Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Anantapur updates: జనసేన పీఏసీ సభ్యుడు చిలకం మధుసూదన్ రెడ్డి కి భద్రత తొలగింపు..
    17 Sep 2020 11:28 AM GMT

    Anantapur updates: జనసేన పీఏసీ సభ్యుడు చిలకం మధుసూదన్ రెడ్డి కి భద్రత తొలగింపు..

    అనంతపురం:

    -సెక్యురిటీ సమస్య ఉందన్న కారణం తో రెండు నెలల కిందట గన్ మెన్ లను కేటాయించిన ప్రభుత్వం.

    -ఇవాళ హైదరాబాద్ లో ఉండగా ఉన్న ఫలంగా గన్ మెన్ ల తొలగింపు.

    -ప్రభుత్వ తీరు పై ఆందోళన వ్యక్తం చేస్తున్న మధుసూదన్ రెడ్డి.

    -గన్ మెన్ లను పునరుద్ధరించాలని డిమాండ్

  • Kadapa updates: ట్రిపుల్ ఐటీలలో ఇంత వరకు పరీక్షలు జరపకపోవడం చాలా బాధాకరం.... తులసి రెడ్డి..
    17 Sep 2020 11:25 AM GMT

    Kadapa updates: ట్రిపుల్ ఐటీలలో ఇంత వరకు పరీక్షలు జరపకపోవడం చాలా బాధాకరం.... తులసి రెడ్డి..

    కడప :

    పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి కామెంట్స్ ...

    -బయట రాష్ట్రాలలో ఎగ్జామ్స్ పూర్తి అవడం ఎపి లో మాత్రం జరగక పోవడం విడ్డూరం.

    -ప్రతి సంవత్సరం జూన్ లో అడ్మిషన్ లు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎపిలో దాదాపు గా 5 నెలలు గడుస్తున్నా అడ్మిషన్ ప్రక్రియ పట్టించుకోని      అధికారులు...

    -తెలంగాణ ట్రిపుల్ ఐటీలో ఇప్పటి కే అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది...

    -తెలంగాణ ట్రిపుల్ ఐటిలో ఆంధ్రప్రదేశ్ సీట్ల వాటా 150 కోల్పోయే అవకాశం ఉంది...

    -తెలంగాణ లో పదవ తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ విధానం ఆంధ్రప్రదేశ్ లో కామన్ గా పాస్ విధానం వల్ల అన్యాయం జరుగుతుంది...

    -ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ...

    -వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి గారు స్థాపించిన ట్రిపుల్ ఐటి లపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ ...

  • Prakasam updates: చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.. మంత్రి వేణుగోపాల కృష్ణ..
    17 Sep 2020 11:01 AM GMT

    Prakasam updates: చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.. మంత్రి వేణుగోపాల కృష్ణ..

    ప్రకాశం జిల్లా..

    మంత్రి వేణుగోపాల కృష్ణ కామెంట్స్,

    -రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కోర్ట్లుల్లో స్టేలు తెచ్చుకొని స్టే బాబుగా మారిపోయాడు.

    -గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తుంటే స్టేలు తెచ్చుకుంటున్నారు.

    -తెలుగు దేశం పార్టీ జామ్ అయిపోయి జూముల్లో మాట్లేడేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.

    -పేదరిక నిర్మూలన కోసం నవరత్నాలను తెచ్చి సిఎం జగన్ యజ్ణం చేస్తుంటే దానిని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు.

    -ఇకనుండి చంద్రబాబు తనపేరును స్టే బాబుగా పేరు మార్చుకోవాలి.

    -చంద్రబాబు స్టేలతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా సిఎం జగన్ యజ్ణాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు.

    -అంతర్వేదీలో హిందూవాదాన్ని ఆయన తెరపైకి తేవడమే ఇందుకు భలమైన ఆధారం.

    -సదావర్తి భూముల విషయంలో ఆనాడు చంద్రబాబు 40 దేవాలయాలను కూల్చేశాడు..పుస్కరాల్లో 29మంది చావుకు కారకుడయ్యాడు...సింహాచల భూములను     అన్యాక్రాంతం చేశాడు.

    -చంద్రబాబు భూములను ఏవిదంగా అన్యాక్రాంతం చేశాడో...అవినీతి ఏస్థాయిలో చేశాడనే దానిపై సిబీఐ విచారణలో తేలేరోజు దగ్గరలోనే ఉంది.

  • Vijayawada updates: మొగల్రాజపురం దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు..
    17 Sep 2020 10:56 AM GMT

    Vijayawada updates: మొగల్రాజపురం దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు..

    విజయవాడ..

    -ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు..

    -సాయంత్రం మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం..

    -డాక్టర్ మురళీధర్ పిఆర్ఓ ప్రమేయంతోనే దోపిడి..

    -నిందితులు తాడేపల్లికి చెందిన గంజాయ్ బ్యాచ్ గా గుర్తింపు

  • 17 Sep 2020 10:54 AM GMT

    National updates: కుంభకోణాలను వెలికితీయాలని కోర్టులో ఆదేశించాలి..మిథున్ రెడ్డి..

    మిథున్ రెడ్డి , వైఎస్ఆర్సిపి లోక్ సభ పక్షనేత..

    -ప్రధానిని అందర్నీ కలిసి పరిస్తితి వివరిస్తాం

    -ప్రజల అభివృద్ధి పనులు కు కూడా కోర్టు లు అడ్డుపడుతున్న

    -న్యాయ వ్యవస్థలో కొంత మంది వల్ల ఈ పరిస్తితి

    -కుంభకోణాలు దర్యాప్తు కోర్టులో అడ్డుపడడం వింతగా ఉంది

    -పార్లమెంట్ లోపల మేము మాట్లాడే అధికారం ఉంది

  • 17 Sep 2020 10:51 AM GMT

    National updates: చట్టం ముందు అందరూ సమానులే.... విజయసాయి రెడ్డి..

    జాతీయం..

    విజయసాయి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత..

    -కానీ దీన్ని విస్మరించి న్యాయవ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తుంది

    -నేను ఏ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం లేదు

    -అసాధారణ పరిస్థితుల్లో నిషేధం విధిస్తారు

    -న్యాయ స్థానాలు మీడియా నోరు నొక్కు తున్నాయి

    -పౌరుల ప్రాథమిక హక్కుల ను హరిస్తున్నారు

    -ధర్మాన్ని కాపాడాల్సిన వారి వారే పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు

    -ఒకటిన్నర సంవత్సరం ముందు అన్ని చట్ట బద్దమే

    -ప్రజలే తీర్పు ఇవ్వాలి

    -కేంద్రమే దీంట్లో జోక్యం చేసుకోవాలి

  • Nellore updates: గ్రామ/వార్డు సచివాలయం పోస్టుల నియామక పరీక్షలపై జడ్పీ సీఈఓ సుశీల మీడియా సమావేశం..
    17 Sep 2020 10:48 AM GMT

    Nellore updates: గ్రామ/వార్డు సచివాలయం పోస్టుల నియామక పరీక్షలపై జడ్పీ సీఈఓ సుశీల మీడియా సమావేశం..

    నెల్లూరు..

    జడ్పీ సీఈఓ సుశీల మీడియా సమావేశం..

    -జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగు గ్రామ/వార్డు సచివాలయం పోస్టుల నియామక పరీక్షలు పై జడ్పీ సీఈఓ సుశీల మీడియా సమావేశం.

    -జిల్లాలో 230 సెంటర్లు లో 54146 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు

    -అభ్యర్థుల హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ కచ్చితంగా తీసుకొని రావాలి.. లేకుంటే అభ్యర్థి ని పరీక్షలకు అనిమతించము

    -పరీక్ష కేంద్రానికి కనీసం 2 గంటలు ముందు రావాలి.ఒక నిమిషం ఆలస్యంగా లోపలికి అనుమతించము

    -పత్రి ఒక్క అభ్యర్థి మాస్క గ్లోవుజ్ ధరించి సానిటేజర్ లు తెచ్చుకోవాలి

    -కోవిడ్ పాజిటివ్ వచ్చిన అభ్యర్ధులకు పరీక్ష రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాము.

  • Srikakulam updates: వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో ప్రతిపక్షాలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్..
    17 Sep 2020 10:46 AM GMT

    Srikakulam updates: వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో ప్రతిపక్షాలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్..

    శ్రీకాకుళం జిల్లా..

    -30 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని జగన్ సంకల్పిస్తే..

    -ప్రతిపక్షానికి ఎందుకు ఇంత ఏడుపు ? అర్ధం కావడం లేదు..

    -దమ్ముంటే ప్రజాక్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎదురొడ్డి పోరాడాలి..

    -కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకుని ప్రజల సంక్షేమాన్ని అడ్డుకోవడం ఏమిటి ?

    -మీకు అసలు తలకాయ ఉందా ?

    -ఎంత మంది పేదవారు ఇబ్బందులు పడుతున్నారో మీకు అర్ధం అవుతోందా ?

  • Kadapa updates: మైదుకూరులో ప్ర‌ధాని న‌రేంద్ర మోడి జ‌న్మ‌దిన వేడుక‌లు...
    17 Sep 2020 10:37 AM GMT

    Kadapa updates: మైదుకూరులో ప్ర‌ధాని న‌రేంద్ర మోడి జ‌న్మ‌దిన వేడుక‌లు...

    క‌డ‌ప :

    -మైదుకూరులో ప్ర‌ధాని న‌రేంద్ర మోడి జ‌న్మ‌దిన వేడుక‌లు...

    -మోది జ‌న్మ‌దినం సంద‌ర్బంగా పారిశుద్ధ్య కార్మికుల‌కు వ‌స్త్రాలు పంపిణీ చేసిన బిజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షులు,

    -మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి జిల్లా అధ్యక్షుడు కర్నాటి ఎల్లారెడ్డి

  • Vijayawada updates: రధం పై నాలుగో సింహాన్ని బయటకు తీసిన దుర్గగుడి అధికారులు..
    17 Sep 2020 10:31 AM GMT

    Vijayawada updates: రధం పై నాలుగో సింహాన్ని బయటకు తీసిన దుర్గగుడి అధికారులు..

    విజయవాడ..

    -నాలుగో సింహాన్ని తూకం వేసిన అధికారులు

    -3, 239 కేజి ల బరువు ఉన్నట్లుగా నిర్ధారణ

    -స్టోర్ రూంలో బధ్రపరచనున్న దుర్గగుడి అధికారులు

    -స్టోర్ రూమ్ లో సింహాలు ఉన్నాయా లేవా తనిఖీ చేసాం...సింహాలు లేవు అని తేలింది...

    -నిన్న కొంత మందిని విచారణ అధికారి మూర్తి విచారణ చేశారు..

    -రథానికి రక్షణ చర్యలు తీసుకుందాం అని పరదా తీస్తే సింహాలు లేవని తేలింది...

    -విచారణ లో పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి..

    -సింహాలు మాయం ఇపుడు జరిగిందా..గత హయాం లో జరిగిందా విచారణ లో తేలుతుంది...

    -నేను ఈవో గా వచ్చినప్పుడు నుండి రథం కి ఉన్న పరదా తీయలేదు..

    -దేవస్థానం తరపున మరో కమిటీ వేశాం...

Print Article
Next Story
More Stories