Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-21 03:28 GMT
Live Updates - Page 2
2020-10-21 11:08 GMT

Rajath kumar: చరిత్ర లో ఎప్పుడు ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు..

రజత్ కుమార్ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి @జల సౌధ

#గత నాలుగు ఐదు రోజుల నుండి భారీ వర్షాలు పడుతున్నాయి.

#లాస్ట్ వన్ వీక్ లో చాలా వర్షపాతం నమోదు అయింది.

#నగరంలో 185 చెరువులు ఉన్నాయి,అన్ని జాగ్రత్తలు తీసుకంటున్నాం.

#185 చెరువులు పూర్తి స్థాయి లో నిండి ఉన్నాయి

#అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నాం

#సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 15 టీం లు ఏర్పాటు చేస్తున్నాం.

#ఈ బృందాలు అన్ని చెరువులను పరిశీలిస్తారు ,పరిశీలించడమే కాదు ఎక్కడికక్కడ చెరువులను బాగు చేసేందుకు నిధులు విడుదల చేస్తారు.

#చెరువుల పునరుద్ధరణ కు 2 కోట్లు విడుదల చేస్తారు.

#మూడు చెరువులు గండి పడినాయి, వీటిని అన్నిటినీ మరమ్మతులు చేస్తున్నాం.

#53 డ్యామేజ్ అయ్యాయి ,ముసా పెట్,బండ్ల గూడ, మాన్సూర బాద్ చెరువులు తెగినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇవి అవాస్తవం కానీ పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి.

#చెరువుల కబ్జా చేసినవాటి జోలికి మేము వెళ్లడం లేదు .చెరువుల కబ్జా పై చర్యలు చేపడుతాం.

#నగర ప్రజలకి అత్యవసర పరిస్థితి లలో నేపథ్యంలో తీసుకోవల్సిన వాటిపై దృష్టి పెట్టాం.

#శాశ్వత మరమ్మతులు కోసం 40 కోట్ల రూపాయలు అవసరం.

#హైదరాబాద్ నగరంలో 53 చెరువుల డ్యామేజ్ అయ్యాయి.

#నా విజ్ఞప్తి చెరువుల దగ్గర ఎవరు సెల్ఫీ లు దిగవద్దు,చెరువుల దగ్గరకు వెళ్లవద్దు.

2020-10-21 10:52 GMT

A.C.B.Court updates: ఓటుకు నోటు కేసు పై ఏసీబీ కోర్ట్ విచారణ...

ఏసీబీ కోర్ట్......

-తమ పేర్లు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు..

-డిశ్చార్జ్ పిటిషన్లపై నేడు కౌంటరు దాఖలు చేసిన ఏసీబీ..

-ఏసీబీ ధాఖలు చేసిన కౌంటర్ పై ఈ నెల 23 న వాదనలు వింటామన్న ఏసీబీ..

-తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్.

2020-10-21 10:38 GMT

Siddipet updates: ఆర్ఎస్ కు మద్దతుగా మహిళ ల భారీ ర్యాలీ.. ర్యాలీ లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు..

సిద్దిపేట..

- దుబ్బాక పుర విధుల్లో టి ఆర్ఎస్ కు మద్దతుగా మహిళ ల భారీ ర్యాలీ.. ర్యాలీ లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ..

- గులాబీ మయమైన దుబ్బాక పట్టణం..

- మంగళ హరతులు.. డప్పు చప్పుళ్ల తో భారీగా తరలివచ్చిన మహిళ లోకం..

- కాసేపట్లో ప్రారంభం కానున్న మహిళ బహిరంగ సభ...

2020-10-21 10:33 GMT

K Krishna Sagar Rao: దుబ్బాక ఉప ఎన్నికల్లో పచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది...

బీజేపీ మీడియా ప్రకటన..

-కె.కృష్ణసాగర రావు...బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.

-కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న టిఆర్ ఎస్ ప్రభుత్వం దుబ్బాక ఉప ఎన్నికల్లో పచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది.

-బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు ప్రచారానికి అప్రజాస్వామికంగా, అనైతికంగా, అక్రమ మార్గాల్లో టిఆర్ఎస్ అడ్డంకులు సృష్టించడాన్ని బీజేపీ ఖండిస్తోంది.

-దీనిపై బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తుంది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని చట్టపరమైన చర్యలనూ పరిశీలిస్తాం.

-ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం టిఆర్ఎస్ లో కనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉన్నందున పోలీసులను, అధికార యంత్రాంగాన్ని అనైతికంగా వాడుకుంటూ   నీతి, నిజాయితీ లేని రాజకీయాలు చేస్తోంది టిఆర్ ఎస్

-దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావుకి సమాన అవకాశాలు కల్పించకుండా, ఆయన హక్కులను కాలరాస్తూ, ఆయనపై అధికార దుర్వినియోగానికి   పాల్పడితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో బాధ్యత వహించాలి.

2020-10-21 10:24 GMT

Nizamabad updates: పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు..

నిజామాబాద్..

-పోలీస్ పరేడ్ మైదానం లో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు

-హాజరైన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ కార్తికేయ, కామారెడ్డి ఎస్.పి. శ్వేతా రెడ్డి.

-విధి నిర్వహణలో అమరులైన వారికి నివాళులు

2020-10-21 10:22 GMT

Hyderabad updates: రేపు తెలంగాణ కి కేంద్ర బృందం..

#రేపు సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కేంద్ర బృందం.

#రెండు రోజుల పాటు రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం

#వరద ప్రాంతాల్ల నష్టం తీవ్రతను అంచనా వేయనున్న కేంద్ర బృందం.

#ఈ 13వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో 5 వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం...

#తక్షణ సహాయంగా 1350 కోట్ల ను విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి లేఖ రాసిన సీఎం కేసీఆర్

#ఈ నేపథ్యంలో నే కేంద్ర బృందం రాక

2020-10-21 10:19 GMT

Hyderabad updates: హైదరాబాద్ లో గంగమ్మ తల్లి కి పూజలు...

హైదరాబాద్.. 

-నగరం లో పెద్ద ఎత్తున్న వరదలు వస్తుండడంతో మూసి నది ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి కి పూజలు చేస్తున్న నగర మంత్రులు, మేయర్ , మేయర్

-1908 లో వరదల సమయంలో పూజలు చేసిన నిజాం రాజులు

-మళ్ళి అలాంటి వరదలు రావడంతో పండితుల సూచన మేరకు గంగమ్మ తల్లి పూజలు

2020-10-21 09:48 GMT

Mahabubabad district updates: కిడ్నప్ అయ్యిన బాలుడి తల్లికి ఫోన్ చేసిన ఆగంతకుడు!

మహబూబాబాద్ జిల్లా...

-డబ్బులు రెడి అయ్యాయా?

-డబ్బులు రెడి చేసుకోండి.. రేపు మళ్ళీ ఫోన్ చేసి చెప్పుతా ఎక్కడికి తీసుకరవాలో అని చెప్పినట్లు సమాచారం.

-నిన్న 12 గంటల తరువాత ఈరోజు 8.30 ఫోన్ వచ్చింది.

-11.గంటలకు ఫోన్ చేస్తా ఆనంటుగానే కాల్ చేసిన కిడ్నాపర్.. 45 లక్షలు రెడీ చేసినట్లు వీడియో తీసి రెడీ చెయ్యాలి అని ఆదేశించిన కిడ్నపర్..

2020-10-21 09:32 GMT

Jurala Project updates: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...

మహబూబ్ నగర్ జిల్లా :

-26 గేట్లు ఎత్తివేత..

-ఇన్ ఫ్లో: 3, 54,000 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో: 3,75,079 వేల క్యూసెక్కులు.

-పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:

-9.657 టీఎంసీ.

--ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.396 టీఎంసీ.

-పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.

-ప్రస్తుత నీటి మట్టం: 317.890 మీ.

2020-10-21 09:24 GMT

Hyderabad updates: ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్వల్ప అగ్ని ప్రమాదం!

హైదరాబాద్.. 

-హైదరాబాద్ ఆదర్శనగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్వల్ప అగ్ని ప్రమాదం.

-మంటలు ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది.

-ఆంద్రప్రదేశ్ కి చెందిన మాజీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏసీ లో షాట్ సర్క్యూట్ కావడం వల్లా అగ్నిప్రమాదం... 

Tags:    

Similar News