Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 27 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం నవమి: (మ. 12-39 వరకు) తదుపరి దశమి జ్యేష్ఠ నక్షత్రం (సా. 4-35 వరకు) తదుపరి మూల అమృత ఘడియలు: (ఉ. 8-11 నుంచి 9-42 వరకు) వర్జ్యం: (రా. 12-18 నుంచి 1-51 వరకు) దుర్ముహూర్తం: (ఉ. 9-57 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు) రాహుకాలం: (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 27 Aug 2020 8:36 AM GMT

    Hyderabad-Mehdipatnam updates: మెహిదీపట్నం వద్ద అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్న జీ హెచ్ ఎం సీ టౌన్ ప్లానింగ్ అధికారులు

    -మెహిదీపట్నం వద్ద అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్న జీ హెచ్ ఎం సీ టౌన్ ప్లానింగ్ అధికారులు

    -పోలీస్ ఫోర్స్, జె సి బి లతో కూల్చివేతలు చేపడుతున్న అధికారులు

    -2019 నుండి ఇప్పటి వరకు 4 నోటీసులు ఇచ్చినా భవన నిర్మాణం ఆపలేదంటున్న అధికారులు

    -461, 451/1, 452/2, ప్రకారం నోటీసులు

    -జిహెచ్ ఎం సీ అధికారుల తో, పోలీసలతో వాగ్వాదానికి దిగిన భవన యజమాని

    -పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న కూల్చివేత

    -పరిస్థితి ఉద్రిక్తం

  • 27 Aug 2020 8:31 AM GMT

    Kamareddy district updates: జిల్లా కేంద్రంలోని 4 వ వార్డులో ఐ సి ఎం ఆర్ బృందం పర్యటన.

    కామారెడ్డి :

    -జిల్లా కేంద్రంలోని 4 వ వార్డులో ఐ సి ఎం అర్ బృందం పర్యటన.

    -కోవిడ్ సామాజిక వ్యాప్తిపై రక్తనమునాలు సేకరిస్తున్న బృందం.

  • 27 Aug 2020 8:25 AM GMT

    Hyderabad-Gandhi Hospital Updates: గాంధీ ఆస్పత్రి లో కరోనా వార్డు నుండి పరార్ అయిన నలుగురు జైల్ ఖైదీలు..

    హైదరాబాద్..   

    -గాంధీ ఆస్పత్రి నుండి కరోనా వార్డు నుండి పరార్ అయిన నలుగురు జైల్ ఖైదీలు..

    -పరార్ అయిన వారిలో ఇద్దరు చంచల్ గూడ రీమాండ్ ఖైదీలు..

    -మరొకరు చర్లపల్లి జైల్లో శిక్ష ఖరార్ అయిన ఖైదీ,

    -ఇంకొకరు చర్లపల్లి జైల్లో శిక్ష ఖరారు అయిన ఖైదీ మానసిక స్థితి భాగలేఖ ఎర్రగడ్డ చికిత్స తీసుకుంటున్న ఖైదీ...

    -ఎర్రగడ్డ నుండి గాంధీ కి తీసుకొచ్చిన సిబ్బంది..

    -పరార్ అయిన వారిలో అబ్దుల్ రబాజా, ఎండి జావీద్, శ్యామ్ సుందర్,నర్సింహా.

    -జావీద్ తాండూరు కేసు లో నిందితుడు...

    -రబాజా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు..

    -చిలక గూడ పోలీసులకు ఫిర్యాదు..

    -సీసీటీవీ కెమెరా ల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు..

    -గాంధీ హాస్పిటల్ లోనే ఇతర వార్డుల్లో నక్కి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు.

    -నిందితుల కోసం గాంధీ హాస్పిటల్లో కొనసాగుతున్న గాలింపు.....

  • 27 Aug 2020 6:53 AM GMT

    Hyderabad weather updates: నగరంలో పలుచోట్ల ఒక మోస్తరు నుండి భారీ వార్షాలు కురిసే అవకాశం..

    హైదరాబాద్... 

    -హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఒక మోస్తరు నుండి భారీ వార్షాలు కురిసే అవకాశం

    -అధికారులు, బృందాలను అప్రమత్తం చేసిన కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్

  • 27 Aug 2020 6:48 AM GMT

    Nagarjuna Sagar Dam Updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.

    నల్గొండ :

    -నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.

    -8 గేట్లు 10 ఫీట్లు మేర ఎత్తివేత

    -ఇన్ ఫ్లో :1,65,245 క్యూసెక్కులు.

    -అవుట్ ఫ్లో : 1,65,245 క్యూసెక్కులు.

    -పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

    -ప్రస్తుత నీటి నిల్వ : 309.9534 టీఎంసీలు.

    -పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.

    -ప్రస్తుత నీటిమట్టం: 589.30 అడుగులు.

  • 27 Aug 2020 6:39 AM GMT

    Nizamabad updates:నగరంలోని ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..

    నిజామాబాద్..

    -నగరంలోని ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..

    -విక్కీ,గోవింద్, సయ్యద్ సోహెల్, ధనుష్ నలుగురు యువకుల తో పాటు ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. 

    -విక్కీ అనే యువకుడు మహిళకు మాయ మాటలు చెప్పి కలెక్టరేట్ ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారం..

    -ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్న సీపీ కార్యాలయం...

    -ఆ తర్వాత విక్కీ స్నేహితులు ఒక్కొక్కరిగా యువతి పై అత్యాచారం కు పాల్పడ్డారు ...

    సిసి ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్న పోలీసులు...

  • 27 Aug 2020 5:17 AM GMT

    Karimnagar: జూనియర్ లైన్మెన్ అజయ్ విద్యుత్ షాక్తో మృతి

    కరీంనగర్ జిల్లా :

    - గంగాధర మార్కెట్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్మెన్ అజయ్ విద్యుత్ షాక్తో మృతి

  • 27 Aug 2020 5:16 AM GMT

    Charlapalli: చర్లపల్లి జైలు ఖైదీలు పరార్...

    చర్లపల్లి:

    - చర్లపల్లి జైలు ఖైదీలు పరార్...

    - చర్లపల్లి జైలు నుండి గాంధీ హాస్పిటల్ కు కరోనా టెస్ట్ లకు తీసుకొస్తున్న జైలు సిబ్బంది..

    - మార్గమద్యం లో వాహనం నుండి దూకిన పరార్ అయిన ఖైదీలు...

    - పారిపోయిన ఖైదీల వివరాలను పరీశీలిస్తున్న జైల్ సిబ్బంది.

  • 27 Aug 2020 5:16 AM GMT

    Karimnagar Updates: కరీంనగర్ జిల్లా లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటన

    కరీంనగర్ :

    - కరీంనగర్ జిల్లా లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటన

    - హుజురాబాద్ .,జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులని సందర్శించిన భట్టి

    - వీణవంక మండలం లో వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన భట్టి విక్రమార్క

  • 27 Aug 2020 4:27 AM GMT

    Hyderabad: వైద్యురాలి ని లంచం అడిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు

    హైదరాబాద్

    - ఇంట్లో హోమియోపతి వైద్యం చేస్తున్న వైద్యురాలినీ లంచం అడిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు

    - ఎస్ ఆర్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఘటన

    - బొరబొండ లో ఇంట్లోనే హోమియోపతి వైద్యం చేస్తున్న పరిమలజ్యోతి అనే యువతి

    - ఇలా వైద్యం చేయడానికి అనుమతి లేదంటూ క్లినిక్ ముసివేయిస్త మంటు యువతిని బెదిరించిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక ghmc ఉద్యోగి

    - యువతి నీ 2 లక్షలు డిమాండ్ చేసిన కానిస్టేబుళ్లు, జిహెచ్ఎంసి ఉద్యోగి.

    - లక్ష రూపాయలు చెల్లించిన యువతి.

    - తిరిగి 5 వేలు జరిమానా విధించిన రశీదు ను యువతి చేతిలో పెట్టిన జిహెచ్ఎంసి ఉద్యోగి

    - జిహెచ్ఎంసి జోనల్ అధికారికి ఫిర్యాదు చేసిన యువతి.

    - కానిస్టేబుళ్ల పై ఎస్ అర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు....

Print Article
Next Story
More Stories