Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 27 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం నవమి: (మ. 12-39 వరకు) తదుపరి దశమి జ్యేష్ఠ నక్షత్రం (సా. 4-35 వరకు) తదుపరి మూల అమృత ఘడియలు: (ఉ. 8-11 నుంచి 9-42 వరకు) వర్జ్యం: (రా. 12-18 నుంచి 1-51 వరకు) దుర్ముహూర్తం: (ఉ. 9-57 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు) రాహుకాలం: (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 27 Aug 2020 5:36 PM GMT

    - గౌలిగుడ అగ్గిని ప్రమాద స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే రాజసింగ్...

    - అగ్ని ప్రమాదం గల కారణాలు అధికారులను, యజమాని ఆడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

    - పాఠశాల దుస్తులు మరియు బెల్టులు, దీనివల్ల దగ్దం మైనట్లు... దాదాపు 1 కోటి రూపాయల నష్టం జరిగినట్లు ఎమ్మెల్యే కు వివరించిన షాప్ యజమాని

  • 27 Aug 2020 5:07 PM GMT

    Hyderabad breaking news:గౌలిగూడ కొత్త బస్తీలో అగ్ని ప్రమాదం

    - హైదరాబాద్ గౌలిగూడ కొత్త బస్తీలో అగ్ని ప్రమాదం..

    - స్టేషనరీ కి సంబంధించిన గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో ఎగిసిపడుతున్న మంటలు..

    - ఘటనా స్థలానికి చేరుకున్న అఫ్జల్ గంజ్ పోలీసులు, ఫైర్ ఇంజన్ సిబ్బంది..

    - ఐదు ఫైర్ ఇంజన్ లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నా అగ్నిమాపక సిబ్బంది..

  • 27 Aug 2020 2:36 PM GMT

    Keesara tahasildar case: కీసర కేసులో నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు చేపించిన ఏసీబీ..

    - కీసర కేసులో నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు చేపించిన ఏసీబీ..

    - అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరచిన ఏసీబీ అధికారులు..

    - నలుగురు నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ రీమాండ్ కు చంచల్ గూడ జైల్ కు తరలించిన ఏసీబీ.

    - నిందితులు ధాఖలు చేసిన బెయిల్ పిటీషన్ రేపు ఏసీబీ కోర్ట్ విచారణ.

  • 27 Aug 2020 2:35 PM GMT

    Etela Rajender: పారామెడికల్ సంఘాల డిమాండ్ల పై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈటల

    - డాక్టర్స్, పారామెడికల్ సంఘాల డిమాండ్ల పై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈటల..

    - ప్రభుత్వ నిర్ణయం తో ఆందోళన తాత్కాలికంగా వాయిదా వేసుకున్న డాక్టర్లు, హెల్త్ కేర్ సిబ్బంది

    - కరోనా తో చనిపోయిన వైద్య సిబ్బందికి ఎక్స్ గ్రేషయా ఇచ్చే విషయం నిర్ణయం..

    - ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా ల్లో విధానాలను పరిశీలించి తుది నిర్ణయం ప్రకటిస్తామని హామీ..

    - డాక్టర్లకు, హెల్త్ కేర్ సిబ్బందికి నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స కోసం ప్రభుత్వం జీవో ఇవ్వనుoది.

    ఈటల

    - కరోనా వచ్చి లీవ్ లో ఉన్న వాళ్లకు ఆన్ డ్యూటీ కింద పరిగణనలోకి తీసుకుంటూ జీవో ఇస్తాం.. ఈటల

  • 27 Aug 2020 12:36 PM GMT

    HimayathSagar: హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ ఫారం హౌస్ సందర్శించిన శంషాబాద్ dcp ప్రకాష్ రెడ్డి

    - హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ ఫారం హౌస్ సందర్శించిన శంషాబాద్ dcp ప్రకాష్ రెడ్డి

    - రాజేంద్రనగర్ సీఐ సురేష్ తో పాటు అటవీశాఖ అధికారులు సందర్శించారు...

    - రాజేంద్రనగర్ చిరుత జాడలు కనుక్కోవడానికి ప్రత్యేక డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు..

    - పోలీస్ అధికారులు జాగిలాలు తో (కుక్కలు) సైతం. రంగంలోకి దించారు..

    - చిరుతను పట్టుకునేందుకు అధికారులు బూన్ లను ఏర్పాటు చేశారు.

  • 27 Aug 2020 12:35 PM GMT

    Hyderabad Weather Updates: 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది: ఐఎండి డైరెక్టర్ హైదరాబాద్

    - ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నైరుతి జార్ఖండ్ లో కేంద్రీకృతమై ఉంది దీనికనుగుణంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది...

    - దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి...

    - ఈ ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి ,రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..

    - తెలంగాణ జిల్లాలో రేపు ,ఎల్లుండి తేలికపాటి వర్షాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాలో రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది....

    - ఈరోజు ప్రత్యేకంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి,జనగామ ,సూర్యాపేట, నల్గొండ, వరంగల్ జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

    - కోస్తాంధ్ర లో ఇవాళ ,రేపు ఎల్లుండి తేలికపాటి వర్షాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇవాళ ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

    - దక్షిణకొస్తా, రాయలసీమ జిల్లాలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది..

    - దక్షిణ కోస్తాలో ఇవాళ ఒకటి ,రెండు చోటక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..

    - హైదరాబాద్ లో ఇవాళ ,రేపు తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి ,రెండు చోట్లా భారీ జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది..

    - నైరుతి రుతుపవనాల కాలంలో ఇప్పటి వరకు తెలంగాణ సాధారణం కన్నా 47 శాతం అధికంగా ఒక వరంగల్ పట్టణంలో నే సాధారణం కన్నా 150 శాతం అధికంగా,నిర్మల్ జిల్లాలో 11 శాతం లోటు వర్షపాతం నమోదైంది...

    - కోస్తాంధ్ర లో సాధారణం కన్నా 47 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది...

  • 27 Aug 2020 12:34 PM GMT

    Narayanapet: నారాయణపేట జిల్లా ఏరియా ఆసుపత్రి ముందు అఖిలపక్షం ఆద్వర్యంలో దర్నా

    నారాయణపేట జిల్లా :

    - ఊట్కూరు మండలం ఎర్గట్ పల్లి లో జరిగిన ఘటనలో నిందితులను వెంటనే శిక్షించాలని నారాయణపేట జిల్లా ఏరియా ఆసుపత్రి ముందు అఖిలపక్షం ఆద్వర్యంలో దర్నా.

  • 27 Aug 2020 12:30 PM GMT

    Lakshmi Barrage: లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    - లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 91.90 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 1.463 టీఎంసీ

    - ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,96,850 క్యూసెక్కులు

  • 27 Aug 2020 12:29 PM GMT

    Sarasvathi Barrage: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరస్వతి బ్యారేజ్

    - జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరస్వతి బ్యారేజ్

    - 8 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ

    - ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 14,300 క్యూసెక్కులు

  • 27 Aug 2020 12:27 PM GMT

    Gandhi Bhavan:ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని గాంధీభవన్లో NSUI చేపట్టిన దీక్ష

    గాంధీ భవన్

    - రాష్ట్రంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని గాంధీభవన్లో NSUI చేపట్టిన దీక్ష ను సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..

    - రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని NSUI రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ ఆమరణ నిరాహార దీక్ష

    - చేస్తున్నట్లుగా ప్రకటన

    - ఉత్తమ్ కుమార్ రెడ్డి

    - రాష్ట్ర ప్రభుత్వ తీరు తో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు...

    - కరుణ వైరస్ వ్యాప్తి సమయంలో పరీక్షలు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు

    - విద్యార్థుల కోసం ఎన్ఎస్యుఐ నిరాహార దీక్ష చేస్తుంది..

    - జాతీయ స్థాయి లో నిర్వహించే

    - NEET, JEE నీ పోస్ట్ ఫోన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది..

    - విద్యార్థులు జీవితాలతో దేశంలో మోడీ, రాష్ట్రం లో కేసీఆర్ ఆటలు ఆడుతున్నారు...

    - కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న టైంలో పరీక్షలు పోస్ట్ ఫోన్ చేయాలి...

    - తెలంగాణ రాష్ట్రం లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ కూడా పోస్ట్ ఫోన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది...

    - జాతీయ స్థాయి NEET- JEE, , రాష్ట్ర స్థాయి లో ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు...

    - అయ్యకార్ భవన్ వద్ద ఆందోళన చేపడతాం.

    - దీంతోపాటు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేయాలి

Print Article
Next Story
More Stories