Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-17 01:13 GMT
Live Updates - Page 2
2020-09-17 11:28 GMT

Anantapur updates: జనసేన పీఏసీ సభ్యుడు చిలకం మధుసూదన్ రెడ్డి కి భద్రత తొలగింపు..

అనంతపురం:

-సెక్యురిటీ సమస్య ఉందన్న కారణం తో రెండు నెలల కిందట గన్ మెన్ లను కేటాయించిన ప్రభుత్వం.

-ఇవాళ హైదరాబాద్ లో ఉండగా ఉన్న ఫలంగా గన్ మెన్ ల తొలగింపు.

-ప్రభుత్వ తీరు పై ఆందోళన వ్యక్తం చేస్తున్న మధుసూదన్ రెడ్డి.

-గన్ మెన్ లను పునరుద్ధరించాలని డిమాండ్

2020-09-17 11:25 GMT

Kadapa updates: ట్రిపుల్ ఐటీలలో ఇంత వరకు పరీక్షలు జరపకపోవడం చాలా బాధాకరం.... తులసి రెడ్డి..

కడప :

పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి కామెంట్స్ ...

-బయట రాష్ట్రాలలో ఎగ్జామ్స్ పూర్తి అవడం ఎపి లో మాత్రం జరగక పోవడం విడ్డూరం.

-ప్రతి సంవత్సరం జూన్ లో అడ్మిషన్ లు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎపిలో దాదాపు గా 5 నెలలు గడుస్తున్నా అడ్మిషన్ ప్రక్రియ పట్టించుకోని      అధికారులు...

-తెలంగాణ ట్రిపుల్ ఐటీలో ఇప్పటి కే అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది...

-తెలంగాణ ట్రిపుల్ ఐటిలో ఆంధ్రప్రదేశ్ సీట్ల వాటా 150 కోల్పోయే అవకాశం ఉంది...

-తెలంగాణ లో పదవ తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ విధానం ఆంధ్రప్రదేశ్ లో కామన్ గా పాస్ విధానం వల్ల అన్యాయం జరుగుతుంది...

-ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ...

-వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి గారు స్థాపించిన ట్రిపుల్ ఐటి లపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ ...

2020-09-17 11:01 GMT

Prakasam updates: చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.. మంత్రి వేణుగోపాల కృష్ణ..

ప్రకాశం జిల్లా..

మంత్రి వేణుగోపాల కృష్ణ కామెంట్స్,

-రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కోర్ట్లుల్లో స్టేలు తెచ్చుకొని స్టే బాబుగా మారిపోయాడు.

-గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తుంటే స్టేలు తెచ్చుకుంటున్నారు.

-తెలుగు దేశం పార్టీ జామ్ అయిపోయి జూముల్లో మాట్లేడేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.

-పేదరిక నిర్మూలన కోసం నవరత్నాలను తెచ్చి సిఎం జగన్ యజ్ణం చేస్తుంటే దానిని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు.

-ఇకనుండి చంద్రబాబు తనపేరును స్టే బాబుగా పేరు మార్చుకోవాలి.

-చంద్రబాబు స్టేలతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా సిఎం జగన్ యజ్ణాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు.

-అంతర్వేదీలో హిందూవాదాన్ని ఆయన తెరపైకి తేవడమే ఇందుకు భలమైన ఆధారం.

-సదావర్తి భూముల విషయంలో ఆనాడు చంద్రబాబు 40 దేవాలయాలను కూల్చేశాడు..పుస్కరాల్లో 29మంది చావుకు కారకుడయ్యాడు...సింహాచల భూములను     అన్యాక్రాంతం చేశాడు.

-చంద్రబాబు భూములను ఏవిదంగా అన్యాక్రాంతం చేశాడో...అవినీతి ఏస్థాయిలో చేశాడనే దానిపై సిబీఐ విచారణలో తేలేరోజు దగ్గరలోనే ఉంది.

2020-09-17 10:56 GMT

Vijayawada updates: మొగల్రాజపురం దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు..

విజయవాడ..

-ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు..

-సాయంత్రం మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం..

-డాక్టర్ మురళీధర్ పిఆర్ఓ ప్రమేయంతోనే దోపిడి..

-నిందితులు తాడేపల్లికి చెందిన గంజాయ్ బ్యాచ్ గా గుర్తింపు

2020-09-17 10:54 GMT

National updates: కుంభకోణాలను వెలికితీయాలని కోర్టులో ఆదేశించాలి..మిథున్ రెడ్డి..

మిథున్ రెడ్డి , వైఎస్ఆర్సిపి లోక్ సభ పక్షనేత..

-ప్రధానిని అందర్నీ కలిసి పరిస్తితి వివరిస్తాం

-ప్రజల అభివృద్ధి పనులు కు కూడా కోర్టు లు అడ్డుపడుతున్న

-న్యాయ వ్యవస్థలో కొంత మంది వల్ల ఈ పరిస్తితి

-కుంభకోణాలు దర్యాప్తు కోర్టులో అడ్డుపడడం వింతగా ఉంది

-పార్లమెంట్ లోపల మేము మాట్లాడే అధికారం ఉంది

2020-09-17 10:51 GMT

National updates: చట్టం ముందు అందరూ సమానులే.... విజయసాయి రెడ్డి..

జాతీయం..

విజయసాయి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత..

-కానీ దీన్ని విస్మరించి న్యాయవ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తుంది

-నేను ఏ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం లేదు

-అసాధారణ పరిస్థితుల్లో నిషేధం విధిస్తారు

-న్యాయ స్థానాలు మీడియా నోరు నొక్కు తున్నాయి

-పౌరుల ప్రాథమిక హక్కుల ను హరిస్తున్నారు

-ధర్మాన్ని కాపాడాల్సిన వారి వారే పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు

-ఒకటిన్నర సంవత్సరం ముందు అన్ని చట్ట బద్దమే

-ప్రజలే తీర్పు ఇవ్వాలి

-కేంద్రమే దీంట్లో జోక్యం చేసుకోవాలి

2020-09-17 10:48 GMT

Nellore updates: గ్రామ/వార్డు సచివాలయం పోస్టుల నియామక పరీక్షలపై జడ్పీ సీఈఓ సుశీల మీడియా సమావేశం..

నెల్లూరు..

జడ్పీ సీఈఓ సుశీల మీడియా సమావేశం..

-జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగు గ్రామ/వార్డు సచివాలయం పోస్టుల నియామక పరీక్షలు పై జడ్పీ సీఈఓ సుశీల మీడియా సమావేశం.

-జిల్లాలో 230 సెంటర్లు లో 54146 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు

-అభ్యర్థుల హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ కచ్చితంగా తీసుకొని రావాలి.. లేకుంటే అభ్యర్థి ని పరీక్షలకు అనిమతించము

-పరీక్ష కేంద్రానికి కనీసం 2 గంటలు ముందు రావాలి.ఒక నిమిషం ఆలస్యంగా లోపలికి అనుమతించము

-పత్రి ఒక్క అభ్యర్థి మాస్క గ్లోవుజ్ ధరించి సానిటేజర్ లు తెచ్చుకోవాలి

-కోవిడ్ పాజిటివ్ వచ్చిన అభ్యర్ధులకు పరీక్ష రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాము.

2020-09-17 10:46 GMT

Srikakulam updates: వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో ప్రతిపక్షాలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్..

శ్రీకాకుళం జిల్లా..

-30 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని జగన్ సంకల్పిస్తే..

-ప్రతిపక్షానికి ఎందుకు ఇంత ఏడుపు ? అర్ధం కావడం లేదు..

-దమ్ముంటే ప్రజాక్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎదురొడ్డి పోరాడాలి..

-కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకుని ప్రజల సంక్షేమాన్ని అడ్డుకోవడం ఏమిటి ?

-మీకు అసలు తలకాయ ఉందా ?

-ఎంత మంది పేదవారు ఇబ్బందులు పడుతున్నారో మీకు అర్ధం అవుతోందా ?

2020-09-17 10:37 GMT

Kadapa updates: మైదుకూరులో ప్ర‌ధాని న‌రేంద్ర మోడి జ‌న్మ‌దిన వేడుక‌లు...

క‌డ‌ప :

-మైదుకూరులో ప్ర‌ధాని న‌రేంద్ర మోడి జ‌న్మ‌దిన వేడుక‌లు...

-మోది జ‌న్మ‌దినం సంద‌ర్బంగా పారిశుద్ధ్య కార్మికుల‌కు వ‌స్త్రాలు పంపిణీ చేసిన బిజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షులు,

-మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి జిల్లా అధ్యక్షుడు కర్నాటి ఎల్లారెడ్డి

2020-09-17 10:31 GMT

Vijayawada updates: రధం పై నాలుగో సింహాన్ని బయటకు తీసిన దుర్గగుడి అధికారులు..

విజయవాడ..

-నాలుగో సింహాన్ని తూకం వేసిన అధికారులు

-3, 239 కేజి ల బరువు ఉన్నట్లుగా నిర్ధారణ

-స్టోర్ రూంలో బధ్రపరచనున్న దుర్గగుడి అధికారులు

-స్టోర్ రూమ్ లో సింహాలు ఉన్నాయా లేవా తనిఖీ చేసాం...సింహాలు లేవు అని తేలింది...

-నిన్న కొంత మందిని విచారణ అధికారి మూర్తి విచారణ చేశారు..

-రథానికి రక్షణ చర్యలు తీసుకుందాం అని పరదా తీస్తే సింహాలు లేవని తేలింది...

-విచారణ లో పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి..

-సింహాలు మాయం ఇపుడు జరిగిందా..గత హయాం లో జరిగిందా విచారణ లో తేలుతుంది...

-నేను ఈవో గా వచ్చినప్పుడు నుండి రథం కి ఉన్న పరదా తీయలేదు..

-దేవస్థానం తరపున మరో కమిటీ వేశాం...

Tags:    

Similar News