Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 27 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం నవమి: (మ. 12-39 వరకు) తదుపరి దశమి జ్యేష్ఠ నక్షత్రం (సా. 4-35 వరకు) తదుపరి మూల అమృత ఘడియలు: (ఉ. 8-11 నుంచి 9-42 వరకు) వర్జ్యం: (రా. 12-18 నుంచి 1-51 వరకు) దుర్ముహూర్తం: (ఉ. 9-57 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు) రాహుకాలం: (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 27 Aug 2020 9:56 AM IST
Medak Updates: మీర్జాపల్లి శివారు కార్తికేయ ఫార్మసి కంపెనీ నుంచి లీకైన గ్యాస్
మెదక్:
- చిన్న శంకరంపేట మండలం మీర్జాపల్లి శివారు కార్తికేయ ఫార్మసి కంపెనీ నుంచి లీకైన గ్యాస్
- కళ్ళ మంటలతో ఉక్కిరిబిక్కిరైన స్థానికులు ,కంపెనీ వద్ద ఆందోళన
- 27 Aug 2020 9:55 AM IST
Bhadradhri Kothagudem: ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య పోడు భూముల వివాదం
భద్రాద్రి కొత్తగూడెం:
- ములకలపల్లి మండలం చాపరాలపల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య పోడు భూముల వివాదం
- ములకలపల్లి మండలం చాపరాల పల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో ని గుట్టగూడెంలో ఘటన
- హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ అధికారులు
- పరస్పరం దాడులు చేసుకున్న గిరిజనులు... అటవీ సిబ్బంది
- పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా మోహరించిన పోలీసులు
- ఫారెస్ట్ సిబ్బంది పై దాడికి యత్నించిన ఆరుగురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 27 Aug 2020 9:54 AM IST
Adilabad Updates: ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ అసుపత్రిలో కరోనాతో ఒకరు మృతి
ఆదిలాబాద్ జిల్లా
- ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ అసుపత్రిలో కరోనాతో ఒకరు మృతి .. ఇప్పటి వరకు జిల్లాలో పద్దెనిమిది మంది కరోనాతో మ్రుతి
- 27 Aug 2020 9:16 AM IST
Nalgonda district updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..
నల్గొండ :
-నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.
-10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేత..1,74,750 క్యూసెక్కుల నిటీని వదులుతున్నారు..
-పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం : 589.30 అడుగులు.
-ఇన్ ఫ్లో :1,92,465 క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో : 1,95,447 వెల క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 309.916 టీఎంసీలు.
- 27 Aug 2020 8:19 AM IST
Jangaon district updates: జనగామ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం.
-జనగామ జిల్లా:
-జనగామ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం.
-జనగామ, పాలకుర్తి,
-స్టేషన్ ఘనపూర్, నియోజకవర్గంల్లో తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షం....
- 27 Aug 2020 8:14 AM IST
Warangal Urban updates: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం..
-వరంగల్ అర్బన్.
-జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం..
-తెల్లవారు జామున నుండి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుంది..
- 27 Aug 2020 8:10 AM IST
Mahabubabad updates: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం..
-మహబూబాబాద్ జిల్లా...
-మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం..
-డోర్నకల్, తొర్రురు, కేసముద్రం, గూడూరు, నెల్లికుదుర్ మండలాల్లో తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షం...
- 27 Aug 2020 7:52 AM IST
Adilabad updates: ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావు పిఏ అన్సారీ పై పోర్జరీ కేసు నమోదు..
-ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావు పిఏ అన్సారీ పై పోర్జరీ కేసు నమోదు..
-ల్యాండ్ విషయంలో ఎంపి సంతకాన్ని పోర్జరీ చేసిన ఎంపి మాజీ పీఎ అన్సారీ..
-గతంలో కొన్ని రోజులపాటు ఎంపి దగ్గర పీఎగా పనిచేసిన అన్సారీ..
-వన్ టౌన్ పోలీసు స్టేషను లో కేసు..విచారణ జరుపుతున్న పోలీసులు..
- 27 Aug 2020 7:29 AM IST
Adilabad updates: సూపర్ స్పెషాలిటీ అసుపత్రికి ఇరవై కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
ఆదిలాబాద్ జిల్లా..
-ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ అసుపత్రికి ఇరవై కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
-నిదుల విడుదలలో చోరవ చూపిన మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే జోగురామన్న
- 27 Aug 2020 7:14 AM IST
Adilabad updates: బీమ్ పూర్ మండలంలో పులి సంచారం..
-ఆదిలాబాద్ జిల్లా బీమ్ పూర్ మండలంలో పులి సంచారం.
-సీసీ కెమెరాలలో రికార్డైనా పులి విజువల్
-పశువుల పై పంజా విసురతున్న పులి..
-ఇప్పటికే నాలుగు పశువులను చంపిన పులి
-అందోళన చెందుతున్న తాంసి కే గ్రామస్తులు.
-పులి భయంతో వణుకుతున్న ప్రజలు..
-ప్రజలకు హాని కలుగకుండా చర్యలు తీసుకుంటున్న అటవీ అదికారులు



