Live Updates: ఈరోజు (18 నవంబర్ , 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (18 నవంబర్ , 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

తాజా వార్తలు
Show Full Article

Live Updates

  • Tirumala Updates: టిటిడి పరిపాలనా భవనంలో స్వల్ప పేలుడు కలకలం..
    18 Nov 2020 1:36 PM GMT

    Tirumala Updates: టిటిడి పరిపాలనా భవనంలో స్వల్ప పేలుడు కలకలం..

     తిరుమల 

    - మొదటి అంతస్తులో ఈఓ సమావేశం జరుగుతుండగా భారీ శబ్దం వచ్చి పొగలు కమ్ముకోవడంతో పరుగులు తీసిన ఉద్వోగులు

    - నిమిషాల వ్యవధిలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.

    - అగ్నిమాపక పరికరాలతో కంట్రోల్ చేసిన భద్రతా సిబ్బంది.

    - ఫ్యాన్ వైర్లు కాలి పేలుడు శబ్దం వచ్చినట్లు భావిస్తున్న అధికారులు

    - పరిశీలిస్తున్న భద్రతా, ఇంజనీరింగ్ అధికారులు

  • Amaravati Updates: నంద్యాల అబ్దుల్ సలాం కుటుంభ కేసులో హైకోర్టులో పిల్ ధాఖలు...
    18 Nov 2020 1:33 PM GMT

    Amaravati Updates: నంద్యాల అబ్దుల్ సలాం కుటుంభ కేసులో హైకోర్టులో పిల్ ధాఖలు...

      అమరావతి...

    * అబ్దుల్ సలాం కేసు సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిల్ ధాఖలు చేసిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఏపీ అధ్యక్షుడు

    * కేసులో నిందితులుగా ఉన్న పోలీసులు విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి రావన్న న్యాయవాది శ్రావణ్ కుమార్

    * కాబట్టి సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరిన న్యాయవాది శ్రావణ్ కుమార్

  • Guntur District Updates: వెల్దుర్తి తాహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..
    18 Nov 2020 1:31 PM GMT

    Guntur District Updates: వెల్దుర్తి తాహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..

      గుంటూరు...

    - వెల్దుర్తి తాహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

    - కొంతకాలంగా రైతుల వద్ద పట్టాదార్ పాస్ బుక్ లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి రైతులు ఫిర్యాదు చేయడంతో    ఆకస్మికంగా తనిఖీ

    - వెల్దుర్తి తాహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తనిఖీ నిర్వహించే సమయంలో అందుబాటులో లేని అధికారులు, సిబ్బంది, సిబ్బంది పనితీరుపై    మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపాటు

  • Anantapur District Updatess: ప్రభుత్వం, ఎస్ ఈ సి వ్యక్తిగత ప్రతిష్టకు పోతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు...
    18 Nov 2020 12:21 PM GMT

    Anantapur District Updatess: ప్రభుత్వం, ఎస్ ఈ సి వ్యక్తిగత ప్రతిష్టకు పోతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు...

     అనంతపురం:

    * భారతీయ జనతా పార్టీ గతంలోనే ఎన్నికలను రద్దు చేయమని స్పష్టం చేసింది.

    * గతంలో తక్కువ కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేశారు...

    * కేసులు నమోదు అవుతున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలు అంటున్నారు.

    * స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల రూ.వేల కోట్ల నిధులు నష్టపోతాం

    * కోర్టు ఆదేశాల మేరకే ఎస్ ఈసీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు.

    * జనసేన తో చర్చించి తిరుపతి ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం.

    * తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి క్షేత్రస్థాయిలో పని చేస్తోంది.

    * మేము ముందు ఉన్నామని టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది

    * తిరుపతి ఎన్నికలతో రెండు పార్టీలకు బుద్ధి చెబుతాం.

    * గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో అన్ని పార్టీలు బిజెపి వైపు చూస్తున్నాయి.

    * కనీస సమయం ఇవ్వకుండా దుబ్బాక ఎన్నికల అనంతరం ఆగమేఘాల మీద గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రకటన రిలీజ్ చేశారు.

    * అధికార పార్టీ బిజెపిని చూసి భయపడుతోంది.

    * హెచ్ ఎం టీవీ తో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.

  • Vijayawada Updates: సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో మైనర్ బాలుడు మిస్సింగ్ కలకలం..
    18 Nov 2020 11:56 AM GMT

    Vijayawada Updates: సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో మైనర్ బాలుడు మిస్సింగ్ కలకలం..

      విజయవాడ

    * సెలూన్ కి వెళ్లి ఇంటికి తిరిగిరాని బాలుడు వెంకట కృష్ణ..

    * పోలీసులకు పిర్యాదు చేసిన తల్లిదండ్రులు..

    * కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..

  • Guntur District Updates: సత్తెనపల్లి వినయ్ కిడ్నాప్ కేసులో కొత్త కోణం...
    18 Nov 2020 11:54 AM GMT

    Guntur District Updates: సత్తెనపల్లి వినయ్ కిడ్నాప్ కేసులో కొత్త కోణం...

     గుంటూరు :

    * తండ్రి సెల్ ఫోన్ కోనివ్వలేదని కిడ్నాప్ డ్రామా ఆడిన వినయ్

    * తండ్రి వద్ద పనిచేస్తున్న గుమస్తాతో కలసి డబ్బులు డిమాండ్ చేసిన వినయ్

  • Tirumala Updates: తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవం...
    18 Nov 2020 11:52 AM GMT

    Tirumala Updates: తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవం...

     తిరుమల:

    * తిరుమలలో ఈనెల 22న కార్తీక వనభోజన మహోత్సవం

    * పాపవినాశనం మార్గంలోని పార్వేట మండపం వద్ద వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసిన

    * పార్వేట మండపంలో శ్రీదేవిభూదేవి సమేతంగా మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు

    * పూజా కైంకర్యాలు అనంతరం కార్తీక వనభోజనం, భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ.

    * ఈ సందర్భంగా శ్రీవారి అలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను రద్దు చేసిన టీటీడీ

  • Amaravati Updates: విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై హైకోర్టులో విచారణ...
    18 Nov 2020 11:44 AM GMT

    Amaravati Updates: విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై హైకోర్టులో విచారణ...

      అమరావతి...

    * తుది నివేదిక సమర్పణకు రెండు వారాలు గడువు కోరిన సీబీఐ

    * నిరాకరించిన హైకోర్టు ఈ నెల26 న సమర్పించాలని అదేశం

  • Amaravati Updates: హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్స్ పై విచారణ..
    18 Nov 2020 11:42 AM GMT

    Amaravati Updates: హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్స్ పై విచారణ..

      అమరావతి..

    * పోలీసుల తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ప్రతిసారీ వాయిదా కోరడం భావ్యం కాదన్న న్యాయమూర్తి రాకేష్ కుమార్

    * ఇలా మరలా వాయిదాలు కోరితే అంగీకరించలేమన్న న్యాయవాది రాకేష్ కుమార్

    * ఇలా వాయిదాలు కోరితే వాదనలు ముందుకు రావడం లేదన్న న్యాయమూర్తి

    * ఈ కేసు ఇంతకాలం విన్న తరువాత సరైన తీర్పు ఇవ్వలేకపోతే రిటైర్మెంట్ తరువాత జీవితాంతం బాధపడాల్సి వస్తుందని భావోద్వేగానికి లోనైన         న్యాయమూర్తి  రాకేష్ కుమార్

    * రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయా అన్న ధర్మాసనం

    * రాష్టంలో రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం పరిస్థితులు ఉన్నాయో లేవో అన్న అంశంపై వాదనలు వినిపించాలన్న న్యాయమూర్తి రాకేష్ కుమార్

    * తదుపరి విచారణ బుధవారానికి వాయిదా

  • Balineni Srinivasa Reddy Comments: రాష్ట్రంలో ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది...
    18 Nov 2020 11:29 AM GMT

    Balineni Srinivasa Reddy Comments: రాష్ట్రంలో ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది...

     ప్రకాశం :

    - మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి కామెంట్స్..

    - రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోన పేరుతో గతంలో ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్...

    - ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనుకోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం... మంత్రి బాలినేని.

Print Article
Next Story
More Stories