Live Updates: ఈరోజు (13 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 13 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | త్రయోదశి: సా.4-08 తదుపరి చతుర్దశి | చిత్త నక్షత్రం రా.10-28 తదుపరి స్వాతి | వర్జ్యం ఉ.7-32 నుంచి 9-02 వరకు తిరిగి తె.3.41 నుంచి 5.10 వరకు | అమృత ఘడియలు సా.4-30 నుంచి 5-59 వరకు | దుర్ముహూర్తం ఉ.8-21 నుంచి 9-06 వరకు .12-06 నుంచి 12-51 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-07 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
జగిత్యాల జిల్లా:
జగిత్యాలలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంను ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
🔹దుబ్బాక ఎలక్షన్ లో కేసీఆర్ కు ఊహించని దెబ్బ తగిలింది. టీఆరెస్ ఎమ్మెల్యే లందరికి బుద్ది వచ్చింది.
🔹ప్రజలు పనిచేసే ప్రభుత్వనికి పట్టం కట్టారు.
🔹తెలంగాణ ప్రజలకు చెప్పేది ఒకటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి పేరుకపోయింది.
🔹ఏ ప్రాజెక్టు లు కూడా పూర్తి కాలేదు. మిషన్ భగీరథ పూర్తి కాక ముందే పైపులు పలిగిపోతున్నాయి.
🔹కేసీఆర్ ఒక అబద్ధాల ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడు.
🔹ఏమన్నా అంటే కేంద్రం డబ్బులు ఇస్తాలేదు అని చెబుతాడు.
🔹కేసీఆర్ ఇకనైనా బుద్ది తెచ్చుకో మీరు ప్రజలకు చెప్పిన హామీలను నెరవేర్చండి.
కరీంనగర్ జిల్లా :
- మానేరు నుండీ యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా.
- అర్ధరాత్రి దాటిన తరువాత మానేరు లో ఇసుక అక్రమ తవ్వకాలు.
- రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తో మొదలైన గొడవలు
- బొమ్మకల్ శివారు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తుండగా పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.
- బ్లూ కోర్ట్ సిబ్బంది తో వాగ్వాదనికి దిగి దాడికి యత్నించిన ట్రాక్టర్ యజమానులు.
- విధులకు ఆటంకం కలిగించరంటూ అధికారులకు సమాచారం ఇచ్చిన బ్లూ కోర్ట్ పోలీసులు.
ప్రగతి భవన్...
- ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
- ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది.
- ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది.
- రేపు ఉదయం గవర్నర్ నామినేటెడ్ కోట ఎమ్మెల్సీల కు శాసనమండలిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తున్న అధికారులు.
ప్రగతి భవన్...
-గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు పేర్లు దాదాపు ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్...?
-మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య , గోరేటి వెంకన్న , దయానంద గుప్తా పేర్లు ఖరారు.
-మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించనున్న సీఎం కేసీఆర్.
-ఈ ముగ్గురిని ప్రగతి భవన్ రావాలని సమాచారం ఇచ్చిన ప్రగతి భవన్ అధికారులు.
-ప్రగతి భవన్ చేరుకున్న గవర్నర్ కోటా ఫైనల్ అయినా ఎమ్మెల్సీ అభ్యర్థులు... మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, దయానంద్ గుప్త.
టీఎస్ హైకోర్టు.....
- హైకోర్టు ను ఆశ్రయించిన ఎంపీ సుజనా చౌదరి...
- గతంలో సీబీఐ లుక్ ఔట్ నోటీసులు జారీ..
- అమెరికా వెళ్లేందుకు ప్రయత్నం చేసిన సుజనా ను అడ్డుకున్న ఎయిర్పోర్ట్ సిబ్బంది..
- ఇమ్మిగ్రేషన్ అభ్యన్తరం తో నిలిచిన సుజనా అమెరికా ప్రయాణం..
- హైకోర్టు లో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు..
ఖమ్మం
-రైతు వేదిక ప్రారంభానికి మాజీ మంత్రి తుమ్మల రాక....
-తుమ్మల చే రైతు వేదిక ప్రారంభానికి అధిష్టానం ఆహ్వానం.. పాల్గొంనున్న రవాణా శాఖ మంత్రి పువ్వడ అజయ్ కుమార్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి...
-మాజీ ఎం పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఆహ్వానం పలికిన అధిష్టానం
నల్గొండ జిల్లా:
- సిఐ తో వాగ్వాదం చేసి ఎకంగా ఆయన వాహనాన్నే ఎత్తుకెల్లిన మందుబాబులు..
- మిర్యాలగూడ టౌన్ ఈదులగూడా సర్కిల్ వద్ద రూరల్ సీఐ రమేష్ బాబు పోలీసు వాహనం చోరీ.
- అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న నలుగురు యువకులను సిఐ విచారిస్తుండగా..పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనం తో కోదాడ వైపు పరారైన యువకుడు.
- ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని పోలీసు వాహనం ఢీకొనడంతో..కారు ముందు భాగం ధ్వంసం.
- చేజింగ్ చేసి ఆలగడప టోల్ గేటు వద్ద వాహనాన్ని పట్టుకున్న రూరల్ ఎస్ఐ పరమేష్..
- పోలీసుల అదుపులో మందుబాబులు....
హైదరాబాద్
- సిగ్నల్ జంప్ చేసి మరి బులెట్ బైక్ పై వెళుతున్న భార్య భర్తలను ఢీ కొట్టిన బెంజ్ కార్.....
- బైక్ ఉన్న గౌతమ్ దేవ్(33) మృతి, భార్య శ్వేతా కు తీవ్ర గాయాలు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలింపు....
- బెంజ్ కారు ను నడిపిన వ్యక్తి కాశి విశ్వనాథ్ తన తో మిత్రుడు కౌశిక్.....
- కారు నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన కాశి విశ్వనాథ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- కార్ లో ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం...
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు.....
రంగారెడ్డి జిల్లా....
-ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిదిలోని రాగన్న గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం....
-అక్కడికక్కడే ఇద్దరు మృతి...
-ఇద్దరికి గాయాలయ్యాయి హస్పటల్ కు తరలింపు..
-బైక్ ను ఢీ కోట్టిన కారు.
-బైక్ పై వెళ్తున్న ఇద్దరు మృతి...
-సఫారీ కార్ లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలింపు....