగింది...

-ఈ రోజుల్లో మరింత టెక్నాలజీని ఉపయోగించుకుని పోలీస్ సేవలను సామాన్యులకు చేరువ చేస్తాం...

-దేశంలోనే తొలిసారిగా హోంగార్డులకు 30 లక్షల హెల్త్ స్కీమ్ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు...

-హోంగార్డులకు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలు అందిస్తున్నాం...

-గతంలో పిఎస్ కు రావాలంటే మహిళలు భయపడే వాళ్ళు....

-స్పందన లాంటి కార్యక్రమాల ద్వారా మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు...

-పోలీసు వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత భద్రత , భరోసాకల్పిస్తాం...

2020-10-14 09:14 GMT

తూర్పుగోదావరి :

-గత 36 గంటలుగా జలదిగ్భంధంలో డి - 6 సబ్ స్టేషన్..

-ప్రత్యామ్నయంగా కరప విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేపట్టిన అధికారులు..

-రోడ్డు పైనే విధులు నిర్వహిస్తోన్న సబ్ స్టేషన్ సిబ్బంది..

2020-10-14 09:12 GMT

శ్రీకాకుళం జిల్లా..

-ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..

-జిల్లాలోని మెళియాపుట్టిలో ఒకరు చనిపోయినట్లు నివేదిక అందింది..

-ప్రస్తుతం జిల్లాలోని నదులలో నీటి ప్రవాహం సాధారణ స్థాయిలోనే ఉంది..

-జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగినది..

-రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి ముంపు ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు..

-ప్రమాదంలో చనిపోయిన వారికి నష్ట పరిహారం త్వరగా అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు..

-రైతులకు ఎటువంటి నష్టం జరిగినా ఆడుకునే దిశగా చర్యలు తీసుకుంటాం..

-వరద ఉదృతి తగ్గాక జరిగిన నష్టం పై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించాం..

2020-10-14 09:10 GMT

తూర్పుగోదావరి :

-గత రెండు రోజులుగా జలదిగ్భంధంలో టీచర్స్ కాలనీ, వరద నీరు క్రమంగా పెరుగుతుండటంతో భయాందోళనలో స్థానికులు..

-పూర్తిగా వరద నీరు చేరిన పలు కుటుంబాలను ఖాళీ చేయించి సహాయ పునారావ కేంద్రాలకు తరలించిన అధికారులు..

2020-10-14 06:24 GMT

తూర్పుగోదావరి జిల్లా...

-వందలాది ఎకరాల్లో పంట మునక

-ఏలేరు ప్రాజెక్ట్ నుంచి భారీగా విడుదల చేసిన అదనపు జలాలు

2020-10-14 06:21 GMT

పశ్చిమ గోదావరి జిల్లా...

-చింతలపూడి మండలం తమ్మిలేరు జలాశయం వద్ద ప్రమాదకర స్థితిలో క్రిష్ణా, పశ్చిమ జిల్లా ల సరిహద్దు వంతెన..

-ముందుజాగ్రత్తగా రెండు జిల్లా లకు రాకపోకలను నిలిపి వేసిన పోలీసులు.

2020-10-14 06:17 GMT

గుంటూరు ః

-జిజిహెచ్ లో అత్యాచార బాధితురాలు ని పరామర్శించిన తెలుగు మహిళలు,మాహిళా సంఘాలు

-పెదకూరపాడు మండలం పొడపాడు లో ఓ వివాహిత పై అత్యచారం.

-కిరాణా షాపు కు వచ్చిన మహిళా ను నిర్బందించి అత్యాచారం చేసిన శాంతిరాజు.

-రాత్రంతా కనిపించకపోవడంతో గాలించిన బందువులు.

-శాంతి రాజు ఇంట్లో నిర్బంధంలో ఉన్న మహిళా ను గుర్తించిన బందువులు.

-ప్రస్తుతం జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న మహిళా

-జగన్ పాలన లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.

-సీఎం, హోం మంత్రి నివాసం ఉండే జిల్లాలోను అత్యచారాలు ఆగడం లేదు.

-మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మా నోరు మెదపడం లేదు.

-బాధిత మహిళా కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.

2020-10-14 06:12 GMT

ప.గో.జిల్లా...

-మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు

-ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు, ఎర్రకాలవ జలాశయంలోకి చేరుకుంటున్న వరద నీరు

-తమ్మిలేరు నుండి 18వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో ముంపులో ఏలూరు నగరంలోని అశోక్ నగర్ ఏటుగట్టు,YSR కాలనీ, మాదేపల్లి, శ్రీపర్రు

-ఏలూరు, భీమవరం మధ్య నిలిచిపోయిన రాకపోకలు

-ఎర్రకాలవ పొంగటంతో దిగువకు విడుదల చేసిన 22వేల క్యూసెక్కుల వరద నీరు

-లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చిన డిప్యూటీ సిఎం ఆళ్ల నాని.

Tags:    

Similar News