Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-19 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 19 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ సా.06-47 వరకు తదుపరి చవితి | విశాఖ నక్షత్రం రా.11-04 వరకు తదుపరి అనురాధ | వర్జ్యం: మ.02-49 నుంచి 04-19 వరకు | అమృత ఘడియలు రా.11-50 నుంచి 12-47 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ. 02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-19 15:53 GMT

మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే

#వరదల్లో చిక్కుకున్న ప్రజలతో మేము ఉంటే--ప్రభుత్వ ఆఫీసుల ముందు ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి.

#కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రప్పించి ఇక్క స్థానిక నేతలు విమర్శలు చేయాలి.

# నా నియోజకవర్గంలో పలువురు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.

# ఈ 550 కోట్లే కాకుండా ఇంకా సిఎం ప్రకటిస్తారని మేము అనుకుంటున్నాము.

ముఠా గోపాల్, ఎమ్మెల్యే

# చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రకృతి విపత్తు ఎదురైంది.

# వరదల్లో చిక్కుకున్న ప్రజలందరినీ ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుంది.

కాలేరు. వెంకటేష్ ఎమ్మెల్యే

#రాజకీయాలకు అతీతంగా నేతలందరూ ఇప్పుడు ప్రజలకు అండగా ఉండాలి.

#ముఖ్యమంత్రి కోరిన నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి.

2020-10-19 15:01 GMT

హైదరాబాద్..

ఏసిబి సోదాలు...

-నాగరాజు బినామి ని గుర్తించిన ఏసీబీ..

-బొల్లారం కు చెందిన వ్యక్తి గా గుర్తింపు..

-బినామి ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.

2020-10-19 14:57 GMT

hmtv తో దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్...

-కోవిడ్ తర్వాత ప్రారంభమైన రైళ్లకు అదనంగా దసరా నేపథ్యంలో 196 జతల ప్రత్యేక రైళ్లను ప్రకటించింది...

-ఈ రైలు ఈ నెల 20 - నవంబర్ 30 వరకు ఈ ప్రత్యేక రైళ్ళు నడుస్తాయి..

-దీనిలో జనరల్ కేటగిరి ఉండవు ఈ ప్రత్యేక రైళ్లు కాబట్టి రిజర్వేషన్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవచ్చు...

-ఇప్పటికే అన్ని కౌంటర్లలో రిజర్వేషన్లు బుకింగ్ ప్రారంభమైంది...

-ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైళ్లు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇక్కడి నుంచి ప్రత్యేక రైళ్లు కూడా ప్రారంభమవుతాయి...

-రద్దీ ఉన్న రూట్లలో సెలెక్ట్ చేసి ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించారు...

-కోవిడ్ నిబంధనల మేరకే రైల్వే ప్రయాణికులు వ్యవహరించాలి..

-మాస్కు తప్పని సరిగా ధరించాలి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చే ముందు ధర్మ స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుంది...

-ఇవి ప్రత్యేక రైలు కాబట్టి చార్జీలు కూడా అదనంగా ఉంటాయి...

-రైళ్లలో దుప్పట్లు ,క్యాటరింగ్ ఫెసిలిటీ ఉండదు..

2020-10-19 14:42 GMT

తెలంగాణ భవన్..

GHMCమేయర్ బొంతు రామ్మోహన్..

# పృకృతికి ఎవ్వరూ అతిథులు కాదు.

#నాయకులందరూ రాత్రి-పగలు తిరిగినా అకాల వర్షం అందరిని ముంచింది.

#NDRF బృందం- రెస్క్యూ ఆపరేషన్స్ రాత్రి 2-3 గంటలకు కూడా వెళ్లీ చేసి ప్రాణాలను కాపాడాము.

# GHMC నగర చరిత్రలో వరద కష్టాలు రాలేదు.

# కొన్ని ఏరియాల్లోకి కనీసం భోజనం ఇచ్చే పరిస్థితి కూడా లేదు.

# ప్రజలకు అండగా-ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు.

# ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం- GHMC ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

# 112 ఏళ్ల క్రితం 43 సెంటిమిటర్ల వర్షం నమోదు అయింది--కానీ మొన్న 24గంటల్లో 32 సెంటిమిటర్ల కావడం చరిత్ర.

#ఏడాది కాలంలో 120 సెంటిమిటర్ల వర్షపాతం నమోదు చరిత్ర--..120 కూడా దాటడం చరిత్ర లో ఇంతకు ముందు లేదు

2020-10-19 14:33 GMT

తెలంగాణ భవన్..

చామకూర.మల్లారెడ్డి..

రాష్ట్ర మంత్రి..

# 550 కోట్లు వరద నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు.

# వరదల్లో ఉన్న ప్రజల కోసం మంత్రులతో సహా కార్పొరేటర్లు 24 గంటలు పనిచేస్తున్నారు.

# రాత్రి సమయంలో నిద్రపోకుండా నాయకులు కష్టపడుతున్నారు

# ఒకటి తరువాత ఒకటి చేరువులన్ని తెగిపోయి--కాలనిలన్ని నీట మునిగాయి.

2020-10-19 14:06 GMT

తెలంగాణ భవన్..

మహమూద్ అలీ హోమ్ మంత్రి..

#1908 తరువాత మళ్ళీ అంతటి వరదలు వచ్చాయి.

# మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు.

#వర్షం- వరదల వల్ల చాలా డ్యామేజ్ అయింది- నష్టం జరిగింది.

#80మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు కేటీఆర్ చేశారు.

# ప్రజలకు ముఖ్యమంత్రి ఎప్పుడూ అండగా ఉన్నారు.

#మళ్ళీ మూడు- నాలుగు రోజుల వర్ష సూచన ఉంది-- ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.

#మూసి అభివృద్ధి కోసం కాంగ్రెస్- టీడీపీ ఎమీ చేయలేదు.

2020-10-19 13:55 GMT

తెలంగాణ భవన్..

తలసాని శ్రీనివాస యాదవ్ ..

రాష్ట్ర మంత్రి..

#ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కట్టిన అక్రమ కట్టడాలు ఎక్కడా లేవు-2014 తరువాత కట్టినవన్ని చట్టానికి లోబడే.

# ఇప్పుడు విమర్శలు చేస్తున్న నేతల పాలనలోనే ఇప్పుడు మునిగిన కట్టడాలు.

# వరదల ముంపు ప్రజలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్ కు గ్రేటర్ ప్రజలు- నేతల తరపున కృతజ్ఞతలు.

# వరదల్లో నష్టపోయిన ప్రజలెవ్వరూ ఆందోళన చెందొద్దు.

2020-10-19 13:38 GMT

ఎల్.రమణ టీటీడీపీ అధ్యక్షులు @ ఎన్టీఆర్ భవన్

-వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతుల సమస్యల తో పాటు హైదరాబాద్ నగరంపై పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం జరగడం పై టీడీపీ సమీక్ష   జరిగింది..

-గతంలో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటించి వారికి నష్టపరిహారం ఇచ్చేవారని ప్రస్తుతం ఎవరు చేయడం లేదు...

-సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఆరు సంవత్సరాలుగా పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్సు రాని పరిస్థితి ఏర్పడింది...

-లక్షల ఎకరాల్లో వరి పత్తి పంటలు వరదల్లో మునిగి పోయాయి...

-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి...

-నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి...

-రైతుల కోసం టిడిపి ధర్నాలు నిరసన దీక్షలు చేస్తుంది...

-హైదరాబాద్ లో 180 చెరువులు మరమ్మత్తు చేస్తామని నాళాలను రిపేర్ చేస్తామని 30 వేళా కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి 300 కోట్లు కూడా ఖర్చు చేయలేదు...

-ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి..

2020-10-19 13:14 GMT

పెద్దపెల్లి జిల్లా :

-కమాన్ పూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రజాశక్తి దళ కమాండర్ మల్లన్న పేరిట వెలిసిన వాల్ పోస్టర్

-జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా విఆర్వో,జూనియర్ అసిస్టెంట్ లను తహశీల్దార్ కార్యాలయంలోకి అనుమతించవద్దని హెచ్చరిక

-నకిలీ వాల్ పోస్టర్ అంటున్న పోలీసులు

2020-10-19 11:37 GMT

--కీసర తహసీల్దార్ నాగరాజు మృతి ఏసీబీ తీరుపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన నాగరాజు కుటుంబ సభ్యులు..

--నాగరాజు మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని కోరిన పిటిషన్..

--నాగరాజు పై తప్పుడు కేసులు పెట్టిన ఏసీబీ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు...

Tags:    

Similar News