Live Updates: ఈరోజు (22 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-22 03:18 GMT
Live Updates - Page 2
2020-11-22 12:46 GMT

Visakha Updates: పద్మనాభం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు...

 విశాఖ

*అనంతరం వెంకటాపురంలో వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంచిన మంత్రి.

*మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్

*జిల్లా వ్యాప్తంగా 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.

*రైతులు 17 శాతం తేమతో ఉన్న ధాన్యాన్ని కేంద్రానికి తీసుకు రావచ్చు.

*మద్దతు ధర గ్రేడ్ వన్ 1888 రూపాయలు, సాధారణ రకం 1868 రూపాయలు.

*తుఫాన్ , వరదల వల్ల పంట ఎంత నష్టయిన పూర్తిగా నష్ట పరిహారాన్ని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

*సాగునీరు అందుబాటులో లేని మెట్ట, బీడు భూముల రైతుల‌కు వైయ‌స్ఆర్ జ‌ల‌క‌ళ ప‌థ‌కం ఒక వ‌రం లాంటిది.

*అందుబాటులో ఉన్న భూగర్భజల వనరులను ఉపయోగించుకుంటూ ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాము.

2020-11-22 12:42 GMT

Nellore District Updates: తోటపల్లి గూడూరు (మం) వరకవిపూడి గ్రామంలో వివాదం..

  నెల్లూరు...

- తోటపల్లి గూడూరు (మం) వరకవిపూడి గ్రామంలో చెరువు వేలం పాట నగదు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ....

- కత్తులతో పరస్పరం దాడులు.. పలువురికి తీవ్ర గాయాలు...

- బాధితులు నక్క పెంచాలయ్య, కోవూరు శ్రీను, పల్లం. ఆదిలక్ష్మి ల ను 108 వాహనం ద్వారా నెల్లూరుకి తరలింపు...

- మరో కొంతమంది స్వల్ప గాయాలు..

- గ్రామంలో పోలీస్ పికిటింగ్ ఏర్పాటు చేసిన ఎస్. ఐ ఇంద్రసేనా రెడ్డి....

2020-11-22 11:55 GMT

Tirumala Updates: కార్తీక వనమహోత్సవం కార్యక్రమంను అద్భుతంగా నిర్వహించాం..

   తిరుమల

* ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కార్తీక వనమహోత్సవం కార్యక్రమంను అద్భుతంగా నిర్వహించాం.

* కోవిడ్-19 నిబంధనలు మేరకు పార్వేటి మండపంలో ఏకాంతంగా నిర్వహించాం.

* కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 250 భక్తులతో కార్యక్రమం నిర్వహించాము.

* కార్తీకవన మహోత్సవం సందర్భంగా వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసాం.

* రేపటి నుండి భక్తులకు యధాతథంగా వర్చువల్ సేవలు వుంటాయి.

* ఏవి.ధర్మారెడ్డి, టీటీడీ అదనపు ఈవో

2020-11-22 11:08 GMT

Vijayawada Updates: శ్రీనివాసరావు తన సెల్ఫీ వీడియో ద్వారా చేసిన ఆరోపణలు నిరాధారం...

  విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయము రీజాయిండర్

  సీపీ బి.శ్రీనివాసులు

* ఏ.ఆర్.హెచ్.సి. - 471, శ్రీనివాసరావు తన సెల్ఫీ వీడియో ద్వారా చేసిన ఆరోపణలు నిరాధారం

* విజయవాడ నగర పోలీసులు ప్రతి నిత్యం ఎన్నో మానసిక, శారీరక ఒత్తిడులు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు

* విజయవాడ పోలీసుల పని తీరుపైన, పోలీసు జాగిలాల పని తీరు, వాటి సామర్ధ్యం సరిగా లేదని చేసిన ఆరోపణలు నిరాధారం

* వి.ఐ.పి/వి.వి.ఐ.పి.ల రక్షణ దృష్యా, హత్య కేసులు, దొంగతనం వంటి కేసుల్లో పోలీసు జాగిలాల పాత్ర చాల కీలకమైనది

* వెటర్నరీ డాక్టరు నిరంతర పర్యవేక్షణలో, పోలీసు జాగిలాల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది

* కొంత కాలంగా శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి బాగోనందున సిక్ లో ఉన్నారు

* ఆర్ముడు రిజర్వు హెచ్.సి.-471, శ్రీనివాసరావు 2005 నుండి డాగ్ హ్యాండలర్ గా విధులు నిర్వహిస్తున్నారు

* 15 సంవత్సరముల తర్వాత సాధారణ బదిలీలలో భాగంగా డాగ్ స్వాడ్ విధుల నుండి ఆర్ముడు రిజర్వు డ్యూటీలకు పంపడం జరిగింది

* అతను వాలంటరీ రిటైర్మెంట్ ఇంతవరకు కోరలేదు, ఏవిధమైన అభ్యర్థన సమర్పించలేదు

* అతని అభియోగాలన్ని సత్యదూరాలు

2020-11-22 11:01 GMT

Amaravati Updates: టిడిపి ఎంపిటిసి అభ్యర్ధి భర్తపై హత్యాయత్నాన్ని ఖండించిన చంద్రబాబు...

  అమరావతి..

* ఫోన్ చేసి బాధితులను పరామర్శించిన చంద్రబాబు

* టిడిపి అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన చంద్రబాబు

2020-11-22 10:59 GMT

Rajahmundry Updates: రామకృష్ణ బృందం పోలవరం సందర్శనకు అధికారులకు ఆదేశాలిచ్చారు...

 తూర్పుగోదావరి-రాజమండ్రి..

- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..

- ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ యాదవ్ కు లేఖ ఇవ్వడంతో 22న సిపిఐ రామకృష్ణ బృందం పోలవరం సందర్శనకు అధికారులకు ఆదేశాలిచ్చారు

- పోలవరం చీఫ్ ఇంజనీరు సుధాకర్ బాబు కాల్ చేసి ఎలా వస్తున్నారు అని అడిగారు

- అనుమతి కోసం లెటర్ సానుకూలంగా స్పందిస్తే ఇపుడు పోలీసులుఎందుకు అడ్డుకుంటున్నారు

- రాష్ట్రంలో సిఎం జగన్ ప్రభుత్వమా, డిజీపి గౌతమ్ సవాంగ్ ప్రభుత్వం నడుస్తుందా

- జగన్ ప్రభుత్వం మాకు కన్పించడం లేదు. ఇరిగేషన్ మంత్రి మాటకు విలువలేదా

- ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి

- ఇలాంటి నిర్భంధం ఎందుకు చేస్తారు

- పోలవరం ప్రాజెక్టు కావాలని అందరూ కోరుకుంటున్న ప్రాజెక్టు

- పోలవరం ప్రాజెక్టు సందర్శించే వెళతాం..ఇందుకు ప్రభుత్వం స్పందించాలి

- పోలవరానికి వెళ్ళి అన్నిపరిశీలించాకే అక్కడ పరిస్థితులు ,ఎత్తు తగ్గింపులపై మాట్లాడతాను

2020-11-22 05:13 GMT

Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్...

  తిరుమల

- సత్యకుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

- కరోనా మహమ్మారి నుంచి విశ్వ మానవాళికి విముక్తి జరగాలని ప్రార్ధించాను.

- టీటీడీ పవిత్రతను కాపాడాలి, ఆలయ భూములు ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చూడాలని కోరుతున్నా..

- భక్తి భావంతో భక్తులు స్వామి వారిని సమర్పించే కానుకలు ధర్మపరిక్షణ కోసం ధార్మిక కార్యక్రమాల కోసమే వాడాలి.

2020-11-22 05:09 GMT

Guntur District Updates: నరసరావుపేటలో వార్డు వాలంటీర్ పై భాను ప్రకాష్ అనే యువకుడి దాడి..

  గుంటూరు ..

* నరసరావుపేటలో వార్డు వాలంటీర్ షేక్ మస్తాన్ వలి పై భాను ప్రకాష్ అనే యువకుడి దాడి.

* భాను ప్రకాష్ స్థానిక వైసిపి నేత తనయుడిగా గుర్తించి స్థానికులు.

* దాడిలో ధ్వంసమైన సచివాలయ ఫర్నిచర్.

* భాను ప్రకాష్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.

2020-11-22 05:02 GMT

Tirumala Updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు...

  తిరుమల

// ఆలయ మర్యాదలతో ఉడిపి పెజవర్ పిఠాదిపతి విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ.

// బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్.

// ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి.

// మధ్యప్రదేశ్ మంత్రి ఆరవింద బహుదురియా.

// విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ.

// పోరుబందర్ పార్లమెంట్ సభ్యుడు రమేష్ బాయి దుడుకు.

2020-11-22 04:08 GMT

Krishna Updates: వీరులపాడు నుండి అక్రమంగా మద్యం సీసాలు స్వాధీనం..

  కృష్ణాజిల్లా..

* వీరులపాడు (మం) పెద్దాపురం వద్ద తెలంగాణ నుండి అక్రమంగా 500 మద్యం సీసాలు స్వాధీనం

* ఒక వ్యక్తి అరెస్టు చేసి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్న వీరులపాడు పోలీసులు

Tags:    

Similar News