Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-27 01:09 GMT
Live Updates - Page 2
2020-08-27 12:25 GMT

Mancherial: అల్ ఇండియా లో 330 ర్యాంక్ సాదించిన సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ అభినందన సభ..

మంచిర్యాల జిల్లా:

- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హల్ లో సివిల్స్ లో అల్ ఇండియా లో 330 ర్యాంక్ సాదించిన సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ అభినందన సభ..

- పాల్గొని సన్మానించిన గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల ముకేశ్ గౌడ్, గోప రాష్ట్ర అధ్యక్షులు డా.విజయ్ భాస్కర్

2020-08-27 11:44 GMT

Pedapalli District: నాగారం-అడవిసోమన పల్లి వద్దగల ప్రధాన రహదారి పై కారు ఢీకొని యువకుడు మృతి.

పెద్దపల్లి జిల్లా:

- మంథని మండలం నాగారం-అడవిసోమన పల్లి వద్దగల ప్రధాన రహదారి పై కారు ఢీ కొని పుప్పాల నందు (24) అనే యువకుడు మృతి.

👉 మృతుడు ములుగు జిల్లా కు చెందిన వ్యక్తి.

2020-08-27 11:16 GMT

Khammam: ఖమ్మంలో తితిదే కళ్యాణ మండపం భూవివాదంపై హైకోర్టులో విచారణ

- వీహెచ్ పీ ప్రధాన కార్యదర్శి అల్లిక అంజయ్య పిల్ పై హైకోర్టు విచారణ

- తితిదేకు చెందిన 12 గుంటల భూమిని వెనక్కి తీసుకుంటున్నారన్న పిటిషనర్

- తితిదే ఆధీనంలో 12 గుంటలు అదనంగా ఉందని తెలిపిన ప్రభుత్వం

- పక్క భూమిని కూడా తితిదే ఆక్రమించే ప్రయత్నం చేస్తోందన్న ఖమ్మం కార్పొరేషన్

- ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుమానాస్పదంగా ఉందని హైకోర్టు వ్యాఖ్య

- భూమి వెనక్కి తీసుకుంటే తితిదే ఎందుకు స్పందించడం లేదన్న హైకోర్టు

- ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెనక తితిదే ఉండొచ్చునన్న హైకోర్టు

- ప్రభుత్వ భూమిని తితిదే ఆక్రమించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్య

- దేవుడి పేరిట భూములు ఆక్రమించ రాదన్న హైకోర్టు

- దేవుడు కూడా చట్టానికి అతీతం కాదని హైకోర్టు వ్యాఖ్య

- భూమికి సంబంధించిన దస్త్రాలు, పటాలన్నీ సమర్పించాలని హైకోర్టు ఆదేశం

- విచారణ సెప్టెంబరు 8కి వాయిదా వేసిన హైకోర్టు

2020-08-27 11:15 GMT

Keesara Tahsildar Case: కీసర కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నలుగురు నిందితులు...

- కీసర కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నలుగురు నిందితులు...

- రేపు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరపనున్న ఏసీబీ కోర్ట్.

- ఇప్పటికే ముగిసిన నిందితుల ఏసీబీ కస్టడీ.

2020-08-27 11:15 GMT

Telangana: తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ ఛైర్ పర్సన్ కల్వకుంట్ల కవిత

- తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ సెక్రెటరీ మోహన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ, తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ ఛైర్ పర్సన్ కల్వకుంట్ల కవిత

- కొద్ది రోజుల‌ క్రితం ‌అనారోగ్యంతో మరణించిన మోహన్ రావు

- మోహన్ రావు ఇంటికి వెళ్ళి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని ప్రకటించారు మాజీ ఎంపీ ‌కవిత.

- అసోసియేషన్ ‌అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమం కోసం మోహన్ రావు నిరంతరం ‌కృషి చేసేవారని గుర్తుచేశారు‌.

- మోహన్ రావు మృతి తీరని లోటన్న మాజీ ఎంపీ ‌కవిత, మోహన్ రావు‌ కుటుంబానికి అన్ని రకాలుగా ‌అండగా ఉంటామని తెలిపారు.

2020-08-27 10:38 GMT

TS IPass: టీఎస్ ఐపాస్ కి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు

- టీఎస్ ఐపాస్ కి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు

- టియస్ ఐపాస్ పైన పూర్తి వివరాలు అందిస్తే అధ్యయనం చేస్తామన్న కేంద్ర మంత్రి

- భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ గా మారాలంటే భారీ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనే మార్గం అన్న మంత్రి కెటిఆర్.

- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ పారిశ్రామిక పార్క్ లకు కేంద్రం సహాయం అందించాలని కోరిన మంత్రి కేటీఆర్

- హైదరాబాద్ ఫార్మా సిటీ, వరంగల్ మేగా టెక్స్టైల్ పార్క్, హైదరాబాద్ మెడికల్ డివైసెస్ పార్క్ లకు కేంద్రం సహయం అందించాలన్న మంత్రి కేటీఆర్

- స్థానికులకు ఉద్యోగాలను కల్పించే విషయంలో తెలంగాణ వినూత్నమైన నిర్ణయం తీసుకుంది

- స్థానికంగా ఎంత ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తే అన్ని ఎక్కువ ప్రోత్సహకాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి

- వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమంపైన జరిగిన రాష్ర్టా పరిశ్రమల మంత్రుల సమావేశంలో పాల్గోన్న 

2020-08-27 10:38 GMT

Karimnagar: Hmtv తో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

కరీంనగర్ : 

- కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి లో సిటీ స్కానింగ్ లేకపోవడం సిగ్గుచేటు

- లోపాలని ప్రభుత్వానికి చెబుతున్న కూడా పట్టింపు లేకుండా ప్రజల జీవితాల తో చెలగాటం ఆడుతుంది

- చివరికి గవర్నర్ పై కూడా ఎదురుదాడి కి దిగారు....మరి ప్రభుత్వానికి ఎవరు చెబితే వింటారు

- అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం...

2020-08-27 10:37 GMT

Karimnagar: వీణవంక మండల కేంద్రం లో విషాదం.

కరీంనగర్ జిల్లా:

- వీణవంక మండల కేంద్రం లో విషాదం.

- మూడేళ్ల కూతురుతో తల్లి ఆత్మహత్య...

- స్థానికంగా ఒక బావిలో తల్లి కూతుళ్ళ శవాలను గుర్తించిన స్థానికులు..

- కుటుంబ కలహాలే కారణమని అంటున్న స్థానికులు,విచారిస్తున్న పోలీసులు

2020-08-27 10:36 GMT

TS High Court on Pensioners Petition: పెన్షనర్ల పిటీషన్ పై హైకోర్టు విచారణ...

హైదరాబాద్: 

- పెన్షనర్ల పిటీషన్ పై హైకోర్టు విచారణ...

- లాక్ డౌన్ కారణంగా పెంఛనర్లకు 25 శాతం కోత విధించడం పై హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు

- రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి పెన్షన్ లో 25 శాతం కోత విధించిన ప్రభుత్వం..

- వెంటనే ఆ డబ్బు చెల్లించాలని హైకోర్ట్ ను ఆశ్రయించిన బాధితులు.

- పెన్షనర్ల దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం..

- ఈరోజు ఉదయం కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం.

-ఈరోజు ఉదయం కౌంటర్ ధాఖలు చేస్తే ఎలా విచారిస్తామని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..

- ఈ పిటీషన్ ను రెగ్యులర్ కోర్ట్ లో విచారించాలని కోరిన ఏజీ..

- అభ్యంతరం వ్యక్తం చేసిన పిటీషనర్ తరపు న్యాయవాది..

- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నే విచారిస్తామన్న హైకోర్టు..

- తదుపరి విచారణ ను సెప్టెంబర్ 8 వాయిదా వేసిన హైకోర్టు.

2020-08-27 08:53 GMT

Narayanpet district updates: మక్తల్ కాటన్ మిల్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు....

నారాయణ పేట జిల్లా :

-మక్తల్ కాటన్ మిల్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు స్వల్ప గాయాలతో బయట పడ్డ డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులు సురక్షితం..

Tags:    

Similar News