Live Updates: ఈరోజు (18 నవంబర్ , 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-18 01:27 GMT
తాజా వార్తలు 
Live Updates
2020-11-18 13:36 GMT

 తిరుమల 

- మొదటి అంతస్తులో ఈఓ సమావేశం జరుగుతుండగా భారీ శబ్దం వచ్చి పొగలు కమ్ముకోవడంతో పరుగులు తీసిన ఉద్వోగులు

- నిమిషాల వ్యవధిలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.

- అగ్నిమాపక పరికరాలతో కంట్రోల్ చేసిన భద్రతా సిబ్బంది.

- ఫ్యాన్ వైర్లు కాలి పేలుడు శబ్దం వచ్చినట్లు భావిస్తున్న అధికారులు

- పరిశీలిస్తున్న భద్రతా, ఇంజనీరింగ్ అధికారులు

2020-11-18 13:33 GMT

  అమరావతి...

* అబ్దుల్ సలాం కేసు సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిల్ ధాఖలు చేసిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఏపీ అధ్యక్షుడు

* కేసులో నిందితులుగా ఉన్న పోలీసులు విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి రావన్న న్యాయవాది శ్రావణ్ కుమార్

* కాబట్టి సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరిన న్యాయవాది శ్రావణ్ కుమార్

2020-11-18 13:31 GMT

  గుంటూరు...

- వెల్దుర్తి తాహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

- కొంతకాలంగా రైతుల వద్ద పట్టాదార్ పాస్ బుక్ లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి రైతులు ఫిర్యాదు చేయడంతో    ఆకస్మికంగా తనిఖీ

- వెల్దుర్తి తాహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తనిఖీ నిర్వహించే సమయంలో అందుబాటులో లేని అధికారులు, సిబ్బంది, సిబ్బంది పనితీరుపై    మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపాటు

2020-11-18 12:21 GMT

 అనంతపురం:

* భారతీయ జనతా పార్టీ గతంలోనే ఎన్నికలను రద్దు చేయమని స్పష్టం చేసింది.

* గతంలో తక్కువ కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేశారు...

* కేసులు నమోదు అవుతున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలు అంటున్నారు.

* స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల రూ.వేల కోట్ల నిధులు నష్టపోతాం

* కోర్టు ఆదేశాల మేరకే ఎస్ ఈసీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు.

* జనసేన తో చర్చించి తిరుపతి ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం.

* తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి క్షేత్రస్థాయిలో పని చేస్తోంది.

* మేము ముందు ఉన్నామని టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది

* తిరుపతి ఎన్నికలతో రెండు పార్టీలకు బుద్ధి చెబుతాం.

* గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో అన్ని పార్టీలు బిజెపి వైపు చూస్తున్నాయి.

* కనీస సమయం ఇవ్వకుండా దుబ్బాక ఎన్నికల అనంతరం ఆగమేఘాల మీద గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రకటన రిలీజ్ చేశారు.

* అధికార పార్టీ బిజెపిని చూసి భయపడుతోంది.

* హెచ్ ఎం టీవీ తో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.

2020-11-18 11:56 GMT

  విజయవాడ

* సెలూన్ కి వెళ్లి ఇంటికి తిరిగిరాని బాలుడు వెంకట కృష్ణ..

* పోలీసులకు పిర్యాదు చేసిన తల్లిదండ్రులు..

* కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..

2020-11-18 11:54 GMT

 గుంటూరు :

* తండ్రి సెల్ ఫోన్ కోనివ్వలేదని కిడ్నాప్ డ్రామా ఆడిన వినయ్

* తండ్రి వద్ద పనిచేస్తున్న గుమస్తాతో కలసి డబ్బులు డిమాండ్ చేసిన వినయ్

2020-11-18 11:52 GMT

 తిరుమల:

* తిరుమలలో ఈనెల 22న కార్తీక వనభోజన మహోత్సవం

* పాపవినాశనం మార్గంలోని పార్వేట మండపం వద్ద వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసిన

* పార్వేట మండపంలో శ్రీదేవిభూదేవి సమేతంగా మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు

* పూజా కైంకర్యాలు అనంతరం కార్తీక వనభోజనం, భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ.

* ఈ సందర్భంగా శ్రీవారి అలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను రద్దు చేసిన టీటీడీ

2020-11-18 11:44 GMT

  అమరావతి...

* తుది నివేదిక సమర్పణకు రెండు వారాలు గడువు కోరిన సీబీఐ

* నిరాకరించిన హైకోర్టు ఈ నెల26 న సమర్పించాలని అదేశం

2020-11-18 11:42 GMT

  అమరావతి..

* పోలీసుల తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ప్రతిసారీ వాయిదా కోరడం భావ్యం కాదన్న న్యాయమూర్తి రాకేష్ కుమార్

* ఇలా మరలా వాయిదాలు కోరితే అంగీకరించలేమన్న న్యాయవాది రాకేష్ కుమార్

* ఇలా వాయిదాలు కోరితే వాదనలు ముందుకు రావడం లేదన్న న్యాయమూర్తి

* ఈ కేసు ఇంతకాలం విన్న తరువాత సరైన తీర్పు ఇవ్వలేకపోతే రిటైర్మెంట్ తరువాత జీవితాంతం బాధపడాల్సి వస్తుందని భావోద్వేగానికి లోనైన         న్యాయమూర్తి  రాకేష్ కుమార్

* రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయా అన్న ధర్మాసనం

* రాష్టంలో రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం పరిస్థితులు ఉన్నాయో లేవో అన్న అంశంపై వాదనలు వినిపించాలన్న న్యాయమూర్తి రాకేష్ కుమార్

* తదుపరి విచారణ బుధవారానికి వాయిదా

2020-11-18 11:29 GMT

 ప్రకాశం :

- మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి కామెంట్స్..

- రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోన పేరుతో గతంలో ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్...

- ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనుకోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం... మంత్రి బాలినేని.

Tags:    

Similar News