Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • East Godavari Updates: ఏలేరు ప్రాజెక్టు నుంచి 10 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తోన్న ఇరిగేషన్ అధికారులు
    17 Sep 2020 1:56 PM GMT

    East Godavari Updates: ఏలేరు ప్రాజెక్టు నుంచి 10 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తోన్న ఇరిగేషన్ అధికారులు

    తూర్పుగోదావరి :

    - భయం గుప్పిట్లో గొల్లప్రోలు, పిఠాపురం మండలాలు

    - ఇప్పటికే వరద ముంపులో 25 వేల ఎకరాలు, నీట మునిగిన పలు కాలనీలు..

  • Kadapa updates: ఆక్రమణ జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.. రఘురామిరెడ్డి ....
    17 Sep 2020 12:38 PM GMT

    Kadapa updates: ఆక్రమణ జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.. రఘురామిరెడ్డి ....

    కడప :

    మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కామెంట్స్ ...

    -అటవీశాఖ భూములను ఆక్రమించినట్లు టిడిపి ఇన్ చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన అరోపణలు నెల రోజుల్లో నిరూపించాలి...

    -నిరూపించని పక్షంలో మైదుకూరు నాలుగురోడ్ల కూడలిలో తప్పు ఒప్పుకొని, లెంపలు వేసుకోవాలి..

    -లేనిపక్షంలో చట్టపరంగా తీసుకొనే చర్యలకు సిద్ధంగా ఉండాలి..

    -గత ప్రభుత్వ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు..

    -అప్పట్లో ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్లు సంపాదించారు..

    -అలాంటి వ్యక్తి కి నాపై విమర్శలు చేసే హక్కు లేదు..

    -తొందరలోనే సుధాకర్ యాదవ్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతా..

  • 17 Sep 2020 12:36 PM GMT

    Vijayawada-Kanaka Durga: దుర్గ గుడిలో‌ సింహాల మాయంపై కేసు నమోదు చేసాం..సీపీ బి.శ్రీనివాసులు..

    విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు..

    -గుడి ఈఓను కూడా పిలిచాం సంఘటన జరగడానికి ముందే

    -మొత్తం ప్రార్ధన మందిరాల వారిని కూడా పిలిచాం

    -దుర్గగుడి సంఘటన జరగడానికి ముందే మీటింగ్ పిలిచి సీసీ కెమెరాలు పెట్టమన్నాం

    -దేవాలయాలు, ప్రార్ధన మందిరాల వారు వాలంటీర్లను పెట్టుకోవాలి

    -సీసీఎస్ కూడా దుర్గ గుడి సంఘటనపై విచారణ చేస్తారు

  • 17 Sep 2020 12:34 PM GMT

    Vijayawada updates: నేరం జరిగిన 48 గంటల్లో ఈ కేసు ఛేధించాం..సీపీ బి.శ్రీనివాసులు..

    విజయవాడ..

    విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు

    -48.50లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని డాక్టర్ మురళీధర్ కంప్లైంట్ ఇచ్చారు

    -ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది సూత్రధారులు, పాత్రధారులు

    -కేటరింగ్ నాగేంద్ర, పీఆర్ఓ మెండెం విజయ్, తాడేపల్లికి చెందిన క్రిమినల్స్ తో కలిసి డెకాయిటీ చేసారు

    -ఇప్పటికి ఐదుగురిని అరెస్టు చేసాం

    -నగదు 34.75లక్షల రూపాయలు, 48గ్రాముల బంగారం రికవరీ చేసాం

    -వెస్లీ అనే వ్యక్తికి నేర చరిత్ర ఉంది

    -ప్రతీ నెల లక్షల్లో బ్యాంకు ఈఎంఐ లు కట్టాలని డాక్టర్ తెలిపారు

    -మొత్తం బిల్డింగ్ మరమ్మత్తులు జరిగిన తరువాత సీసీ కెమెరాలు పెడతామన్నారు డాక్టర్

    -20 లక్షలు కట్టామని డాక్టర్ భార్యతో నిందితులు చెప్పారు

    -పీఆర్ఓ నే ముందుగా డాక్టర్ భార్యను ఎవరో బయట అనుమానాస్పదంగా తిరుగుతున్నారని అలర్ట్ చేసారు

  • 17 Sep 2020 12:25 PM GMT

    Amalapuram updates: కోనసీమ వ్యాప్తంగా రేపటి నుంచి మూడు రోజులపాటు 144 సెక్షన్...సబ్ కలెక్టర్ కౌశిక్..

    తూర్పు గోదావరి జిల్లా-అమలాపురం..

    సబ్ కలెక్టర్ కౌశిక్

    -ముందు స్థలము లేకుండా సభలు సమావేశాలు నిర్వహించి రాదు

    -ప్రజలు గుంపులు గుంపులుగా తిరగవద్దు

     డిఎస్పి బాషా హెచ్చరిక

    -చలో అమలాపురానికి అనుమతి లేదు :

    -డి ఐ జి కె వి మోహన్ రావు

    -రేపు చలో అమలాపురానికి పిలుపునిచ్చిన బిజెపి

    -అంతర్వేది సంఘటనలో కేసులు ఎత్తివేయాలని డిమాండ్ తో చలో అమలాపురం పిలుపునిచ్చిన బిజెపి

    -బిజెపి నాయకులను ముందస్తు హౌస్ అరెస్టు చేస్తున్న పోలీసులు

  • Tirumala-Tirupati updates: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపద్యంలో ముఖ్యమంత్రిని ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి....
    17 Sep 2020 12:16 PM GMT

    Tirumala-Tirupati updates: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపద్యంలో ముఖ్యమంత్రిని ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి....

    తిరుమల..

    -తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపద్యంలో ముఖ్యమంత్రి ని కలిసి తిరుమలకి ఆహ్వానిచిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి,

    -ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మ రెడ్డి

    -ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించిన టిటిడి ఈఓ అనీల్ కుమార్ సింఘాల్

  • 17 Sep 2020 12:12 PM GMT

    Amaravati updates: రేపు చలో అమలాపురం కు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు..

    అమరావతి..

    -రేపు చలో అమలాపురం కు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని విజయవాడలో నిర్బంధించిన విజయవాడ పోలీసులు

    -ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30,144 అమల్లో ఉన్నందున ముందస్తు నిర్బంధం చేసిన పోలీసులు

  • National updates: రాజ్యసభలో విజయసాయిరెడ్డి - టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మధ్య వాగ్వాదం..
    17 Sep 2020 12:04 PM GMT

    National updates: రాజ్యసభలో విజయసాయిరెడ్డి - టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మధ్య వాగ్వాదం..

    జాతీయం..

    -Covid 19 చర్యలపై రాజ్యసభలో చర్చ సందర్భంగా చోటు చేసుకున్న మాటల యుద్ధం.

    -కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడాల్సిన విజయసాయిరెడ్డి ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం అంటూ ఇతర అంశాలను ప్రస్తావించడంపై కనకమేడల తీవ్ర   అభ్యంతరం.

    -అనవసర అంశాలపై ప్రస్తావన తెస్తూ సభను తప్పుదోవ పట్టించడం తగదన్న కనకమేడల రవీంద్ర కుమార్

    -సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ కోర్టుల పరిధిలోని అంశాలపై చర్చించడం పై తీవ్ర అభ్యంతరం.

    -కోర్టు పరిధిలోని అంశాలపై పార్లమెంటులో మాట్లాడడం ద్వారా కోర్టులను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని కనకమేడల అభ్యంతరం.

    -విజయసాయిరెడ్డి మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ని కోరిన తెలుగుదేశం ఎంపీ.

    -ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం లాంటి అంశాలపై మాట్లాడరాదంటూ విజయసాయిరెడ్డిని వారించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్.

    -సంబంధిత అంశానికి మాత్రమే పరిమితం కావాల్సిందిగా సూచించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయన్.

  • Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
    17 Sep 2020 11:50 AM GMT

    Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

    అమరావతి..

    -అన్నదాతల పై కేసులు పెట్టడం జగన్ రెడ్డి గారి దిగజారుడుతనానికి నిదర్శనం.

    -కడుపు మండి రోడ్డెక్కిన రైతులని కేసుల పేరుతో వేధించడం దారుణం.

    -ధాన్యం కొనుగోలు చెయ్యకుండా ప్రభుత్వం చేతులెత్తేయడంతో నెల్లూరు జిల్లాలో రైతుల్ని దళారులు దోచుకుంటున్నారు.

    -నెల్లూరు జిల్లా సంగంలోని జాతీయ రహదారి పై ధర్నా నిర్వహించిన 15 మంది రైతుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి.

  • West Godavari updates: అంతర్వేది ఘటనపై కేసు సిబిఐ కి అప్పగించాం.. డిఐజి మోహనరావు..
    17 Sep 2020 11:31 AM GMT

    West Godavari updates: అంతర్వేది ఘటనపై కేసు సిబిఐ కి అప్పగించాం.. డిఐజి మోహనరావు..

    పశ్చిమ గోదావరి జిల్లా..

    - ఏలూరు రేంజ్ డిఐజి మోహనరావు..

    -నూతన రథం నిర్మాణం కూడా ప్రారంభించాం

    -వివాదంలో అరెస్ట్ అయిన హిందూవాదులు విడుదలయ్యారు

    -ఇంకా పలు రాజకీయ, మత సంస్థలు ఛలో అంతర్వేది కి వస్తున్నారు

    -తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది

    -కోనసీమలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు

    -ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయి

Print Article
Next Story
More Stories