Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 19 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ సా.06-47 వరకు తదుపరి చవితి | విశాఖ నక్షత్రం రా.11-04 వరకు తదుపరి అనురాధ | వర్జ్యం: మ.02-49 నుంచి 04-19 వరకు | అమృత ఘడియలు రా.11-50 నుంచి 12-47 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ. 02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 19 Oct 2020 3:53 PM GMT

    Telangana updates: ప్రభుత్వ ఆఫీసుల ముందు ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి!

    మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే

    #వరదల్లో చిక్కుకున్న ప్రజలతో మేము ఉంటే--ప్రభుత్వ ఆఫీసుల ముందు ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి.

    #కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రప్పించి ఇక్క స్థానిక నేతలు విమర్శలు చేయాలి.

    # నా నియోజకవర్గంలో పలువురు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.

    # ఈ 550 కోట్లే కాకుండా ఇంకా సిఎం ప్రకటిస్తారని మేము అనుకుంటున్నాము.

    ముఠా గోపాల్, ఎమ్మెల్యే

    # చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రకృతి విపత్తు ఎదురైంది.

    # వరదల్లో చిక్కుకున్న ప్రజలందరినీ ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుంది.

    కాలేరు. వెంకటేష్ ఎమ్మెల్యే

    #రాజకీయాలకు అతీతంగా నేతలందరూ ఇప్పుడు ప్రజలకు అండగా ఉండాలి.

    #ముఖ్యమంత్రి కోరిన నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి.

  • A.C.B.updates: కీసర నాగరాజు కేసులో ఇంకా బినామిల పై జరుగుతున్న ఏసీబీ సోదాలు..
    19 Oct 2020 3:01 PM GMT

    A.C.B.updates: కీసర నాగరాజు కేసులో ఇంకా బినామిల పై జరుగుతున్న ఏసీబీ సోదాలు..

    హైదరాబాద్..

    ఏసిబి సోదాలు...

    -నాగరాజు బినామి ని గుర్తించిన ఏసీబీ..

    -బొల్లారం కు చెందిన వ్యక్తి గా గుర్తింపు..

    -బినామి ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.

  • Railways updates: దక్షిణ మధ్య రైల్వే నుండి నలభై రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి...
    19 Oct 2020 2:57 PM GMT

    Railways updates: దక్షిణ మధ్య రైల్వే నుండి నలభై రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి...

    hmtv తో దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్...

    -కోవిడ్ తర్వాత ప్రారంభమైన రైళ్లకు అదనంగా దసరా నేపథ్యంలో 196 జతల ప్రత్యేక రైళ్లను ప్రకటించింది...

    -ఈ రైలు ఈ నెల 20 - నవంబర్ 30 వరకు ఈ ప్రత్యేక రైళ్ళు నడుస్తాయి..

    -దీనిలో జనరల్ కేటగిరి ఉండవు ఈ ప్రత్యేక రైళ్లు కాబట్టి రిజర్వేషన్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవచ్చు...

    -ఇప్పటికే అన్ని కౌంటర్లలో రిజర్వేషన్లు బుకింగ్ ప్రారంభమైంది...

    -ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైళ్లు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇక్కడి నుంచి ప్రత్యేక రైళ్లు కూడా ప్రారంభమవుతాయి...

    -రద్దీ ఉన్న రూట్లలో సెలెక్ట్ చేసి ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించారు...

    -కోవిడ్ నిబంధనల మేరకే రైల్వే ప్రయాణికులు వ్యవహరించాలి..

    -మాస్కు తప్పని సరిగా ధరించాలి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చే ముందు ధర్మ స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుంది...

    -ఇవి ప్రత్యేక రైలు కాబట్టి చార్జీలు కూడా అదనంగా ఉంటాయి...

    -రైళ్లలో దుప్పట్లు ,క్యాటరింగ్ ఫెసిలిటీ ఉండదు..

  • Telangana Bhavan updates: భారీ వర్షానికి వేల ఇండ్లు నీళ్లలో మునిగాయి!
    19 Oct 2020 2:42 PM GMT

    Telangana Bhavan updates: భారీ వర్షానికి వేల ఇండ్లు నీళ్లలో మునిగాయి!

    తెలంగాణ భవన్..

    GHMCమేయర్ బొంతు రామ్మోహన్..

    # పృకృతికి ఎవ్వరూ అతిథులు కాదు.

    #నాయకులందరూ రాత్రి-పగలు తిరిగినా అకాల వర్షం అందరిని ముంచింది.

    #NDRF బృందం- రెస్క్యూ ఆపరేషన్స్ రాత్రి 2-3 గంటలకు కూడా వెళ్లీ చేసి ప్రాణాలను కాపాడాము.

    # GHMC నగర చరిత్రలో వరద కష్టాలు రాలేదు.

    # కొన్ని ఏరియాల్లోకి కనీసం భోజనం ఇచ్చే పరిస్థితి కూడా లేదు.

    # ప్రజలకు అండగా-ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు.

    # ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం- GHMC ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

    # 112 ఏళ్ల క్రితం 43 సెంటిమిటర్ల వర్షం నమోదు అయింది--కానీ మొన్న 24గంటల్లో 32 సెంటిమిటర్ల కావడం చరిత్ర.

    #ఏడాది కాలంలో 120 సెంటిమిటర్ల వర్షపాతం నమోదు చరిత్ర--..120 కూడా దాటడం చరిత్ర లో ఇంతకు ముందు లేదు

  • Telangana Bhavan updates: వరద నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు..
    19 Oct 2020 2:33 PM GMT

    Telangana Bhavan updates: వరద నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు..

    తెలంగాణ భవన్..

    చామకూర.మల్లారెడ్డి..

    రాష్ట్ర మంత్రి..

    # 550 కోట్లు వరద నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు.

    # వరదల్లో ఉన్న ప్రజల కోసం మంత్రులతో సహా కార్పొరేటర్లు 24 గంటలు పనిచేస్తున్నారు.

    # రాత్రి సమయంలో నిద్రపోకుండా నాయకులు కష్టపడుతున్నారు

    # ఒకటి తరువాత ఒకటి చేరువులన్ని తెగిపోయి--కాలనిలన్ని నీట మునిగాయి.

  • Telangana Bhavan updates: వర్షం- వరదల వల్ల చాలా నష్టం జరిగింది!
    19 Oct 2020 2:06 PM GMT

    Telangana Bhavan updates: వర్షం- వరదల వల్ల చాలా నష్టం జరిగింది!

    తెలంగాణ భవన్..

    మహమూద్ అలీ హోమ్ మంత్రి..

    #1908 తరువాత మళ్ళీ అంతటి వరదలు వచ్చాయి.

    # మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు.

    #వర్షం- వరదల వల్ల చాలా డ్యామేజ్ అయింది- నష్టం జరిగింది.

    #80మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు కేటీఆర్ చేశారు.

    # ప్రజలకు ముఖ్యమంత్రి ఎప్పుడూ అండగా ఉన్నారు.

    #మళ్ళీ మూడు- నాలుగు రోజుల వర్ష సూచన ఉంది-- ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.

    #మూసి అభివృద్ధి కోసం కాంగ్రెస్- టీడీపీ ఎమీ చేయలేదు.

  • Telangana Bhavan updates: ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కట్టిన అక్రమ కట్టడాలు ఎక్కడా లేవు!
    19 Oct 2020 1:55 PM GMT

    Telangana Bhavan updates: ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కట్టిన అక్రమ కట్టడాలు ఎక్కడా లేవు!

    తెలంగాణ భవన్..

    తలసాని శ్రీనివాస యాదవ్ ..

    రాష్ట్ర మంత్రి..

    #ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కట్టిన అక్రమ కట్టడాలు ఎక్కడా లేవు-2014 తరువాత కట్టినవన్ని చట్టానికి లోబడే.

    # ఇప్పుడు విమర్శలు చేస్తున్న నేతల పాలనలోనే ఇప్పుడు మునిగిన కట్టడాలు.

    # వరదల ముంపు ప్రజలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్ కు గ్రేటర్ ప్రజలు- నేతల తరపున కృతజ్ఞతలు.

    # వరదల్లో నష్టపోయిన ప్రజలెవ్వరూ ఆందోళన చెందొద్దు.

  • NTR Bhavan updates: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టం జరగడం పై టీడీపీ సమీక్ష   జరిగింది..
    19 Oct 2020 1:38 PM GMT

    NTR Bhavan updates: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టం జరగడం పై టీడీపీ సమీక్ష జరిగింది..

    ఎల్.రమణ టీటీడీపీ అధ్యక్షులు @ ఎన్టీఆర్ భవన్

    -వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతుల సమస్యల తో పాటు హైదరాబాద్ నగరంపై పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం జరగడం పై టీడీపీ సమీక్ష   జరిగింది..

    -గతంలో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటించి వారికి నష్టపరిహారం ఇచ్చేవారని ప్రస్తుతం ఎవరు చేయడం లేదు...

    -సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఆరు సంవత్సరాలుగా పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్సు రాని పరిస్థితి ఏర్పడింది...

    -లక్షల ఎకరాల్లో వరి పత్తి పంటలు వరదల్లో మునిగి పోయాయి...

    -కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి...

    -నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి...

    -రైతుల కోసం టిడిపి ధర్నాలు నిరసన దీక్షలు చేస్తుంది...

    -హైదరాబాద్ లో 180 చెరువులు మరమ్మత్తు చేస్తామని నాళాలను రిపేర్ చేస్తామని 30 వేళా కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి 300 కోట్లు కూడా ఖర్చు చేయలేదు...

    -ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి..

  • 19 Oct 2020 1:14 PM GMT

    Peddapalli updates: కమాన్ పూర్ లో లేఖ కలకలం!

    పెద్దపెల్లి జిల్లా :

    -కమాన్ పూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రజాశక్తి దళ కమాండర్ మల్లన్న పేరిట వెలిసిన వాల్ పోస్టర్

    -జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా విఆర్వో,జూనియర్ అసిస్టెంట్ లను తహశీల్దార్ కార్యాలయంలోకి అనుమతించవద్దని హెచ్చరిక

    -నకిలీ వాల్ పోస్టర్ అంటున్న పోలీసులు

  • 19 Oct 2020 11:37 AM GMT

    Telangana updates: మానవ హక్కుల కమిషన్ కు నాగరాజు కుటుంబ సభ్యులు....

    --కీసర తహసీల్దార్ నాగరాజు మృతి ఏసీబీ తీరుపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన నాగరాజు కుటుంబ సభ్యులు..

    --నాగరాజు మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని కోరిన పిటిషన్..

    --నాగరాజు పై తప్పుడు కేసులు పెట్టిన ఏసీబీ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు...

Print Article
Next Story
More Stories