Live Updates:ఈరోజు (జూలై-11) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-07-11 01:30 GMT

ఈరోజు శనివారం, 11 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం షష్ఠి(ఉ. 12-44 వరకు) తదుపరి సప్తమి, పూర్వాభాద్ర నక్షత్రం (ఉ.5-42వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం.. అమృత ఘడియలు (మ.2-51 నుంచి 4-37 వరకు), వర్జ్యం (సా.4-16 నుంచి 6-02 వరకు) దుర్ముహూర్తం (ఉ. 5-36 నుంచి 7-19 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-35

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-07-11 18:53 GMT

విజయవాడ:

◆1450 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల..

◆ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం.

◆మున్నేరు వాగు నుంచి ప్రకాశం బ్యారేజీకి 11,500 క్యూసెక్కుల వరద ప్రవాహం..

బ్యారేజీ గేట్లు తెరవడంతో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు..

2020-07-11 18:43 GMT

- బాలీవుడ్ నటుడు.. బిగ్ బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

- కొద్ది సేపటి క్రితమే అమితాబ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ముంబాయిలోని నానావతి హాస్పిటల్ లో చేరారు.

- ఈ క్రమంలో అమితాబ్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.

- అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు. 

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

2020-07-11 11:23 GMT

- క‌రోనాను క‌ట్ట‌డి చెయ్య‌డానికి ప‌రీక్ష‌ల విష‌యంలో ఇప్ప‌టికే ముందు వ‌రుస‌లో ఉన్న ఏపీ స‌ర్కార్..కోవిడ్-19 ట్రీట్మెంట్ ను ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి తీసుకొచ్చింది.

- క‌రోనాకు వైద్యం అదించే హాస్పిట‌ల్స్ ను మానిటరింగ్ కోసం ఐఏఎస్ ఆఫిస‌ర్ రాజమౌళిని నియమించింది.

- అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు చేయడాన్ని మరింత సులభతరం చేసింది.

-. ఎవరైనా కరోనా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ఇంట్లోనే కూర్చొని అధికారులకు చెబితే చాలు.

-. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఓ ట్వీట్ చేశారు. దాని ప్రకారం 

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా కోవిడ్-19 చేయించుకోవాలి అనుకుంటే.. (https://covid-andhrapradesh.verahealthcare.com/person/register ) క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలు. అధికారులు వారిని సంప్రదించి వారికీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు. 

2020-07-11 11:11 GMT


- చాల రోజుల తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు వచ్చారు.

- గత రెండు వారాలుగా ఫామ్‌ హౌస్‌లో ఉన్న కేసీఆర్ ఈరోజు కొద్ది సేపటి క్రితం ప్రగతి భవన్ కు వచ్చారు.

-  అభివృద్ధి పనులపై, కరోనా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

- రైతులతో జరపాలనుకుంటున్న సమావేశానికి సంబంధించి ఒక నిర్ణయం ఈరోజు తీసుకోవచ్చని చెబుతున్నారు.

2020-07-11 07:07 GMT

- లంచం తీసుకుంటూ ఏసీబీకి ట్రాప్ అయిన శంకరయ్య కు పాత నేరస్తుల తో సంబంధాలు

- రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన చిగురిపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు కి

- పలు రకాలు గా సహాయం చేసినట్లు శంకరయ్య పై ఆరోపణలు

- జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డి కి సహరికించిన ఇన్ స్పెక్టర్

- జయరాం, శిఖా రెడ్డి కాల్ రికార్డ్ లు చేసేందుకు నిందితుడికి సహకారం

- దుండిగల్ ఇన్ స్పెక్టర్ గా ఉన్న సమయంలో రాకేష్ రెడ్డి తో కలిసి ల్యాండ్ సెటిల్ మెంట్లు

- ఇన్ స్పెక్టర్ శంకరయ్య కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు

- ఇప్పటికే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం 40 కోట్లు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ

2020-07-11 07:05 GMT

- నిర్మల్ జిల్లా బాసర మండలం కౌట గ్రామంలో ప్రేమ. పెళ్లి చేసుకున్న యువతి పై కుటుంబ సభ్యుల దాడి..

- యువతి మంజుశాకు తీవ్ర గాయాలు

- బైంసా అసుపత్రికి తరలింపు

- కదం‌రాజును ప్రేమించి పెళ్లి చేసుకున్నా మంజుశా

2020-07-11 07:01 GMT

విజయనగరం: హెచ్ఎంటివి ఈతమానువలస 15 మంది గ్రామ బహిష్కరణ కధనానికి స్పందించిన సాలూరు మెజిస్ట్రేట్, మండల అధికారులు.

- పాచిపెంట మండలం ఈతమానువలసలో గ్రామ బహిష్కరణ చేసిన 15 మందిని గ్రామంలోకి తీసుకెళ్ళి హోమ్ క్వరంటేన్ చేసిన అధికారులు.

- కరోనా పాజిటివ్ కాంటాక్ట్ వ్యక్తులనే నెపంతో మూడు రోజుల క్రితం గ్రామం నుండి బయటకు పంపించేసి ఊరు చివరన వదిలేసిన గ్రామస్తులు.

- ఘటనపై మండిపడ్డ సాలూరు మెజిస్ట్రేట్

- పాచిపెంట రెవిన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెజిస్ట్రేట్.

- కరోనా పాజిటివ్ కాంటాక్ట్ వ్యక్తులపై వివక్ష చూపకూడదని గ్రామస్తులకు చూచన.

- 15 మంది కుటుంబ సభ్యులను ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశం.

2020-07-11 06:58 GMT

- లాక్ డౌన్ లో ఆక్సిజన్ సిలిండర్ల అమ్నుతున్న మోసగాళ్లు..

- అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్ అమ్ముతున్న ముఠాలు..

- హైదరాబాదులోని 2 ముఠా ల పై దాడి చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్..

- 34 ఆక్సిజన్ సిలిండర్ స్వాధీనం..

- అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్ అమ్ముతున్న ముఠా..

- ఒక్కొక్క సిలిండర్ కు లక్షల రూపాయల ను వసూలు చేస్తున్న ముఠా.

- సిలిండర్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి అప్పగించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ..

- సిలిండర్ల అమ్మకాల పై దృష్టి సారించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్.

- ఎవరైనా అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు చర్యలు తప్పవు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ..

2020-07-11 06:49 GMT

ఢిల్లీ: హెల్త్ బులిటెన్

(కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ)

. 8 లక్షల దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

• గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 519 మంది మృతి

• దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916

• దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,83,407

• “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,15,385

• “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123

గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,82,511 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు

ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు.

2020-07-11 06:36 GMT

- ఆంధ్ర ప్రదేశ్:ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.

- సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో ఈ నెల 15న ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.

- పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో మంత్రివర్గం చర్చించనుంది.

- పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

- ఇప్పటికే కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.

- ఈ నెల 13 సాయంత్రం నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని స్పష్టం చేశారు.

Tags:    

Similar News