Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-21 03:28 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-21 14:41 GMT

  కరీంనగర్ :

* మంత్రి ఈటెల రాజేందర్ కామెంట్స్

*జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం సమావేశం లో నాయకులకు ఈటెల హితవు

* ప్రజా ప్రతినిధి గెలవడం అనేది ఓ ఛాయిస్ కాదు ఓ ఛాన్స్ లా గెలిచేలా ఉండాలి

* గెలుస్తా అనుకుంటే గెలవాలి..అలా ఉండాలి రాజకీయం అంటే

* రాజకీయాల్లో అయన ఉడొద్దు ఈయన ఉండొద్దు అంటూ చర్చలు జరుగుతూనే ఉంటాయి

* కానీ రాజేందర్ అంటే ఎప్పుడు రాజేందరే

* నేను ఎకనామిస్ట్ కాదు అయినా ఆర్ధిక శాఖ మంత్రి గా పని చేశా

* ఆరోగ్య శాఖ మంత్రి గా ఎన్ని నెగిటివ్ వార్తలు వచ్చిన అందులో పాజిటవ్ ని వెతుకుని పనిచేశా

* ఒళ్ళుమంచి పని చేసినవాడే ధర్మం తప్పనివాడు ..అలాంటివారికి ఎప్పుడు అపజయం ఉండదు

2020-10-21 12:53 GMT

* జగ్గారెడ్డి ఎమ్మెల్యే అసెంబ్లీ మీడియా పాయింట్

* దుబ్బాకలో టీఆరెస్ అభ్యర్థి మళ్ళీ గెలిస్తే రాష్ట్ర ప్రజలకు శాపం కానుంది.

* సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కు పెద్దకొడుకు పాత్ర పోషిస్తున్నారు.

* దుబ్బాక లో టీఆరెస్ గెలుపు ఖాయం అయింది--మెజారిటీ మాత్రమే అని మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు.

* దుబ్బాక లో టీఆరెస్ ధీమా ప్రచారం పోలీసులు- కలెక్టర్ సపోర్ట్ చేస్తున్నారు.

* దుబ్బాక లో టీఆరెస్ గెలిస్తే- మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ కు సీఎం పీఠం ఇచ్చినట్లే.

* టీఆరెస్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకున్నా కారు గెలిస్తే మళ్ళీ కేసీఆర్ కాలర్ ఎగరేస్తడు.

* ప్రభుత్వం చేసిన వైఫల్యాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తెచ్చినా ప్రజలు పట్టించుకోపోతే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపడలేరు.

* రాష్ట్ర ప్రజలందరూ దుబ్బాక లో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి టీఆరెస్ ను ఓడించమని చెప్పండి.

* ఉస్మానియా- కాకతీయ విద్యార్థి పిల్లలు ఎక్కడ ఉన్నారు--ఉద్యమంలో టీఆరెస్ అన్నారు ఉద్యోగం రాలేదు...ఇప్పుడైనా మేల్కొండి.

* దుబ్బాక లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతధి--టీఆరెస్ గెలిస్తే ఇంతకంటే ఎక్కువ వరదలు వస్తాయి.

* దుబ్బాక ప్రజలు తమ జీవితాలు మార్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది.

* దుబ్బాక లో టీఆరెస్ ఓడిపోతే హరీష్ రావు మంత్రి పదవి ఉండదు- వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట టిక్కెట్టు ఉండదు.

* దుబ్బాక ఉపఎన్నిక హరీష్ రావు రాజకీయ జీవితం ముడిపడి ఉంది.

2020-10-21 12:47 GMT

సిద్దిపేట:

- హైదరాబాద్ వరద బాధితులకు సహాయంగా 50వేలు సీఎం రిలీఫ్ ఫండ్ కు మంత్రి హరీష్ రావు కు చెక్ అందించిన సంపూర్ణేష్ బాబు..

- మానవత్వాన్ని చాటుకున్న సంపూర్ణేష్ ను అభినందించిన మంత్రి హరీష్ రావు

2020-10-21 11:51 GMT

-- మాజీ హోమ్ మంత్రి నాయిని నరసింహ రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్

-- నాయిని ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో మాట్లాడిన కేసీఆర్..

-- డాక్టర్లను అడిగి నాయిని ఆరోగ్యంపై ఆరాతీసిన కేసీఆర్...

-- గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో అపోలోలో ఐసియు లో చికిత్స పొందుతున్న నాయిని...

2020-10-21 11:48 GMT

హైదరాబాద్.. 

-హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదల వల్ల నెలకొన్న పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ .

-బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను అభినందించిన నరసింహన్.

-సహాయ కార్యక్రమాల కోసం తన వంతు సహాయంగా తన వ్యక్తిగత సేవింగ్స్ నుండి 25 వేల రూపాయలను సి.ఎం.ఆర్.ఎఫ్ కు అందించిన నరసింహన్.

-మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ కు కృతగ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.

2020-10-21 11:45 GMT

-డాక్టర్ కె.నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి..

-ఎక్కువ మంది కోస్తా, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణలో ఉన్నారు...

-ప్రతి సంవత్సరం దసరా పండుగకు వారి సొంతూళ్లకు వెళ్తుంటారు...

-తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంత ప్రసిద్దో దసరా సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే ఫేమస్...

-రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బస్సులు ఎలా నడిపించాలి అనే చర్చ వచ్చింది...

-ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లక్ష కిలోమీటర్లు ఎక్కువ తిరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర మీరు ఎక్కువ సర్వీసులు తిప్పటం వల్ల నష్టం వాటిల్లుతుందని చెబుతుంది...

-ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీరు ఎక్కువ సర్వీసులు నడిపించు కోండి, లేకపోతే మాకు అవకాశం ఇవ్వండి టాక్సీలు ఎక్కవ చెల్లిస్తామంటున్నారు..

-రెండు రాష్ట్రాలు బస్సులు తిప్పక పోవడం వల్ల ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు దాదాపు 50-60 కోట్ల రూపాయలు లాభాలు పొందే అవకాసం వుందనే వాదన కు బలం చేకూరుతుంది...

-ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు మిత్రులే. ప్రజల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను...

2020-10-21 11:37 GMT

నిర్మల్ జిల్లా//

సారంగాపూర్:-

-మండలంలోని జౌలీ బీట్, లక్ష్మీ పూర్ గ్రామాలలో చిరుత సంచారం..

-అడవుల్లో మేత మేయడానికి వెళ్లిన అవుపై దాడి చేసి చంపిన చిరుత పులి..

-అందోళన చెందుతున్న ప్రజలు

2020-10-21 11:34 GMT

ములుగు జిల్లా..

-భద్రాచలం వెంకటాపురం జాతీయ ప్రధాన రహదారి పై వాహనాలను ముమ్మరంగా తనిఖీలు,

-ఏజెన్సీ ప్రాంతం కావడం తో అనుమానిత వ్యక్తిలను వివరాలను తెలుసుకుంటున్నా పోలీసులు.

-ఇటువల జరిగిన ఎన్కౌంటర్ తో అప్రమత్తం అయిన వెంకటాపురం సర్కిలు పోలీసులు .

-తెలంగాణ చత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు.

2020-10-21 11:28 GMT

ఆదిలాబాద్.. 

-బిజెపి ఒబిసి జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పై మండిపడ్డ ఎమ్మెల్యే రామన్న

-దేశంలో అరవై శాతం ఉన్న బీసీలకు ఒరుగబెట్టింది ఏమిలేదు..

-దేశంలో చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది..

-అయినా కేంద్రం ప్రభుత్వం స్పందించలేదు..

-తెలంగాణ సర్కార్ బీసీలకు ఎంతో ప్రాదాన్యత ఇచ్చింది..

-తెలంగాణ సర్కార్ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పడం అబద్దం..

-దేశంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని కోరిన పట్టించుకోవడం లేదు..

-బీసీల అభివృద్ధి పై లక్ష్మణ్ తో బహిరంగ చర్చ సిద్దం..

-సవాల్ కు లక్ష్మణ్ స్పందించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే రామన్న

2020-10-21 11:22 GMT

సిద్దిపేట జిల్లా:

//కిరాయి...పరాయి మనుషులతో కాంగ్రెస్, బిజెపి ప్రచారం చేస్తున్నారు

//అన్ని వర్గాల వర్గాల మద్దతు టిఆర్ఎస్ కు ఉంది

//సుజాతను గెలిపించి మహిళా శక్తిని చాటాలి

//సిఎం కేసీఆర్ దుబ్బాకలో పుట్టి పెరిగిండు

//ఉత్తమ్,బండి.సంజయ్ కు దుబ్బాక గురించి ఏం తెలుసు

//ఇంటింటికీ తాగునీటి ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కింది

//చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్, బిజెపి నేతలు

//ఫించన్లలో కేంద్రం వాటా లేనే లేదు

//బిజెపి సోషల్ మీడియా పుకార్ల పుట్ట...అబద్ధాల గుట్ట

//బిజెపి పాలిత రాష్ట్రం...నరేంద్ర మోడి రాష్ట్రంలో రూ.500

//బతుకమ్మకు పెద్ద కొడుకులా చీరలు ఇచ్చిండు కేసీఆర్

//కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేని ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చాం

//కళ్యాణ లక్ష్మీ...

//కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేనే లేవు

//సిద్దిపేట//దుబ్బాక ఆసుపత్రి కోసం రూ.18కోట్లు మంజూరు చేశాం

//కాంగ్రెస్, బిజెపి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన హరీష్ రావు

//ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చింది టిఆర్ఎస్

//బిజెపి బాయిల దగ్గర మీటర్లు పెడతామంటున్నారు

//కరోనా వస్తే మనిషికి 10కిలోల బియ్యం ఇచ్చి ఆదుకున్నాం

//దుబ్బాక నియోజకవర్గాన్ని రామలింగారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు

//బిజెపి నేతలు ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడడం కాదు

//క్షేత్ర స్థాయిలో తిరిగితే రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి బిజెపి నేతలకు తెలుస్తోంద

//మరింతగా అభివృద్ధి జరగాలంటే సుజాతక్కను భారీ మెజారిటీతో గెలిపించాలి

//ఉత్తమ్, బిజెపి నేతలు వానా కాలం ఉసిల్ల లాగా...ఎన్నికలప్పుడు వస్తరు

//ఎన్నికల తర్వాత ఉండేది టిఆర్ఎస్ నేతలే

Tags:    

Similar News