Live Updates:ఈరోజు (జూన్-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-06-30 01:26 GMT

ఈరోజు మంగళవారం, 30 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, దశమి (రా.10:12 వరకు), చిత్త నక్షత్రం (ఉ.07:14 వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు


Live Updates
2020-06-30 17:00 GMT

@ కృష్ణాజిల్లా÷ వత్సవాయి


- కృష్ణాజిల్లా వత్సవాయి మండలం దేచిపాలెం గ్రామ వ్యవసాయ బావిలో ఇనుప బీరువా లభ్యం

- బావిలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల మోటార్లతో నీటిని బయటికి లాగి బీరువా ని వెతికి తీసిన గ్రామస్తులు ,పోలీసులు

- బీరువాలో పలు కీలక పత్రాలు,ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా పుస్తకాలు ,దుస్తులు, వివాహ ఆల్బమ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

- వాటి ఆధారంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పేరిచర్ల గ్రామానికిచెందినవిగా గుర్తించిన పోలీసులు

- గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చెందిన బీరువా వత్సవాయి మండలం దేచి పాలెం గ్రామ వ్యవసాయ బావి లోకి ఎలా వచ్చింది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు పోలీసులు

- ఎవరైనా దుండగులు తీసుకొచ్చి పడేశారు అని అనుమానం వ్యక్తం చేస్తూ మరి ఇంకా ఏదైనా ఆధారాలు దొరుకుతాయా అని బావిలో నీళ్ళు తోడేస్తున్న పోలీసులు

2020-06-30 15:40 GMT

- నెల్లూరులో లిక్కర్ మాఫియా

- నెల్లూరు నగరంలోని కుక్కలగుంటలో భారీ మద్యం డంప్ ని పట్టుకున్న స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు. రూ.3లక్షల విలువ చేసే మద్యం, ఓ వాహనం స్వాధీనం. మెయిన్ బ్రాండ్ల మద్యాన్ని నిల్వచేసి అధిక ధరలకి అమ్మకాలు సాగిస్తున్న ముఠా.

2020-06-30 15:39 GMT

@ తూర్పుగోదావరి జిల్లా

_ చింతూరు మండలం


- మోతుగూడెం లొ సుమారు10 లక్షలరూపాయల విలువచేసే,, 230 కే.జిల గంజాయి పట్టివేత,,,ఆరుగురు వ్యక్తులు,అరెస్ట్,,రెండు వాహనాలు షిజ్,,సీలేరు నుండి భద్రాచలం తరలిస్తుండగా వాహనాల తనికిలలొ పట్టు బడినట్లు ఎస్సై.టి.వి సుబ్బారావు తెలిపారు.

2020-06-30 14:55 GMT

@ అనంతపురం జిల్లా

- రెండు లారీలు ఢీ.....

- డ్రైవర్‌ సజీవ దహనం

- తాడిపత్రి పట్టణం సమీపంలోని కడప రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి.

- ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఓ లారీ డ్రైవర్‌ సజీవదహనమయ్యాడు.

- తాడిపత్రి నుంచి వరిపొట్టు లోడుతో వెళ్తున్న లారీ, కడప వైపు నుంచి నల్లబొగ్గు లోడ్‌తో తాడిపత్రి వైపు వస్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.

- దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బొగ్గు లారీ డ్రైవర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిషార్‌ సజీవదహనమయ్యాడు.

- మరో లారీలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

- స్థానికులు, పోలీసులు గంటపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.

- అనంతరం క్షతగాత్రులను బయటకు తీసి తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు.

2020-06-30 10:46 GMT

- మాస్క్ పెట్టుకోలేదని ఒక దేశ ప్రధానికి జరిమానా విధించారు .

- అంత కఠినంగా ఉంటే తప్ప కరోనాను కట్టడి చేయలేం

- నిబంధనలు పాటించని వారి తీరు మార్చాలి


2020-06-30 10:44 GMT

- మాస్క్ పెట్టుకోలేదని ఒక దేశ

2020-06-30 10:42 GMT

- నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది

- మనం అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నాం

- కంటైన్మెంట్ జోన్ల పై దృష్టి పెట్టాలి 

2020-06-30 10:38 GMT

ప్రారంభం అయిన ప్రధాని ప్రసంగం

- కరోనాతో పోరాడుతూ  అన్ లాక్ 2.0 లోకి ప్రవేశించాం

- లాక్ డౌన్ తో లక్షలాది మంది ప్రాణాలు కాపాడాం

- ఈ దశలో జాగ్రత్తలు అవసరం

- మనదేశంలో కరోనా మరణాల శాతం తక్కువ 

2020-06-30 09:42 GMT

@విజయనగరం జిల్లా

- భోగాపురం మండలం

- అవనాం గ్రామంలో భారీ దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

- జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాజకుమారి..

- 6గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

- 31 లక్షల రూపాయల దొంగ నోట్లు, 65,350 వేల రూపాయల అసలు నగదు, 5 సెల్ ఫోన్లు, జెరాక్స్ మెషీన్, దొంగనోట్ల ప్రింటింగ్ కోసం వాడుతున్న యంత్రాలు స్వాధీనం.

- సవరవిల్లి సంతలో 2 గొర్రెలు కొని 20 వేల రూపాయల దొంగ నోట్లు అంటగట్టిన నిందితులు.

- అనుమానం వచ్చి నిందితులను వెంటాడి పెట్టుకున్న గొర్రెల వ్యాపారి, మరో వ్యాపారుడు.

- భోగాపురం మండలం అక్కివరం గ్రామానికి చెందిన బిటెక్ విద్యార్ధి, మాజీ నేవీ ఉద్యోగి కంది రాము, మజ్జి రమణ, గౌరునాయుడు, లెంక శేఖర్, సురేష్, మొగిలి విజయ్ కిరణ్ అరెస్ట్ 

- విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రధాన నిందితుడు కింది రాము ఇంటిలో దొంగ నోట్ల ముద్రణ

- 5 వేల రూపాయల ఒరిజినల్ నోట్లు ఇస్తే... 15వేల రూపాయల దొంగ నోట్లు ఇవ్వటానికి పలువురితో ఒప్పందం.

2020-06-30 09:36 GMT

  -రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్ నుండి ప్రారంభించనున్న 104, 108అంబులెన్సు వాహనాలు...

- బెంజ్ సర్కిల్ లో ఏర్పాట్లును మంగళవారం పరిశీలించిన ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతి యాజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు...

Tags:    

Similar News