Live Updates: ఈరోజు (18 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-18 01:31 GMT
తాజా వార్తలు 
Live Updates
2020-11-18 13:51 GMT

-రాములు నాయక్ @ గాంధీ భవన్

-హైదరాబాద్ లో జిహెచ్ఎంసి ఎన్నికలు చూస్తుంటే దొరల పాలనలా ఉంది

-ఎవరికీ సరిగా సమయం ఇవకుండ తమ ఇష్టానుసారంగా ఎన్నికలను ఇర్వహిస్తున్నరు

-వరదల పేరు మీద 10 వేలు ఇచ్చి ఓటు కొనుకుంటున్నరు

-మీ సేవ కేంద్రాల వద్ద జనాలు కోట్టుకుంటున్నా పరిస్తితి

-పైగా అప్లై చేయదానికి రూ. 300 కర్చు అవుతుంది

-ప్రభుత్వం ప్రజల నిసహయతను ఓట్ల రూపంలో వాడుకుంటుంది

-ఈ ప్రభుత్వం లో ప్రజా పాలన లేదు దోరల పాలన ఉంది.

-Ghmc ఎన్నికలు తెరాస కి గుణపాఠం చెప్పాలి

-కాంగ్రెస్ కి ఓటువేసి గెలిపించండి

-గతంలో కాంగ్రెస్ ఎన్నో అభివ్రుది పనులు చేసింది దీనిని దృష్టి లో పెట్టు వలసిందిగా కోరుతున్నరు

2020-11-18 13:43 GMT

-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ ప్రెస్ రిలీజ్

-వరద బాధితులు ఇంటి దగ్గరే ఉండండి మీ ఇంటి దగ్గరకే వచ్చి డబ్బులు ఇస్తామని కేటీఆర్ చెప్పారు

-ఇప్పటి వరకు చాలా మంది వరద బాధితులకు డబ్బులు రాలేదు

-మీ సేవ దగ్గర వందల సంఖ్యలో q లైన్ లు కడుతున్నారు

-ఉదయం నుండి రాత్రి వరకు లైన్లో నిలబడ్డ చాలా మంది అప్లికేషన్స్ ను స్వీకరించడం లేదు

-Q లైన్ లో వృద్ధులు, వికలాంగులు,చిన్న పిల్లల తల్లులు ఉంటున్నారు

-చాలా మంది లైన్ లో నిలబడి సొమ్ము జిల్లిపోయి కింద పడుతున్నారు

-లైన్ లో నిలబెట్టి ప్రజలను టి ఆర్ ఎస్ ప్రభుత్వం అవమనపరిస్తుంది

-ప్రజలను అవమనపర్చే హక్కు టి ఆర్ ఎస్ కు ఎవరు ఇచ్చారు

-తక్షణమే ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ క్షేమపన చెప్పాలి

-టి ఆర్ ఎస్ ఇచ్చే డబ్బులు ఏ ములకు సరిపోవు

-Mim ను అడ్డుపెట్టుకొని టి ఆర్ ఎస్ గెలవాలని చూస్తుంది

-టి ఆర్ ఎస్ కు ghmc ప్రజలు బుద్ది చెప్పుతారు

2020-11-18 12:31 GMT

-అంబర్ పేట నియోజకవర్గ టీఆరెస్ నాయకులు బీజేపీ లో చేరిక......

-కత్తుల సుదర్శన్, శ్రీలతలకు కండువా కప్పి ఆహ్వానించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...

-తెలంగాణ లో మార్పు రావాలని జిహెచ్ఎంసి లో బీజేపీ జెండా ఎగురాలని ప్రజలు భానిస్తున్నారు..

-ప్రగతి భవన్ లో కేసీఆర్ ఉన్నారు రాబోయే రోజుల్లో ఆసుదుద్దీన్ రావాలని తాపత్రయ పడుతున్నాడు...

-ఆసుదుద్దీన్ సీఎం కుర్చీలో కూర్చోవాలని తహతహలాడుతున్నాడు..

-టీఆరెస్ పార్టీ లో కీలకపాత్ర పోషిస్తూ అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం లో ఉన్న కత్తుల సుదర్శన్, శ్రీలత లకు బీజేపీ లోకి స్వాగతం పలుకుతున్నా..

-కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

2020-11-18 11:50 GMT

కొమురం భీం జిల్లా:

* బెజ్జూర్ మండలం లోని ఏటి గూడ వద్ద రహదారిపై దర్జాగా నిలబడి ప్రయాణికులను వెంటాడిన పెద్దపులి ప్రజలు పరుగులు తీయడంతో ఇద్దరు కిందపడిపోయిన    సంఘటన చోటుచేసుకుంది .

* పరుగులు తీస్తూ చెట్టు ఎక్కడంతో ప్రాణాలతో బయటపడ్డ యువకులు ప్రయాణం చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు.

* కమ్మర్గాం గుండె పల్లి గ్రామాల నుండి బెజ్జూర్ మండల కేంద్రానికి వస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

2020-11-18 11:19 GMT

 మాజీ మంత్రి తుమ్మల కామెంట్స్.

- గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నాపైన సోషల్ మీడియాలో చేస్తున్న దృష్ప్రచారాన్ని కండిస్తున్నా..

- రాజకీయ లబ్ధికోసం, స్వలాభం కోసం కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారం విషయంలో ఈరోజు ఆడిషన్ సీపీ పూజ గారికి పిర్యాదు చేశారు.

- నీచ రాజకీయాలు పాల్పడుతూ, వ్యక్తిగత ప్రతిష్ట ను కించపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిని గుర్తించాలని కోరారు.

- ముఖ్యమంత్రి నేను ఓడిపోయినా మంత్రిపదవి ఇచ్చి నన్ను ఆదరించారు. నేను ముఖ్యమంత్రి సహకారంతో మంత్రిగా ఖమ్మం అభివృద్ధికి కృషి చేశాను.

- ఖమ్మం పట్టణానికి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి, గోల్లపాడు ఛానల్ ఆధునీకరణ, దంసులాపురం రైల్వే బ్రిడ్జి, ఇంటింటికీ తాగు నీరు ఇచ్చి ఖమ్మం అభివృద్ధికి     కృషి చేసాను.

- కొంతమంది స్వార్థ పర శక్తులు పార్టీనీ, ప్రభుత్వాన్ని కించపరిచే వారు, తన పైన వున్న అక్కసుతో ఇటువంటి పనులు చేస్తున్నారు.

- అదృష్టం వల్లనో, కలిసొచ్చే పదవులు పొందిన వారు నీచమైన ఇటువంటి ప్రచారానికి పాల్పడుతున్నారు. అది వారి రాజకీయ జీవితానికి మంచిది కాదు.    ఇకనైనా అటువంటి చర్యలకు పాల్పడొద్దు.

- తాను కేసిఆర్ నాయకత్వంలో పనిచేస్తూ హైదరాబాద్,ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాసా విజయానికి కృషి చేస్తాను.

2020-11-18 11:09 GMT

జిహెచ్ఎంసి ఎన్నికల కు బీజేపీ 24 అసెంబ్లీ పరిధిలోకి ఎన్నికల ఇంచార్జి ల నియామకం..

1.ఎల్బీనగర్ - సంకినేని వెంకటేశ్వర రావు

2.మహేశ్వరం - యెన్నం శ్రీనివాస్ రెడ్డి

3.రాజేంద్రనగర్ - వన్నల శ్రీరాములు

4.శేరిలింగంపల్లి -ధర్మపురి అరవింద్

5.ఉప్పల్-ధర్మారావు

6.మాల్కజిగిరి -రఘునందన్ రావు

7.కుత్బుల్లాపూర్ - చాడ సురేష్ రెడ్డి

8.కూకట్ పల్లి - పెద్దిరెడ్డి

9. పటాన్ చేరు - పొంగులేటి సుధాకర్ రెడ్డి

10. అంబర్పేట్ - రేవూరి ప్రకాశ్ రెడ్డి

11.ముషీరాబాద్ - జితేందర్ రెడ్డి

12.సికింద్రాబాద్ - విజయరామ రావు

13.కంటోన్మెంట్ - శశిధర్ రెడ్డి

14.సనత్ నగర్ - మోత్కుపల్లి నర్సింహులు

15.జూబ్లీహిల్స్- ఎర్ర చంద్ర శేఖర్

16.ఖైరతాబాద్ - మృత్యుంజయ

17.నాంపల్లి - సాయం బాపురావు

18.చార్మినార్ -కాసిపేట లింగయ్య

19.గోశామహల్ - యెండల లక్ష్మీనారాయణ

20.కార్వాన్ - బొడిగే శోభ

21.మలక్ పేట - విజయపాల్ రెడ్డి

22.యకత్ పుర - రామకృష్ణ రెడ్డి

23.చాంద్రాయణగుట్ట - రవీంద్ర నాయక్

24.బహదూర్ పుర - సుద్దాల దేవయ్య..

2020-11-18 05:38 GMT

- మాజీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ లో బలమున్న నేతలతో చర్చలు.

- రేపు ఎల్లుండి లోపు కాషాయ గూటికి మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు.

- కీలక నేతల పై దృష్టి పెట్టిన అర్వింద్...

- వారిని గ్రేటర్ ఎన్నికలోపే బీజేపీ లో చేర్చి మరింత బలం పెంచుకునే ప్రయత్నం లో బీజేపీ.

2020-11-18 05:35 GMT

హైదరాబాద్ 

- మియా పూర్ ఎల్ బి నగర్ రూట్ లో ఆగి పోయిన మెట్రో రైలు

- దాదా పు 15 నిమిషాల పాటూ ఆగిన మెట్రో రైలు సేవలు

2020-11-18 05:34 GMT

   హైదరాబాద్ 

- గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పార్టీ కార్యక్రమాలకు దూరం.

- నిన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల కమిటీ సమావేశానికి డుమ్మాకొట్టిన అంజన్.

- బీజేపీ గ్రేటర్ ఎన్నికల ఇంచార్జ్ గా భూపెందర్ యాదవ్ రావడంతో కాంగ్రెస్ లో ఉన్న యాదవ్ లాంత బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం.

- ఇప్పటికే శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ కు రాజీనామా.

- అంజన్ అదే బాటలో నడుస్తాడా అనే చర్చ రాజకీయవర్గాలలో కొనసాగుతుంది.

- మరి కొంత మంది యాదవ్ నేతలను బీజేపీ వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్న కమలం పార్టీ

2020-11-18 05:12 GMT

  ములుగు జిల్లా:

- వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామం టోల్ గేట్ దగ్గర షిఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ కు ఢీ.....

- ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు....

- 108 సహాయంతో ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమం....

Tags:    

Similar News