Live Updates:ఈరోజు (జూలై-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-07-09 01:31 GMT

ఈరోజు గురువారం, 09 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, కృష్ణపక్షం, చవితి (ఉ.10:10 వరకు), శతభిష నక్షత్రం (తె.03:09 వరకు) సూర్యోదయం 5:48am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు



Live Updates
2020-07-09 15:48 GMT

-  తూర్పుగోదావరి జిల్లా ఏటపాక మండలం లక్ష్మీపురం వద్ద140 లీటర్ల నాటు సారా స్వాధీనం.

- చింతూరు మండలం పేగ నుండి ఏటపాక మండలం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్న ఏటపాక పోలీసులు.

- ఐదుగురు వ్యక్తులు అరెస్ట్.

- మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం..

2020-07-09 15:47 GMT

 - ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ హోంగార్డు కిరణ్ పై దాడికి యత్నించిన యువకులు ...

- ట్రాఫిక్ విధుల్లో భాగంగా రాంగ్ రూట్ లో వచ్చిన యువకులను ఫోటో తీసిన హోం గార్డ్ కిరణ్...

- హోంగార్డు పై దాడి చేసే సమయంలో యవకులు ప్రశ్నించేందుకు ట్రాఫిక్ ఎస్ఐ శేఖర్ అసభ్యకర పదజాలంతో ద్వేషించిన యువకులు...

- ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యం థియేటర్ వద్ద విధులకు ఆటంకం కలిగించి దాడికి యత్నించిన ముగ్గురు...

- ఆ యువకులపై ఫిర్యాదు చేసిన ట్రాఫిక్ ఎస్ఐ, కేసు నమోదు ..

2020-07-09 15:45 GMT

- అనంతపురం: ఉరవకొండలో పడిపోయిన మహిళ ఘటన పై కలెక్టర్ గంధం చంద్రుడు సీరియస్.

- తక్షణమే వైద్య సేవలు అందేలా ఆదేశాలు.

- జాయింట్ కలెక్టెట్ సిరి ఆధ్వర్యంలో బాదితురాలికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు.

- అనంతపురం సర్వజన ఆసుపత్రి లో చికిత్స.

- కనేకల్ మండలం హనుమపురానికి మహిళ జూన్ 27న కోవిడ్ లక్షణాలతో చేరిన ఆమె

- జూలై 8న డిశ్చార్జ్ అయ్యింది: జాయింట్ కలెక్టర్ సిరి.

- డిశ్చార్జ్ సమయంలో అంబులెన్స్ లో తరలిస్తామని చెప్పగా ఆమె నిరాకరించింది: సిరి, జాయింట్ కలెక్టర్. బంధువు ఇంటికి ఆటోలో వెళ్తున్నట్లు చెప్పింది: సిరి జాయింట్ కలెక్టర్.

- బాధితురాలు టి.బి పేషెంట్ కావడంతో ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు: సిరి జాయింట్ కలెక్టర్.

2020-07-09 15:44 GMT

@ మాజీ ఎమ్యెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

- మంత్రులకు ఛాలెంజ్.. ఎవరిది పైచాచిక ఆనందమో తేల్చుకుందాం..

- కరోనో విషయంలో కాంగ్రెస్ అబద్దాలు అడుతుందని, పైచాచిక ఆనందం పొందుతుందని కేటీఆర్, ఈటెల అనడం సరికాదు.

- బాధ్యత గల మంత్రులు బాధ్యతలు విస్మరించి అబద్దాలు ఆడుతూ ప్రజలను అవమాన పరుస్తున్నారు.

- కరోన తో జనం పిట్టల్లా రాలుతుంటే మొక్కలు నాటుతూ, సచివాలయం కూలగొడుతున్నారు. ఎవరిది పైచాచికం..

- నిన్న 1920 కరోనో కేసులు వచ్చినట్టు, 11 మంది చనిపోయినట్టు ప్రకటించారు కదా.. వారి పేర్లు ప్రకటించండి, నేను ఇద్దరు మంత్రులకు ఓపెన్ ఛాలెంజ్ ఎక్కువ ఉన్నట్టు నిరూపిస్తా..

- కరోనో బాధితులు, మృతుల వివరాలు పేర్లతో సహా బయటపెట్టండి.. ఎవరివి అబద్ధాలో తేల్చుకుందాం.

- మీవి అబద్దాలని తేల్చకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటా..

- మీరు సిద్ధమా.

- మీరు కరోనితో జనం చనిపోతుంటే నివారించడంలో విఫలం అయ్యి పైచాచిక ఆనందం పొందుతు, అబద్దాలు ప్రచారం చేస్తున్నారు..

- కరోనో బాధితులు, మృతుల వివరాలు పచ్చి అబద్ధం.. అన్ని దొంగ లెక్కలు..

- ఈ రోజు అయిన కరోనో లెక్కలు, మృతుల వివరాలు పేర్లతో సహా ప్రకటించండి. నేను మీరు చెప్పిన లెక్కలు అబద్దాలు అని సాక్షాలతో సహా నిరూపిస్తా..

- బాధ్యత గల ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుంది 

2020-07-09 15:42 GMT

- టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని ఉల్లంఘించడం మరియు బహిరంగంగా ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు

- గతంలో మేము ఈ సమస్యను లేవనెత్తినప్పుడు, కొంతమంది మంత్రులు రెండు మసీదులు మరియు ఒక ఆలయం ప్రస్తుత నిర్మాణాలను కూల్చకుండా సచివాలయం నిర్మించుకుంటాం అని హామీ ఇచ్చారు.

- చారిత్రాత్మక ప్రాంగణంలో ఉన్న రెండు చారిత్రాత్మక మసీదులు మరియు ఆలయాన్ని రక్షించమని కోరుతూ 2019 జూన్ 27 న ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశాను.

- మేము ఆధునిక సెక్రటేరియట్ కలిగి ఉండటానికి వ్యతిరేకం కాదునిసిఎం కెసిఆర్‌కు చాలాసార్లు స్పష్టంగా చెప్పాము,

- ప్రస్తుత కరోనా సమయంలో నిర్మాణ చేయటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.

- మసీదులను కూల్చివేయలేదని కొందరు టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు సరికాదు.

- సెక్రటేరియట్ ప్రాంగణంలో మసీదులు మరియు దేవాలయాల ప్రస్తుత స్థితిని చూపించే వీడియో ఫుటేజీని జిహెచ్ఎంసి కమిషనర్ విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు

- సిఎం కెసిఆర్ వారి ప్రార్థనా స్థలాలను కూల్చివేసి అన్ని వర్గాల మత మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.

- టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరాధన స్థలాల నిబంధనలను కూడా ఉల్లంఘించింది.

- సిఎం కెసిఆర్‌కు చట్టం లేదా రాజ్యాంగం పట్ల గౌరవం లేదు మరియు కెసిఆర్ చాలా సందర్భాల్లో కేంద్ర చట్టాలను బహిరంగంగా ఉల్లంఘించాడు.

- సుప్రీంకోర్టు మరో స్టేను ఎక్కడ ఇస్తుందో అని మాత్రమే అతను సచివాలయాన్ని కూల్చివేసాడు

- కెసిఆర్ యొక్క మూఢ నమ్మకాలు తప్ప, మరే ఇతర మతం లేదా ప్రార్థనా స్థలాలకు టిఆర్ఎస్ పాలనలో తగిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు

2020-07-09 15:38 GMT

అమరావతి:విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు..

- సీఎం జగన్ నిర్ణయంతో దళిత జాతి శిరస్సు వంచి నమస్కరిస్తుంది.

- దళితుల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువెళ్లారు..

- అంబేద్కర్ విగ్రహన్ని చూసి అందరూ స్ఫూర్తి పొందేలా ఏర్పాటు చేస్తున్నారు..

- అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో టీడీపీ నానాయాగి చేస్తుంది..

- ఊరు చివర అంబేద్కర్ విగ్రహం ఉండాలని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు..

- చంద్రబాబు దళితులను అనేక సార్లు అవమానించారు..

- ఎస్సిలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు మాట్లాడారు....

- మీకెదుకురా రాజకీయాలు అంటూ దళితులను చింతమనేని హేళన చేశారు..

- 125 అడుగులతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఆయనకు ఘనంగా నివాళ్ళు అర్పించిన ట్లు అవుతుంది..

- విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం చంద్రబాబు ఇష్టం ఉందా లేదా సమాధానం చెప్పాలి..

- కాల్ మనీ సెక్స్ రాకెట్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అంబేద్కర్ విగ్రహం అంటూ ప్రకటన చేశారు...

- నాలుగేళ్లుగా ఎందుకు అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు..

- రాజధానిని గ్రాఫిక్స్ లో చూపినట్లే అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు గ్రాఫిక్స్ లో చూపించారు..

- అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో పెడితే దళితులకు గౌరవం ఇచ్చినట్లు అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు..

- ఊరికి చివరన ఎవరికి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు చూశారు..

- రెండు వేల కోట్ల విలువ చేసే స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు..

- రానున్న రోజుల్లో స్వరాజ్య మైదానం పర్యాటక స్థలంగా మారుతుంది..

- రానున్న రోజుల్లో విజయవాడ నగరం ప్రపంచ పటంలోకి ఎక్కుతుంది..

- చంద్రబాబుకు విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు..

- ఏడాది కాలంలో దళితులకు జరిగిన సంక్షేమంపై టీడీపీతో బహిరంగ చర్చకు సిద్ధం..

- దళితులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకుంది వాస్తవం కాదా..

- కోర్టులో కేసులు వేసి రాజధానిలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు..

- తెలుగుదేశం పార్టీ అంటే లిటిగేషన్ పార్టీ...

- బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తూ అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి సీఎం జగన్..

- అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలి..

2020-07-09 15:36 GMT

@  పశ్చిమగోదావరి

- తెలంగాణ నుండి ఆంధ్రా కు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఆంధ్రా పోలీసులు అరెస్ట్. .

- చింతలపూడి మండలం లింగంగూడెం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద

- తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడిన అక్రమ మద్యం.

- కృష్ణా జిల్లా బంటుమిల్లి ఎక్సయిజ్ సి.ఐ. పులి హనుశ్రీ, ప.గో.జిల్లా వి.ఆర్. ఎస్.ఐ. ఎం.విజయ కుమార్,

- ఏలూరు కు చెందిన నున్న కమల్ సంతోష్ లను అరెస్ట్ చేసిన పోలీసులు...

- నిందితుల వద్ద నుండి ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, 557 మద్యం సీసాలు స్వాధీనం.

- పట్టుబడిన మద్యం విలువ ఆంధ్రాలో సుమారు ఐదు లక్షల రూపాయలు..

- మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తూ పారిపోయిన

- ఎస్కార్ట్ వాహనం,డ్రైవర్ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.

2020-07-09 15:13 GMT

>> అమరావతి

- మహిళలపై జరుగుతున్న దాడులపై డిజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన వాసిరెడ్డి పద్మ..

 - మహిళా కమిషన్.చైర్.పర్సన్.పద్మ

- రాష్ట్రలో మహిళలపై జరుగుతున్న కేసులపై డిజీపీ తో చర్చించాం..

- గుంటూరులో నగ్న వీడియోలు కేసు మరవకముందే మరో కేసు నమోదు అయ్యింది..

- పోలీసుల పాత్రపై దృష్టి చెప్పాలని డిజీపీని కోరాం..

- డీజీపీ సానుకూలంగా స్పందించారు..

- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం..

- దిశా యాప్ ను మహిళలు అందరూ ఉపయోగించుకోవాలి..

- మహిళ ఉద్యోగులను పై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం..

- సైబర్ నేరాలకు పాల్పడే వారిపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి..

2020-07-09 14:13 GMT

>>> మచిలీపట్నం

- రేపటి నుండి నగరంలో ఉదయం 6-11గంటల వరకే వ్యాపారాలు

- టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆర్డీఓ ఖాజావలీ

- కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాం

- కంటైన్మెంట్ జోన్ ల్లో ప్రజలు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండి స్వీయ రక్షణ చర్యలు పాటించాలి

- పోలీస్ సిబ్బందితో మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశాం

- ఈ టీమ్ లు కంటైన్మెంట్ జోన్లలో నిత్యం పర్యవేక్షణ సాగిస్తారు

- మాస్క్ ధారణపై మున్సిపల్, పోలీస్ సిబ్బందితో నగరంలో

- ఉదయం 6-11గంటల మధ్య స్పెషల్ డ్రైవ్

- మాస్క్ ధరించని వారికి జరిమానా విధించటంతో పాటు కేసులు నమోదు చేస్తాం

- హోటల్స్ కూడా ఉదయం 6-11గంటల వరకే అనుమతి

- ఆ తర్వాత టేక్ ఎ వేకు అనుమతి

2020-07-09 13:52 GMT

- తలసాని టీడీపీ లో ఉన్నపుడు కేసీఆర్,హరీష్ రావు ని ఉరికించి కొడతా అన్నావు...

- టీడీపీ లో చంద్రబాబు చెంచాగిరి చేశావు..

- ఇప్పుడు టీఆరెస్ లో ఉండి చంద్రబాబు నే హైద్రాబాద్ కి వస్తే ఉరికించి కొడతా అన్నావు..

- కేసీఆర్ చెంచాగిరి చేసింది చాలు..

- ప్రతిపక్షాలు,కాంగ్రెస్ పార్టీ పై నోరు పరేసుకుంటే ఇక చూస్తూ ఉరుకొము.

- ఇంతకుముందు కూడా చెప్పిన పైల్వాన్ గిరి బంద్ చేయమని..

- నికంటే మేము ఎక్కువ మాట్లాడగలము, తిట్టగలము.

- నీకు హైద్రాబాద్ లొనే పైల్వాన్లు ఉన్నరేమో మాకు రాష్త్రంతా ఉన్నారు..

- నీవు ప్రజలకోసం కాకుండా కేసీఆర్ కుటుంబం ,నీ కుటుంబం కోసం పని చేస్తున్నావు..

- ప్రజలకోసం చేయాలనుకుంటే గాంధీ హాస్పిటల్ కి కేసీఆర్ తో మాట్లాడి 3 వేల కోట్లు ఇప్పించి నీ మొగతనం నిరూపించుకో..

- కారోనా ని ఆరోగ్య శ్రీ లో చేర్పించి నీ మొగతనం నిరూపించుకో..

- కారోన వైద్యం కోసం ఆరోగ్య శ్రీ లో 10 వేల కోట్లు కాటాయించి నువ్వెంటో నిరూపించుకో..

- నీ కుటుంబంలో ఎవరికైనా కారోన వస్తే ప్రాణాలు పోతే నీకు అప్పుడు ప్రజల బాధ తెలుస్తుంది..

- ఇప్పటికైనా కేసీఆర్ ఈ రెండు రోజుల్లో కారోన ని ఆరోగ్య శ్రీ లో చేరుస్తున్నట్లు జీవో రావాలి

- లేదంటే శనివారం కారోన రూల్స్ పాటిస్తూ ఒక రోజు దీక్ష చేస్తా..

- దీక్ష చేసిన స్పందించకపోతే హైద్రాబాద్ కేంద్రంగా రోజు ఒక కార్యక్రమం చేస్తా...

- కేసీఆర్ కొత్త సచివాలయం కేవలం తన నిషాని కోసం కట్టిస్తున్నాడు ..

- ప్రజల డబ్బు 500 కోట్లు వృధా చేస్తున్నారు...

- ఇప్పటికైనా ప్రజలకోసం ఆలోచించి ఆరోగ్య శ్రీ లో కారోనో ని చేరుస్తున్నట్లు ఆరోగ్య శ్రీ కి 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు జీవో ఇవ్వండి..

Tags:    

Similar News