Live Updates:ఈరోజు (జూలై-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-20 01:34 GMT
Live Updates - Page 2
2020-07-20 05:05 GMT

బీసీ కార్పొరేషన్‌పై ఏపీ సీఎం జగన్ సమావేశం

- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నేడు సీఎం జగన్ సమావేశం కానున్నారు.

- ఉదయం 11 గంటలకు బీసీ కార్పొరేషన్‌పై అధికారులతో సమావేశమై చర్చించనున్నారు.

- మధ్యాహ్నం అముల్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొనే అంశం పై చెర్చించనున్నారు.

- పూర్తి వివరాలు


2020-07-20 04:42 GMT

హరితహారం పథకానికి తూట్లు పొడుస్తున్న అధికారులు

- సర్కార్ మానస పుత్రిక పథకం. అలంటి పథకానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు.

- నాటిన హరితాహారం చెట్లు, మొక్కలతో కలకలలాడాల్సిన ప్రాంతం మొత్తం బీడు భూములను తలపిస్తున్నాయి.

- ఆదిలాబాద్ లో 2019 - 20 సంవత్సరానికి గాను లక్షల మొక్కలు నాటారు.

- ఒక్క బోద్ మండలంలోనే 10, 749 మొక్కలు నాటారు.

- పూర్తి వివరాలు


2020-07-20 04:35 GMT

టీడీపీ అదినేత చంద్రబాబు పై మంత్రి బొత్స ఆగ్రహం

- టీడీపీ అదినేత చంద్రబాబు పై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేసారు.

- చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాయటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు బొత్స.

- లేఖలో చంద్రబాబు ఒక్క నిజం కుడా చెప్పలేదని విమర్శించారు.

- 8 కిలోమీటర్ల అభివృధి కోసం లక్షల కోట్లు కర్చు పెట్టారని విమర్శించారు.

- పూర్తి వివరాలు


2020-07-20 04:29 GMT

కరోనాతో తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు మృతి

- శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాస మూర్తి దీక్షితులు మృతి.

- కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ దీక్షితులు.

- ఆసుపత్రిలో చిక్తిస పొందుతూ మృతి చెందారు.

- పూర్తి వివరాలు 

2020-07-20 04:08 GMT

రాజమండ్రిలో కరోనా చికిత్స కోసం 8 హాస్పిటల్స్

రాజమండ్రిలో కరోనా చికిత్స కోసం 8 హాస్పిటల్స్ కి పర్మిషన్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు

1 డిస్ట్రిక్ట్ హాస్పిటల్

2 సాయి హాస్పిటల్

3 కిమ్స్ బొల్లినేని హాస్పిటల్

4 రాజు న్యూరో హాస్పిటల్

5 శ్రీలత హాస్పిటల్

6 డెల్టా హాస్పటల్

7 నవీన్ ఎమర్జెన్సీ హాస్పిటల్

8 యూనివర్సల్ హాస్పిటల్

ఈ హాస్పిటల్స్ లో కరోనా కి వైద్యం చేసే అధికారాలు ఇచ్చారు

2020-07-20 03:49 GMT

విజయవాడలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో లాక్ డౌన్!

విజయవాడ:

- నగరంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడానికి సన్నాహాలు.....

- మొత్తం 21 క్లస్టర్లలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు.....

- ఆయా ప్రాంతాల్లో సోమవారం నుండి రాకపోకలపై నియంత్రణ.....

- బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్న అధికార యంత్రాంగం.....

కోవిడ్19 క్లస్టర్లు

పటమట, కృష్ణలంక, కొత్తపేట, మొగల్రాజపురం, విద్యాధరపురం, అజిత్ సింగ్ నగర్, భవానీపురం, చుట్టుగుంట, సత్యనారాయణపురం, వించిపేట, చిట్టినగర్.....

2020-07-20 03:46 GMT

ఈరోజు నీటి పారుదలశాఖ అధికారులతో కేసీఆర్ భేటీ

►హైదరాబాద్‌: మధ్యాహ్నం నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ భేటీ..

►ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, నీటి సద్వినియోగంపై చర్చ..

►నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణపై ముసాయిదాను సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్న అధికారులు..

2020-07-20 03:44 GMT

అరసవెల్లి ఆలయంలో దర్శనాలు నిలిపివేత!

శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేత..

►నేటి నుంచి ఈ నెల 31వరకు దర్శనాలు నిలిపివేత, నిత్యపూజలు యథాతథం..

2020-07-20 03:38 GMT

సచివాలయ పరీక్షలు వాయిదా?

ఏపీలో కోవిద్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో సచివాలయ పరీక్షలను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకుంది. వారం రోజుల నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరీక్షలను ఆగష్టు రెండో వారంలో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది.

- పూర్తి వివరాలు 

2020-07-20 03:37 GMT

జూనియర్ కాలేజీల సిబ్బందికి సడలింపు

కరోనా మహమ్మారి విలయతాండవంతో ఏపీలో అన్ని పనులకు ఆటంకం ఏర్పడింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగడంతో పాటు మరణాలు సైతం ఎక్కువగానే సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మరిన్ని పనులను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఉపాద్యాయులంతా పాఠశాలలకు వెళ్లి హాజరు కావాలని ఆదేశించడం జరిగింది.

- పూర్తి వివరాలు 

Tags:    

Similar News