Live Updates:ఈరోజు (జూలై-11) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-11) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు శనివారం, 11 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం షష్ఠి(ఉ. 12-44 వరకు) తదుపరి సప్తమి, పూర్వాభాద్ర నక్షత్రం (ఉ.5-42వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం.. అమృత ఘడియలు (మ.2-51 నుంచి 4-37 వరకు), వర్జ్యం (సా.4-16 నుంచి 6-02 వరకు) దుర్ముహూర్తం (ఉ. 5-36 నుంచి 7-19 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • ప్రకాశం బ్యారేజీ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల..
    11 July 2020 6:53 PM GMT

    ప్రకాశం బ్యారేజీ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల..

    విజయవాడ:

    ◆1450 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల..

    ◆ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం.

    ◆మున్నేరు వాగు నుంచి ప్రకాశం బ్యారేజీకి 11,500 క్యూసెక్కుల వరద ప్రవాహం..

    బ్యారేజీ గేట్లు తెరవడంతో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు..

  • అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్
    11 July 2020 6:43 PM GMT

    అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్

    - బాలీవుడ్ నటుడు.. బిగ్ బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

    - కొద్ది సేపటి క్రితమే అమితాబ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ముంబాయిలోని నానావతి హాస్పిటల్ లో చేరారు.

    - ఈ క్రమంలో అమితాబ్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.

    - అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు. 

    మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

  • మీ ఇంటి వద్ద నుంచే కరోనా టెస్ట్ లకు నమోదు చేయించుకోవచ్చు.. ఏపీ ప్రభుత్వ వినూత్న కార్యక్రమం
    11 July 2020 11:23 AM GMT

    మీ ఇంటి వద్ద నుంచే కరోనా టెస్ట్ లకు నమోదు చేయించుకోవచ్చు.. ఏపీ ప్రభుత్వ వినూత్న కార్యక్రమం

    - క‌రోనాను క‌ట్ట‌డి చెయ్య‌డానికి ప‌రీక్ష‌ల విష‌యంలో ఇప్ప‌టికే ముందు వ‌రుస‌లో ఉన్న ఏపీ స‌ర్కార్..కోవిడ్-19 ట్రీట్మెంట్ ను ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి తీసుకొచ్చింది.

    - క‌రోనాకు వైద్యం అదించే హాస్పిట‌ల్స్ ను మానిటరింగ్ కోసం ఐఏఎస్ ఆఫిస‌ర్ రాజమౌళిని నియమించింది.

    - అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు చేయడాన్ని మరింత సులభతరం చేసింది.

    -. ఎవరైనా కరోనా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ఇంట్లోనే కూర్చొని అధికారులకు చెబితే చాలు.

    -. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఓ ట్వీట్ చేశారు. దాని ప్రకారం 

    ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా కోవిడ్-19 చేయించుకోవాలి అనుకుంటే.. (https://covid-andhrapradesh.verahealthcare.com/person/register ) క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలు. అధికారులు వారిని సంప్రదించి వారికీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు. 

  • ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్
    11 July 2020 11:11 AM GMT

    ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్


    - చాల రోజుల తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు వచ్చారు.

    - గత రెండు వారాలుగా ఫామ్‌ హౌస్‌లో ఉన్న కేసీఆర్ ఈరోజు కొద్ది సేపటి క్రితం ప్రగతి భవన్ కు వచ్చారు.

    -  అభివృద్ధి పనులపై, కరోనా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

    - రైతులతో జరపాలనుకుంటున్న సమావేశానికి సంబంధించి ఒక నిర్ణయం ఈరోజు తీసుకోవచ్చని చెబుతున్నారు.

  • ఇన్ స్పెక్టర్ శంకరయ్య విషయంలో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు
    11 July 2020 7:07 AM GMT

    ఇన్ స్పెక్టర్ శంకరయ్య విషయంలో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు

    - లంచం తీసుకుంటూ ఏసీబీకి ట్రాప్ అయిన శంకరయ్య కు పాత నేరస్తుల తో సంబంధాలు

    - రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన చిగురిపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు కి

    - పలు రకాలు గా సహాయం చేసినట్లు శంకరయ్య పై ఆరోపణలు

    - జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డి కి సహరికించిన ఇన్ స్పెక్టర్

    - జయరాం, శిఖా రెడ్డి కాల్ రికార్డ్ లు చేసేందుకు నిందితుడికి సహకారం

    - దుండిగల్ ఇన్ స్పెక్టర్ గా ఉన్న సమయంలో రాకేష్ రెడ్డి తో కలిసి ల్యాండ్ సెటిల్ మెంట్లు

    - ఇన్ స్పెక్టర్ శంకరయ్య కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు

    - ఇప్పటికే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం 40 కోట్లు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ

  • పెళ్లి చేసుకున్న యువతి పై కుటుంబ సభ్యుల దాడి..
    11 July 2020 7:05 AM GMT

    పెళ్లి చేసుకున్న యువతి పై కుటుంబ సభ్యుల దాడి..

    - నిర్మల్ జిల్లా బాసర మండలం కౌట గ్రామంలో ప్రేమ. పెళ్లి చేసుకున్న యువతి పై కుటుంబ సభ్యుల దాడి..

    - యువతి మంజుశాకు తీవ్ర గాయాలు

    - బైంసా అసుపత్రికి తరలింపు

    - కదం‌రాజును ప్రేమించి పెళ్లి చేసుకున్నా మంజుశా

  • హెచ్ఎంటివి ఇంపాక్ట్...
    11 July 2020 7:01 AM GMT

    హెచ్ఎంటివి ఇంపాక్ట్...

    విజయనగరం: హెచ్ఎంటివి ఈతమానువలస 15 మంది గ్రామ బహిష్కరణ కధనానికి స్పందించిన సాలూరు మెజిస్ట్రేట్, మండల అధికారులు.

    - పాచిపెంట మండలం ఈతమానువలసలో గ్రామ బహిష్కరణ చేసిన 15 మందిని గ్రామంలోకి తీసుకెళ్ళి హోమ్ క్వరంటేన్ చేసిన అధికారులు.

    - కరోనా పాజిటివ్ కాంటాక్ట్ వ్యక్తులనే నెపంతో మూడు రోజుల క్రితం గ్రామం నుండి బయటకు పంపించేసి ఊరు చివరన వదిలేసిన గ్రామస్తులు.

    - ఘటనపై మండిపడ్డ సాలూరు మెజిస్ట్రేట్

    - పాచిపెంట రెవిన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెజిస్ట్రేట్.

    - కరోనా పాజిటివ్ కాంటాక్ట్ వ్యక్తులపై వివక్ష చూపకూడదని గ్రామస్తులకు చూచన.

    - 15 మంది కుటుంబ సభ్యులను ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశం.

  • వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ఆకస్మిక దాడులు
    11 July 2020 6:58 AM GMT

    వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ఆకస్మిక దాడులు

    - లాక్ డౌన్ లో ఆక్సిజన్ సిలిండర్ల అమ్నుతున్న మోసగాళ్లు..

    - అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్ అమ్ముతున్న ముఠాలు..

    - హైదరాబాదులోని 2 ముఠా ల పై దాడి చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్..

    - 34 ఆక్సిజన్ సిలిండర్ స్వాధీనం..

    - అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్ అమ్ముతున్న ముఠా..

    - ఒక్కొక్క సిలిండర్ కు లక్షల రూపాయల ను వసూలు చేస్తున్న ముఠా.

    - సిలిండర్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి అప్పగించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ..

    - సిలిండర్ల అమ్మకాల పై దృష్టి సారించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్.

    - ఎవరైనా అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు చర్యలు తప్పవు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ..

  • . భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్.
    11 July 2020 6:49 AM GMT

    . భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్.

    ఢిల్లీ: హెల్త్ బులిటెన్

    (కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ)

    . 8 లక్షల దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

    . గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

    • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 519 మంది మృతి

    • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916

    • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,83,407

    • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,15,385

    • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123

    గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,82,511 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు

    ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు.

  • ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఈనెల 15న
    11 July 2020 6:36 AM GMT

    ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఈనెల 15న

    - ఆంధ్ర ప్రదేశ్:ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.

    - సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో ఈ నెల 15న ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.

    - పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో మంత్రివర్గం చర్చించనుంది.

    - పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

    - ఇప్పటికే కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.

    - ఈ నెల 13 సాయంత్రం నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని స్పష్టం చేశారు.

Print Article
Next Story
More Stories