Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 27 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం నవమి: (మ. 12-39 వరకు) తదుపరి దశమి జ్యేష్ఠ నక్షత్రం (సా. 4-35 వరకు) తదుపరి మూల అమృత ఘడియలు: (ఉ. 8-11 నుంచి 9-42 వరకు) వర్జ్యం: (రా. 12-18 నుంచి 1-51 వరకు) దుర్ముహూర్తం: (ఉ. 9-57 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు) రాహుకాలం: (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 27 Aug 2020 12:25 PM GMT

    Mancherial: అల్ ఇండియా లో 330 ర్యాంక్ సాదించిన సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ అభినందన సభ..

    మంచిర్యాల జిల్లా:

    - మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హల్ లో సివిల్స్ లో అల్ ఇండియా లో 330 ర్యాంక్ సాదించిన సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ అభినందన సభ..

    - పాల్గొని సన్మానించిన గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల ముకేశ్ గౌడ్, గోప రాష్ట్ర అధ్యక్షులు డా.విజయ్ భాస్కర్

  • 27 Aug 2020 11:44 AM GMT

    Pedapalli District: నాగారం-అడవిసోమన పల్లి వద్దగల ప్రధాన రహదారి పై కారు ఢీకొని యువకుడు మృతి.

    పెద్దపల్లి జిల్లా:

    - మంథని మండలం నాగారం-అడవిసోమన పల్లి వద్దగల ప్రధాన రహదారి పై కారు ఢీ కొని పుప్పాల నందు (24) అనే యువకుడు మృతి.

    👉 మృతుడు ములుగు జిల్లా కు చెందిన వ్యక్తి.

  • 27 Aug 2020 11:16 AM GMT

    Khammam: ఖమ్మంలో తితిదే కళ్యాణ మండపం భూవివాదంపై హైకోర్టులో విచారణ

    - వీహెచ్ పీ ప్రధాన కార్యదర్శి అల్లిక అంజయ్య పిల్ పై హైకోర్టు విచారణ

    - తితిదేకు చెందిన 12 గుంటల భూమిని వెనక్కి తీసుకుంటున్నారన్న పిటిషనర్

    - తితిదే ఆధీనంలో 12 గుంటలు అదనంగా ఉందని తెలిపిన ప్రభుత్వం

    - పక్క భూమిని కూడా తితిదే ఆక్రమించే ప్రయత్నం చేస్తోందన్న ఖమ్మం కార్పొరేషన్

    - ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుమానాస్పదంగా ఉందని హైకోర్టు వ్యాఖ్య

    - భూమి వెనక్కి తీసుకుంటే తితిదే ఎందుకు స్పందించడం లేదన్న హైకోర్టు

    - ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెనక తితిదే ఉండొచ్చునన్న హైకోర్టు

    - ప్రభుత్వ భూమిని తితిదే ఆక్రమించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్య

    - దేవుడి పేరిట భూములు ఆక్రమించ రాదన్న హైకోర్టు

    - దేవుడు కూడా చట్టానికి అతీతం కాదని హైకోర్టు వ్యాఖ్య

    - భూమికి సంబంధించిన దస్త్రాలు, పటాలన్నీ సమర్పించాలని హైకోర్టు ఆదేశం

    - విచారణ సెప్టెంబరు 8కి వాయిదా వేసిన హైకోర్టు

  • 27 Aug 2020 11:15 AM GMT

    Keesara Tahsildar Case: కీసర కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నలుగురు నిందితులు...

    - కీసర కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నలుగురు నిందితులు...

    - రేపు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరపనున్న ఏసీబీ కోర్ట్.

    - ఇప్పటికే ముగిసిన నిందితుల ఏసీబీ కస్టడీ.

  • 27 Aug 2020 11:15 AM GMT

    Telangana: తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ ఛైర్ పర్సన్ కల్వకుంట్ల కవిత

    - తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ సెక్రెటరీ మోహన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ, తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ ఛైర్ పర్సన్ కల్వకుంట్ల కవిత

    - కొద్ది రోజుల‌ క్రితం ‌అనారోగ్యంతో మరణించిన మోహన్ రావు

    - మోహన్ రావు ఇంటికి వెళ్ళి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని ప్రకటించారు మాజీ ఎంపీ ‌కవిత.

    - అసోసియేషన్ ‌అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమం కోసం మోహన్ రావు నిరంతరం ‌కృషి చేసేవారని గుర్తుచేశారు‌.

    - మోహన్ రావు మృతి తీరని లోటన్న మాజీ ఎంపీ ‌కవిత, మోహన్ రావు‌ కుటుంబానికి అన్ని రకాలుగా ‌అండగా ఉంటామని తెలిపారు.

  • 27 Aug 2020 10:38 AM GMT

    TS IPass: టీఎస్ ఐపాస్ కి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు

    - టీఎస్ ఐపాస్ కి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు

    - టియస్ ఐపాస్ పైన పూర్తి వివరాలు అందిస్తే అధ్యయనం చేస్తామన్న కేంద్ర మంత్రి

    - భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ గా మారాలంటే భారీ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనే మార్గం అన్న మంత్రి కెటిఆర్.

    - తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ పారిశ్రామిక పార్క్ లకు కేంద్రం సహాయం అందించాలని కోరిన మంత్రి కేటీఆర్

    - హైదరాబాద్ ఫార్మా సిటీ, వరంగల్ మేగా టెక్స్టైల్ పార్క్, హైదరాబాద్ మెడికల్ డివైసెస్ పార్క్ లకు కేంద్రం సహయం అందించాలన్న మంత్రి కేటీఆర్

    - స్థానికులకు ఉద్యోగాలను కల్పించే విషయంలో తెలంగాణ వినూత్నమైన నిర్ణయం తీసుకుంది

    - స్థానికంగా ఎంత ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తే అన్ని ఎక్కువ ప్రోత్సహకాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి

    - వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమంపైన జరిగిన రాష్ర్టా పరిశ్రమల మంత్రుల సమావేశంలో పాల్గోన్న 

  • 27 Aug 2020 10:38 AM GMT

    Karimnagar: Hmtv తో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

    కరీంనగర్ : 

    - కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి లో సిటీ స్కానింగ్ లేకపోవడం సిగ్గుచేటు

    - లోపాలని ప్రభుత్వానికి చెబుతున్న కూడా పట్టింపు లేకుండా ప్రజల జీవితాల తో చెలగాటం ఆడుతుంది

    - చివరికి గవర్నర్ పై కూడా ఎదురుదాడి కి దిగారు....మరి ప్రభుత్వానికి ఎవరు చెబితే వింటారు

    - అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం...

  • 27 Aug 2020 10:37 AM GMT

    Karimnagar: వీణవంక మండల కేంద్రం లో విషాదం.

    కరీంనగర్ జిల్లా:

    - వీణవంక మండల కేంద్రం లో విషాదం.

    - మూడేళ్ల కూతురుతో తల్లి ఆత్మహత్య...

    - స్థానికంగా ఒక బావిలో తల్లి కూతుళ్ళ శవాలను గుర్తించిన స్థానికులు..

    - కుటుంబ కలహాలే కారణమని అంటున్న స్థానికులు,విచారిస్తున్న పోలీసులు

  • 27 Aug 2020 10:36 AM GMT

    TS High Court on Pensioners Petition: పెన్షనర్ల పిటీషన్ పై హైకోర్టు విచారణ...

    హైదరాబాద్: 

    - పెన్షనర్ల పిటీషన్ పై హైకోర్టు విచారణ...

    - లాక్ డౌన్ కారణంగా పెంఛనర్లకు 25 శాతం కోత విధించడం పై హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు

    - రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి పెన్షన్ లో 25 శాతం కోత విధించిన ప్రభుత్వం..

    - వెంటనే ఆ డబ్బు చెల్లించాలని హైకోర్ట్ ను ఆశ్రయించిన బాధితులు.

    - పెన్షనర్ల దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం..

    - ఈరోజు ఉదయం కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం.

    -ఈరోజు ఉదయం కౌంటర్ ధాఖలు చేస్తే ఎలా విచారిస్తామని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..

    - ఈ పిటీషన్ ను రెగ్యులర్ కోర్ట్ లో విచారించాలని కోరిన ఏజీ..

    - అభ్యంతరం వ్యక్తం చేసిన పిటీషనర్ తరపు న్యాయవాది..

    - వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నే విచారిస్తామన్న హైకోర్టు..

    - తదుపరి విచారణ ను సెప్టెంబర్ 8 వాయిదా వేసిన హైకోర్టు.

  • 27 Aug 2020 8:53 AM GMT

    Narayanpet district updates: మక్తల్ కాటన్ మిల్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు....

    నారాయణ పేట జిల్లా :

    -మక్తల్ కాటన్ మిల్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు స్వల్ప గాయాలతో బయట పడ్డ డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులు సురక్షితం..

Print Article
Next Story
More Stories